ఢిల్లీలో బుధవారం ఏర్పాటుచేసిన సంస్మరణ సభకు లోక్సభ స్పీకర్ మీరాకుమార్, కేంద్రమంత్రులు పళ్లంరాజు, పనబాకలక్ష్మి, భాజపా అగ్రనేత వెంకయ్యనాయుడు, వాపక్షనాయకులు ఏచూరి, డి.రాజా, తితిదే ఛైర్మన్ కనుమూరి బాపిరాజుతోపాటు తెలుగుదేశం ఎంపీలంతా హాజరై ఎర్రన్నాయుడి సేవలను శ్లాఘించారు. ఎర్రన్నాయుడి మృతితో ఢిల్లీలో తెలుగుగొంతు మూగవోయినట్లయిందని ఆవేదన వ్యక్తంచేశారు.