తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు పెంచిన ఎందరో మహనీయుల గురించిన వ్యాసములు
విభాగము:
వివరణ:
కెవిరెడ్డి, బిఎన్రెడ్డి వంటి మహోన్నత దర్శకుడిని అందించి కడపజిల్లానుంచి తారాపథానికి చేరిన కొద్దిమంది అగ్రతారల్లో ఆయనొకరు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. ఈయన తొలి తెలుగు సినిమా విడుదలైన సంవత్సరం 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు.ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో "ద్రౌపదీ వస్త్రాపహరణం", "వందేమాతరం", "సుమంగళి", శోభనావారి "భక్త ప్రహ్లాద" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు. మారిన కాలంతో పాటు మారిన పద్ధతులు, వయోభారం వల్ల పద్మనాభం చాలా కాలంగా పరిశ్రమకు దూరంగా వుండిపోయారు. 'టాటా బిర్లా మధ్యలో లైలా' ఆయన ఆఖరి చిత్రం. అడపా దడపా తన జ్ఞాపకాలు చెబుతూ కాలం గడిపి చివరికి నవ్వులే మిగిల్చి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 20, 2010 ఉదయం గుండెపోటుతోఆయన మృతి చెందాడు. ఆయనకు సంతాపం తెలిపేందుకు ఎవరూ రాలేదని విమర్శలు వచ్చాయి గానీ హాస్య రసాస్వాదకులు, కళాభిమానులు ఆయనకు మన:పూర్వక నివాళులర్పించారు.
Body:
Post date: Wed, 02/20/2013 - 12:47
Path: /content/%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AD%E0%B0%82 |
విభాగము:
వివరణ:
మనిషి జీవితంలో వచ్చే పలు ఒత్తిడులు, అశాంతి నుండి బయటపడి మనశ్శాంతిగా, ఆనందంగా ఉంచగలిగే సున్నితమైన ఆయుధం హాస్యం అని చెప్పొచ్చు. ఈ హాస్యం ఏ మాత్రం పట్టుతప్పినా అపహాస్యం పాలవుతుంది. అటువంటి హాస్యాన్ని తమ నటన, వాచకంతో మెప్పించిన కస్తూరి శివరావు, చదల వాడ, నల్లరామ్మూర్తి, రమణారెడ్డి, రేలంగి, వంగర, శివరామ కృష్ణయ్య, తదితరులు ఒక ప్రత్యేకమైన నటనతో, హాస్యంతో ఆనాటి ప్రేక్షకులను నవ్వించగలిగారు. ఆయా సన్నివేశాలను చూసినప్పుడు నవ్వని నేటి ప్రేక్షకులు కూడా ఉండరు. వారితో పాటు నటించి నేటి తరం ప్రేక్షకులకు నవ్వుకు చిరునామాగా మారిన, హాస్యాన్నేకాదు, బాధను సైతం తన నటనలో పలికించిన 'హాస్యనటచక్రవర్తి', మంచి మనిషి రాజబాబు. హాస్యనటులు తమలో ఎంత బాధ ఉన్నా తెరపై చూసేవారికి నవ్వులు పూయించాలి. ఈ అనుభవం ఒకప్పటి ఎందరో హాస్యనటులకు అనుభవమే. అందుకే అన్నారేమో ఆత్రేయ 'నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి' అని. అలా కొన్ని సినిమాల్లో నవ్వించినా, మరికొన్ని సినిమాల్లో ఏడిపించినా అది ఆ హాస్యనటచక్రవర్తికే చెల్లింది. అంతేకాదు డైలాగ్ డెలివరీలో వేగం, దానికి తగ్గట్టుగా అభినయం, నేటి ప్రేక్షకులు బ్రేక్, షేక్ అని చెప్పుకునే డ్యాన్స్లను ఆనాడే చేసి హాస్యనటుల్లో అద్భుతమైన డ్యాన్సర్గా చెప్పదగ్గ హాస్యనటుడు రాజబాబు. రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1938 సంవత్సరం అక్టోబరులో ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురంలో పుణ్య మూర్తుల ఉమామహేశ్వరరావు, రవణమ్మ దంపతులకు జన్మించారు. ఈయనతోపాటు ఇప్పటి సినిమాల్లో నటిస్తున్న చిట్టిబాబు, అనంత్లు ఆయన తమ్ముళ్ళే. వీరు కూడా తెలుగులో మంచి హాస్యాన్ని అందించే హాస్యనటులుగా పేరుపొందారు. ఇంటర్మీడియట్తో పాటు టీచర్ ట్రైనింగ్ కోర్సును పూర్తిచేసిన రాజబాబు కొంతకాలం పాటు టీచర్గా కూడా పనిచేశారు. చిన్నప్పటి నుండి వున్న నటనాభిలాషతో రంగస్థలంపై 'కుక్కపిల్ల దొరికింది, నాలుగిళ్ళచావడి' వంటి నాటకాల్లో సైతం నటించి రంగస్థలంపై మంచి నటుడుగా పేరుతెచ్చుకున్నారు. ఒకసారి ఈయన రంగస్థలంపై వేసిన నాటకం చూసిన అప్పటి ప్రముఖ దర్శకులు గరికపాటి రాజారావుగారు ప్రోత్సహించటంతో 1960వ సంవత్సరంలో మద్రాసు వెళ్ళారు. ఆయన చెప్పిన ట్యూషన్లే ఆయనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాయి. అప్పట్లో నటుడు, దర్శకుడు అయిన అడ్డాల నారాయణరావుగారి పిల్లలకు పాఠాలు చెప్పిన రాజబాబుకు ఆయన తాను తీసిన 'సమాజం' చిత్రంలో అవకాశం ఇచ్చారు. అదే రాజబాబు సినీప్రస్థానంలో తొలి అడుగు. రావికొండలరావు, డా. గరికపాటి రాజారావుగార్ల ప్రోత్సాహంతో రంగస్థలం మీద కూడా తనను తాను నిరూపించుకున్నాడు. అంతేకాదు హాస్యనటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే వారని, ప్రతి ప్రముఖహీరో చిత్రంలోనూ తప్పనిసరిగా ఈయనకు ఓ పాత్ర ఉండేలా దర్శకులు, నిర్మాతలు చూసేవారని అంతగా ఆయన జనాభిమానం పొందారని ఆనాటి సినీఅభిమానుల మాట. అలా 20యేళ్ళపైబడి ఈయన సినీజీవితంలో 590కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను, విమర్శకులను సైతం మెప్పించారు. ఒక్క రమాప్రభతోనే జంటగా 300 సినిమాలు నటించాడని చెప్పుకుంటారు. అలా వెలిగిపోతున్న కాలంలో హీరో కంటే ముందుగా రాజబాబునే నిర్మాతలు బుక్ చేసుకునేవారు అనడంలో అతిశయోక్తి లేదు. తండ్రులు-కొడుకులు, కులగోత్రాలు, మంచిమనిషి, అంతస్తులు, భీష్మ, పరువుప్రతిష్ట, నవరాత్రి, పరమానందయ్యశిష్యులకథ, ఉమ్మడికుటుంబం, విచిత్రకుటుంబం, గూఢచారి 116, సాక్షి, బంగారుపిచ్చిక, రణభేరి, కథానాయకుడు, కోడలు దిద్దినకాపురం, అందాలరాముడు, మహాకవి క్షేత్రయ్య, అల్లూరి సీతారామరాజు, బుజ్జిబాబు, గడసరి అత్త సొగసరి కోడలు ఇలా ఎన్నో చిత్రాల్లో తన నవ్వులను పూయించారు. కేవలం హాస్యనటునిగానే కాకుండా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించి యస్వీరంగారావు, అంజలిదేవి వంటి మహా మహులు నటించిన 'తాతా మనవడు' చిత్రంలో హీరోగా నటించారు. ఆ చిత్రం ద్వారా ఆయన కేవలం హాస్యనటునిగానే కాకుండా సీరియస్, ఉదాత్తమైన పాత్రలు కూడా చేయగలరని నిరూపించింది ఆ చిత్ర ఘనవిజయం. పిచ్చోడిపెళ్ళి, తిరుపతి, ఎవరికివారే యమునాతీరే, మనిషిరోడ్డున పడ్డాడు వంటి చిత్రాల్లో కూడా హీరోగా నటించారు. ఈయనకు సినిమాల్లో జోడిగా లీలారాణి, మీనా కుమారి, ప్రసన్నరాణి, గీతాంజలి, రమా ప్రభ వంటి వారు నటించినా రాజబాబు- రమాప్రభల జంట హిట్ఫెయిర్గా ఎన్నో చిత్రాల విజయంలో తమ వంతు పాత్రను పోషించింది. నటనే కాకుండా గాయకు నిగా కూడా ఈయన అరుదుగా తన గళం వినిపించారు. ఈ పాట ప్రేక్షకులు అభిమానించే హాస్య పాటల్లో ప్రముఖమైన పాటగా నేటికీ ప్రేక్షకుల మన్ననలను అందుకుంటోంది అది ఇల్లు-ఇల్లాలు చిత్రంలో 'వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను' అంటూ సాగే పాటలో రాజబాబు గాత్రం వినిపించి ఆ పాటకు సరికొత్త అందాన్ని, ఆ చిత్ర విజయానికి దోహదం చేసిందంటే అతిశయోక్తికాదు. అలాగే నటీనటుల సరసనకు వస్తే ఎన్.టి.ఆర్.తో కథానాయకుడు, బడిపంతులు, అడవిరాముడు వంటి చిత్రాల్లో అద్భుతమైన హాస్యాన్ని పండించారు. అలాగే నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్బాబు, తదితర నటులతో ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్, ఇల్లు-ఇల్లాలు,గూఢచారి 116, జీవనజ్యోతి, సొగ్గాడు వంటి చిత్రాలు ఉదాహరణలు మాత్రమే. నటనలోనే కాదు వ్యక్తిత్వం లోను ఎంతో గొప్ప వాడని పించుకున్న హాస్యరస చక్రవర్తి ఆయన. రాజబాబు కెరియర్ ని పరిశీలిస్తే, మంచితనానికీ ... మానవత్వానికి ఆయన ప్రతీకలా కనిపించే సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అలాంటి సంఘటనే ఒకసారి ఓ చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది. అవి 'భలేకాపురం' (1980) సినిమా షూటింగ్ జరుగుతోన్న రోజులు. ఆ సినిమాకి గోపాలకృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మొదటి చిత్రం 'లక్ష్మణరేఖ' కావడంతో అందరూ ఆయనని 'లక్ష్మణరేఖ గోపాలకృష్ణ' అని పిలిచేవారు. ఇక 'భలే కాపురం' చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని చెన్నైలోని వాహినీ స్టూడియోలో ప్లాన్ చేశారు. ఆ రోజున రాజబాబు - రమాప్రభలపై కొన్ని హాస్య సన్నివేశాలను అక్కడ చిత్రీక రించవలసి ఉంది. అయితే, అప్పటికే అనారోగ్యం పాలైన రాజబాబు, ఆ స్టూడియో పక్కనే ఉన్న విజయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ పరిస్థితుల్లో ఆయనని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక గోపాలకృష్ణ స్టూడియోలోనే పచార్లు చేస్తున్నారు. తన కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న రాజబాబు, ఆసుపత్రి సిబ్బంది కంటపడకుండా తప్పించుకుని స్టూడియోకి వచ్చేశాడు. చక చకా మేకప్ వేయించుకుని గోపాలకృష్ణ ముందు ప్రత్యక్షమైపోయాడు. తనలో ఆవహించిన నీరసాన్ని తనదైన శైలి హుషారుతో కప్పిపెడుతోన్న రాజబాబుని చూసి ఆయన షాక్ అయ్యారు. ''ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చారు? మీరు కోలుకున్నాక ఈ సీన్లు చేసేవాడిని కదా'' అని గోపాలకృష్ణ కంగారుగా అన్నారు. "నేను ఎంతో మందికి ఎన్నో చేశాను ... మీకు మాత్రం ఏమీ చేయలేకపోయాను. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలా వచ్చేశాను'' అన్నారు రాజబాబు. ఆ మాటలకి కన్నీళ్లు పెట్టుకున్న ఆ దర్శకుడు, వెంటనే ఆయన సీన్స్ ని చక చకా తీసేసి పంపించారట. దాంతో రాజబాబు ఎలా వచ్చాడో అలాగే దొంగలా హాస్పిటల్ కి వెళ్లి ఏమీ ఎరుగనట్టు బెడ్ పై పడుకున్నాడట. అందుకే ఆయన అందరి హృదయాలలోనూ చిరంజీవిలా మిగిలిపోయారు. రాజబాబు ఎంత సంపాదించినా కూడా తన గతం ఎప్పుడూ మర్చిపోలేదు. ఎన్నో దానధర్మాలు చేసాడు. తన కష్టకాలంలో ఒక పాక హోటల్లోని స్త్రీ పెట్టిన టిఫిన్స్ గుర్తుంచుకుని ఆమె కొడుకులతో మంచి హోటల్ పెట్టించాడు. ఆయనకు తొలి ప్రేక్షకులు రాజమండ్రి రిక్షా కార్మికులు. ఆయన మిమిక్రీని చూసి ఆనందించి.. అభినందించిన వారిని ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకున్నారు. తనను కష్టాల్లో ఆదుకున్న మిత్రులను, సినిమాల్లో వేషాల కోసం తన ఫొటోలు తీసి పెట్టిన బాబు ఫొటో స్టూడియో వారిని కూడా అనునిత్యం తలచుకునే సంస్కారవంతుడు రాజబాబు. మద్రాసులో అడుగుపెట్టిన రాజబాబు మిమిక్రీ చేస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు సాగించారు. ఈ ప్రయత్నంలో ఆయన కొన్నిరోజులు కటిక ఉపవాసాలు కూడా చేశారు. ఆ సమయంలో మంచినీళ్లు ఇచ్చి ఆదుకున్న ప్రముఖ నటి, నర్తకి రాజసులోచన ఇంటి వాచ్మాన్ను కూడా చివరిదాకా తల్చుకున్నారంటే.. వేషాలు దొరికాక కృతజ్ఞత చెప్పడానికి అతన్ని వెదుక్కుంటూ వెళ్లారంటే... ఆయన గొప్పతనమేమిటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎన్నో సంస్థలకు విరాళాలిచ్చారు. కోరుకొండలో జూనియర్ కాలేజీని కట్టించారు., రాజమండ్రిలో పేదలకు ఇంటిస్థలం ఇచ్చారు. ఇలా ఎన్నో గుప్తదానాలు చేసిన దానశీలి. హాస్యం బ్రతికున్నం తకాలం ఆయన ప్రేక్షకుల మదిలో సదా చిరంజీవే. అవార్డుల విషయానికొస్తే వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డును పొందిన మొదటి హాస్యనటుడు రాజబాబే. తన నట జీవితంలో 9 ఫిలింఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులు ఇలా ఇంకా ఎన్నో సేవా సంస్థలు, ఇతరసంస్థల నుండి అవార్డులను అందుకున్నారు. శతాబ్దపు హాస్యనటునిగా కీర్తించ బడ్డ ఈయన్ను 'హాస్యనట చక్రవర్తి'గా పిలుచుకునేవారు. 1965లో వివాహమైన రాజబాబుకు ఇద్దరు పిల్లలు. రాజబాబు భార్య లక్ష్మి అమ్ములు, మహాకవి శ్రీశ్రీ మరదలు. ఇద్దరు అబ్బాయిలు. ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డారు. తమ్ముళ్లు చిట్టిబాబు, అనంత్ హాస్యనటులుగా కొనసాగుతున్నారు. అనుకరణకు అందని నటుడు రాజబాబు. వాచకంలోకాని, అభినయంలోకాని ఆయన శైలి ఎవరికి రాదు. అటువంటి గొప్ప హాస్యనటుడు, మంచి మనిషి 1983 సంవత్సరం ఫిబ్రవరి 14న స్వర్గస్తులయ్యారు. ఆయన మరణంతో ఓ మంచి హాస్యం కనుమరుగైపోయింది.
Body:
Post date: Thu, 02/14/2013 - 14:13
Path: /content/%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A8%E0%B0%9F-%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81 |
విభాగము:
వివరణ:
మహిళల సమస్యలపై, అంటరానితనంపై పోరాటం చేసిన సరోజినీనాయుడు హిందూముస్లీం భాయిభాయి అంటూ సఖ్యతను చాటారు. ఫిబ్రవరి 13, 1897న హైదరాబాద్ లోని బెంగాలీ బ్రాహ్మణ కుంటుంబంలో ఆమె జన్మించారు. తల్లిదండ్రులు అఘోరనాథ చటోపాధ్యాయ, వరద సుందరీ దేవి. శాస్త్రవేత్త,తత్వవేత్త అయిన అఘోరనాథ చటోపాధ్యాయ హైదరాబాద్లో నిజాం కాలేజీ ని స్థాపించి, ప్రిన్స్పాల్గా చాలా కాలం పనిచేశారు. తల్లి వరద సుందరీ దేవి కవియిత్రి. అమ్మనాన్నల అక్షరజ్ఞానాన్ని, సాహిత్యా భిరుచిని పుణికిపుచ్చుకున్న సరోజిని నాయుడు చిన్నతనం లోనే ఉర్దూ, తెలుగు, ఆంగ్లం, పర్షియన్, బెంగాలీ భాషలు అనర్గళంగా మాట్లాడేది. పిబిషెల్లీ కవిత్వాన్ని ఆమె చాలా ఇష్టపడేవారు. మహిళల విద్యపై అనేక ఆంక్షలు ఉన్న ఆ రోజుల్లోనే తల్లిదండ్రుల ప్రోత్సహంతో సరోజిని ఉన్నతవిద్యను అభ్యసించింది. 1891లో జరిగిన మెట్రిక పరీక్షలో రాష్ట్రం లోనే ప్రథమస్థానం లో ఉత్తీర్ణత పొందిన ఆమె అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆమె తెలివితేటలకు ఆశ్చర్య పడిన నిజాం నవాబు ఆమెను విదేశాలకు పంపించాడు. 1898 వరకు ఇటలీ,స్విట్జర్లాండ్ లో ఉండి అపారమైన విజ్ఞానాన్ని సంపాదించిన ఆమె ఎందరో ప్రపంచప్రఖ్యాతి గాంచిన రచయితల కవిత్వాలు, గ్రంధాలు చదివారు. ఎన్నో కవితలను రాసి విదేశీయుల ప్రసంశలను అందుకున్నారు. స్వదేశానికి తిరిగివచ్చిన తరువాత డిసెంబర్ 2, 1898లో డాక్టర్ గోవిందరాజులు నాయుడును ప్రేమవివాహము చేసుకున్నారు. వారి విహహాన్ని సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జరిపించాడు. సమాజంలో కులాంతర వివాహలను వ్యతిరేకిస్తున్నరోజుల్లో ఆమె తీసుకున్న సాహసోపేత చర్య ఎందరో ఆగ్రహానికి గురి చేసినా సరోజిని వాటిని లెక్కచేయకుండా ధైర్యంగా నిలిచారు. మహిళల విద్యకోసం, అంటరానితనం నిర్మూలన కోసం సరోజినీ రాజీలేని పోరాటం చేసిన ఆమె సాహిత్యంలోనూ విశేషకృషి చేశారు. 1905 గోల్డెన్ థ్రెషోల్డ్, 1912లో దబర్డ్ ఆఫ్ టైమ్, 1917లో ది బ్రోకెన్ వింగ్, ద పోయెమ్స్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ తదితర కవితాసంపుటాలు ప్రచురించ బడ్డాయి. ప్రముఖపోరాటయోధుడు గోపాలకృష్ణాగోఖలేతో 1912 సంవత్సరంలో జరిగిన పరిచయం ఆమెలో నూతనఉత్తేజాన్ని తీసుకువచ్చింది. హిందూ ముస్లింల సఖ్యత గురించి ప్రజలకు వివరించాలని ఆమె నిర్ణయించుకున్నారు. మార్చి 22, 1912 లో లక్నో నగరంలో జరిగిన ముస్లింలీగ్ మహాసభలో హిందూ ముస్లీం భాయిభాయి అంటూ అనర్గళంగా ఆమె చేసిన ప్రసంగం ఎందరినో ప్రభావితం చేసింది. ఆమె వాగ్ధాటికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు చేసిన నినాదాలు మిన్నంటాయి. హిందూ ముస్లీంలు ఐక్యపోరాటం ద్వారా ఆంగ్లేయులను తరిమికొట్టాలన్న ఆమె సందేశం ఎందరిలోనూ మార్పు తీసుకువచ్చింది. జాతిపిత మహ్మాతగాంధీని 1914 లో కలిసిన సరోజిని ఆయనకు ముఖ్యఅనుచరురాలిగా మారారు. 1916లో లక్నోలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొ నడంతో ఆమె రాజకీయ జీవితం ప్రారంభం అయ్యింది. 1930లో దండయాత్ర, ఉపðసత్యాగ్రహాలలో పాల్గొనందుకు గాను ఆమె కారాగార శిక్షను అనుభవించారు. 1931లో లండన్లో జరిగిన రౌండ్టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీజితో పాటుగా పాల్గొన్నారు. రాయల్ సొసైటీకి సభ్యురాలిగా ఎన్నికైయ్యారు. ఆమె కవితకు కెయిజర ఇ హింద్ స్వర్ణ పతకం లభించింది. భారతజాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలు గా ఆమె పేరు చిరస్మరణీయం. స్వతంత్య్రభారతంలో ఆమె 1949 వరకు యునైటెడ్ ప్రావిన్సెస్కు గవర్నర్గా పనిచేసి మహిళలు రాజకీయ రంగంలోనూ రాణించగలరని నిరూపించారు. కవికోకిలగా ప్రసిద్ది పొందిన ఆమె మార్చి 2, 1949 న లక్నోలో మరణించారు. సరోజినీ నాయుడు నివసించిన ఇంటికి ఆమె రాసిన మొదటి కవితాసంపుటి గోల్డెన్ థ్రెషోల్డ్ గా పేరు పెట్టి, హైదరాబాద్ యూనివర్సిటీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ హైదరాబాద్ పర్యటనకు గుర్తుగా నాడు గాంధీజీ నాటిన చెట్టు ఉంటుంది. మహిళా విద్యకోసం, హిందూ ముస్లీంల మధ్య సోరదభావం కోసం పనిచేసిన సరోజినీనాయుడు స్పూర్తితో నేటి మహిళలు ముందుకు సాగాలని, రాజకీయరంగంలో తమ ప్రతిభను చాటుకోవాలని ఆశిద్దాం.
Body:
Post date: Wed, 02/13/2013 - 11:30
Path: /content/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4-%E0%B0%95%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF%E0%B0%B2-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%AE%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B0%BF%E0%B0%A8%E0%B1%80-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81 |
విభాగము:
వివరణ:
సత్యం,శివం,సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి భాషణ మితహితం. సంభాషణ సరసచతురం. రేడియోకు "ఆకాశవాణి" అన్నపేరు పెట్టింది శర్మగారే. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించారు. 'నిగమశర్మ అక్క', 'నాచన సోముని నవీన గుణములు', 'తిక్కన తీర్చిన సీతమ్మ', 'రాయలనాటి రసికత' అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించారు. 'పెద్దన పెద్దతనము' అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు. రాళ్ళపల్లివారు అనంతపురం జిల్లా రాళ్ళపల్లి గ్రామంలో 1893 జనవరి 23న అలివేలు మంగమ్మ, కృష్ణమాచార్యులు పుత్రులుగా జన్మించారు. సంస్కృతాంధ్రములలో పండితులైన తండ్రి వద్ద సంస్కృతాంధ్రముల నభ్యసించారు. తల్లి కీర్తనలు, జానపదగేయాలను శ్రావ్యంగా గానం చేసేవారు. తల్లి నేర్పిన పాటలను యథాతథంగా నేర్చుకొన్నారు. మేనమామ ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం నేర్చుకున్నారు. 1906లో శర్మగారు మైసూరులోని పరకాల మఠంలో శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాలయతీంధ్రుల సన్నిధిలో వుంటూ శ్రీ చామరాజేంద్ర సంస్కృత కళాశాల విద్యార్ధిగా వ్యాకరణం సంస్కృత కావ్యాలను సాకల్యంగా అభ్యసించారు. 1910లో కట్టమంచి రామలింగారెడ్డిగారు మైసూరు మహారాజు కళాశాలలో చరిత్ర, తర్కం, తత్త్వశాస్త్రం, ఆంగ్ల సాహిత్యాచార్యులుగా బోధించేవారు. రెడ్డిగారితో పరిచయం వల్ల శర్మగారు ఆంధ్ర సాహిత్యంలో చక్కని పాండిత్యం గడించారు. రెడ్డి శర్మగారి ప్రతిభాపాటవాలను గుర్తించి మైసూరు మహారాజా కాలేజిలో తెలుగు పండితులుగా నియమింపచేశారు. బోధకాగ్రగణ్యులుగా పేరుగాంచిన శర్మ కాలేజీలో ముప్పది ఏళ్ళు పనిచేశారు. శర్మ, కట్టమంచి వారు సవిమర్శకంగా కవిత్రయ భారతాన్ని అధ్యయనం చేశారు. 1911లో, తారాదేవి, మీరాబాయి అనే ఖండకావ్యా లను రచించారు. 1913లో ”లీలావతి” అన్న నవలను వంగభాష నుండి కన్నడీకరించారు. కట్టమంచివారు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షులుగా వుండి వేమనపై ఉపన్యాసాలను అనంతపురంలోని సీడెడ్ డిస్ట్రిక్స్ కళాశాలలో ఏర్పాటు చేశారు. 1928 నవంబరు చివరన శర్మ వేమనపై చేసిన ఉపన్యాసాలు ఎంతో విజ్ఞానదాయక మైనవి. ఆ ఉపన్యాసాలలోని కొన్ని వాక్యాలు "ఇరు ప్రక్క లందును మరుగులేని మంచి పదనుగల చురకత్తివంటి కవితాశక్తి, దానికి మెరుగిచ్చినట్టి, సంకేత దూషితముగాని, ప్రపంచ వ్యవహారములందలి సూక్ష్మదృష్టి, గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్లు తిట్టుచునే నవ్వించు హాస్యకుశలత"… ఇవన్నియు వేమన్నను సృష్టిచేయునపుడు బ్రహ్మదేవుడుపయోగించిన మూల ద్రవ్యములు” అన్నారు. వేమన ద్వారా రాళ్ళపల్లి వారు కవి జీవిత కావ్యార్థ సమన్వయ విమర్శకు బాటవేశారు. రాళ్ళపల్లివారి సారస్వతోపన్యాసాలు, వారిని తెలుగు విమర్శకులలో అగ్రగణ్యునిగా చేశాయి. పీఠికా రచనలో కూడా రాళ్ళపల్లి గొప్ప పేరు గాంచారు. 1934లో బళ్ళారిలో ధర్మవరం కృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావుల స్మారకోత్సవంలో శర్మగారిచ్చిన ”నాటకోపన్యాసములు”లో నాటక లక్షణములను విపులంగా వివరించారు. సుందరపాండ్యుని ”ఆర్య”ను శర్మగారు తెనిగించారు. ప్రాకృత భాషలో పరిణితులైన శర్మగారి ”గాథా సప్తశతీసారము” వారి అనువాద సామర్ధ్యానికి నిదర్శనంగా వుంది. మధునాపంతులవారు రాళ్ళపల్లివారిని గురించి రాస్తూ ”సాహిత్య ప్రపంచమున కవితా విమర్శన శాఖకు వారి దర్శనము చిరంతన వసంతమన్నారు". శర్మగారు రచించిన ”గానకలె”, జీవమత్తుకలె” అన్న గ్రంథాలు వారి కన్నడ భాషా వైదుష్యానికి మచ్చుతునకలు. సంగీత ప్రియులైన శర్మగారు, సంగీత విద్వాంసులైన బిడారం కృష్ణప్పగారి వద్ద నాలుగైదేళ్ళు శాస్త్రీయంగా సాధన చేశారు. 1927లో అనంతపురంలో జరిగిన ఆంధ్రగాయక మహాసభలో శ్రోతలు భోజన సమయాన్ని విస్మరించి అత్యంత ఆసక్తితో విని వారి గానలహరిలో మునకలు వేశారు. మైసూరు మహారాజావారు ఏర్పాటుచేసిన కవితాపరీక్షలో ప్రథమబహుమతి నందుకొని మహారాజావారి దర్బారులో ఘన సత్కార మందుకొన్నారు. గానకళాసింధు, గానకళాప్రపూర్ణ, సంగీత కళానిధి బిరుదములందుకొన్నారు. మైసూరులో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి చెలికాని అన్నారావు తాళ్ళపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించవలసిందిగా ఆయన్ను కోరారు. ఆయన ఏడు సంవత్సరాలు (1950-57) సంకీర్తనలను పరిశీలించి కొన్నింటికి స్వరకల్పన గావించి వాటి గొప్పతనాన్ని చాటాడు.
సంగీత, సాహిత్య రంగాలలో విశిష్ట సేవలందించిన శర్మగారిని 1979 మార్చి 11న తి.తి.దేవస్థానం వారు ఆస్థాన విద్వాంసులుగా నియమించారు. వయోభారంతో వారు తిరుపతికి వెళ్ళలేక పోయారు కార్యనిర్వాహణాధికారి పి.వి.ఆర్.కె. ప్రసాద్గారు బెంగుళూరు వెళ్ళి సాయంత్రం 4 గంటలకు శర్మగారికి బిరుదు ప్రదానంచేసి సత్కరించారు. కాని ఆ దినం రాత్రం 7-05 గంటలకు శ్రీనివాసుని ఆస్థాన విద్వాంసులైన రాళ్ళపల్లివారు స్వర్గస్థులైనారు.
సత్యం,శివం,సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి భాషణ మితహితం. సంభాషణ సరసచతురం. రేడియోకు "ఆకాశవాణి" అన్నపేరు పెట్టింది శర్మగారే. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించారు. 'నిగమశర్మ అక్క', 'నాచన సోముని నవీన గుణములు', 'తిక్కన తీర్చిన సీతమ్మ', 'రాయలనాటి రసికత' అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించారు. 'పెద్దన పెద్దతనము' అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు. Body:
Post date: Wed, 01/23/2013 - 17:04
Path: /content/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%85%E0%B0%A8%E0%B0%82%E0%B0%A4%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE |
విభాగము:
వివరణ:
అయ్యదేవర కాళేశ్వరరావు స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను సైతం ఎదురొడ్డి పోరాటం సాగించిన మహా నాయకులలో తొలితరం తెలుగు నాయకులు కాశీనాథుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం మొదలైనవారు కాగా మలితరం మహానాయకులు డా.పట్ట్భాసీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి మొదలైనవారు. కాళేశ్వరరావు పశ్చిమ కృష్ణా జిల్లా నందిగామ వాసి. కాళేశ్వరరావు 1881 జనవరి 22వ తేదీన జన్మించారు. కాళేశ్వరరావు ప్రాథమిక విద్య స్వగ్రామం నందిగామలోనే జరిగింది. ఉన్నత విద్య కాస్త ఆలస్యంగా 1894-1901లో బందరులో జరిగింది. బందరులో రఘుపతి వెంకటరత్నంనాయుడుగారి శిష్యులైనారు. వేమూరి రామకృష్ణారావుగారివద్ద ఇంగ్లీషు అభ్యసించారు. అక్కడ డా.పట్ట్భా, ముట్నూరి కృష్ణారావుగారలతో మైత్రి ఏర్పడింది. ఇంగ్లీషులో లెక్కలలో ప్రావీణ్యం సంపాదించారు. మదరాసువెళ్లి ఇంజనీరు కావాలనుకున్న కాళేశ్వరరావు కోరిక నెరవేరలేదు. బందరులోనే చరిత్రలో పట్ట్భద్రుడు కావలసి వచ్చింది. కాళేశ్వరరావు ప్రతిభను గుర్తించి ఆయనను అదే స్కూలులో చరిత్ర ఉపాధ్యాయుడుగా ఏర్పాటుచేశాడు. 1901-1903 ఉపాధ్యాయుడిగా ఉండి మంచి పేరు తెచ్చుకున్నారు కాళేశ్వరరావు. 1904-1905 సంవత్సరాలలో కాళేశ్వరరావు మదరాసులో లా చదివి న్యాయవాది అయినారు. మదరాసులో వీరికి కొమర్రాజు లక్ష్మణరావు, కందుకూరి వీరేశలింగంగారలతో పరిచయం ఏర్పడింది. ఆ కారణంగా సంఘ సంస్కరణోద్యమ బీజం పడింది. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావం వలన వీరిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను వీరు పనిచేశారు. మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు. 1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించారు. ప్రజా ప్రతినిధిగా వీరు విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. వీరు ఎంతొమందికి విద్యాదానము చేసారు. 1939లో మదరాసు అసెంబ్లీకి కాంగ్రెస్ పక్షాన వియవాడ బందరులకు ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేసి అఖండ విజయం సాధించారు. రాజగోపాలాచారి ప్రధానమంత్రిగా మదరాసు ప్రభుత్వమేర్పడింది. దానిలో కాళేశ్వరరావు రాజగోపాలాచారిగారి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మద్యపాన నిషేధ చట్టం, సేల్సుటాక్సు, హరిజన దేవాలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో కాళేశ్వరరావు తన మేధాసంపత్తిని, భాషానైపుణ్యాన్ని ప్రయోగించి అందరి మన్ననలూ పొందారు. 1946లో శాసనసభకు విజయవాడ నుంచి ఎన్నికైన కాళేశ్వరరావు ప్రకాశంగారి పక్షం వహించారు. ప్రకాశంగారి మంత్రివర్గంలో కాళేశ్వరరావుకు మంత్రి పదవి రాలేదు కాని వారి శిష్యుడు వేముల కూర్మయ్యగారికి మంత్రి పదవి ఆయనవల్ల లభించింది. ప్రకాశంగారి ప్రభుత్వం ఏడాదిలోపే పడిపోయింది. అయినా కాళేశ్వరరావు ప్రకాశం పక్షాన ఉన్నారు. 1947లో బహుభార్యాత్వ నిషేధపు బిల్లు ప్రవేశపెట్టారు కాళేశ్వరరావు. 1955 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కాళేశ్వరరావు విజయవాడ స్థానం నుంచి ఎన్నికైనారు. తర్వాత ముఖ్యమంత్రి పదవికి గోపాలరెడ్డిగారు ఎన్నికయ్యారు. ఆవిధంగా ఏర్పడిన రాష్ట్ర తొలి అసెంబ్లీకి అయ్యదేవర కాళేశ్వరరావును తొలి స్పీకర్గా ఎన్నుకున్నారు. రాజకీయాలతో పాటు వీరు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు. విజయవాడలోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేశారు. కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి లో కార్యదర్శిగా పనిచేశారు. వీరు కారాగారంలో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర', 'తురుష్క ప్రజాస్వామికం', చీనా జాతీయోద్యమ చరిత్ర' మరియు 'ఈజిప్టు చరిత్ర' అను పుస్తకాలను రచించారు. ఈయన జీవిత చరిత్ర నవ్యాంధ్ర - నా జీవిత కథ అనే పుస్తక రూపంలో వెలువడింది. 1962 ఫిబ్రవరి 26వ తేదీన విజయవాడలో పరమపదించారు. అయ్యదేవర కాళేశ్వరరావు స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను సైతం ఎదురొడ్డి పోరాటం సాగించిన మహా నాయకులలో తొలితరం తెలుగు నాయకులు కాశీనాథుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం మొదలైనవారు కాగా మలితరం మహానాయకులు డా.పట్ట్భాసీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి మొదలైనవారు. Body:
Post date: Tue, 01/22/2013 - 00:27
Path: /content/%E0%B0%85%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%B0-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81 |
విభాగము:
వివరణ:
ఈయన అసలు పేరు వెంకటరావు ఖేడ్గీకర్. తండ్రి భాపూరావు, తల్లి యసుబాయి.1903 అక్టోబరు 3వ తేదీన అప్పటి హైదరాబాదు సంస్థానంలోని గుల్బర్గా జిల్లా, ఝవర్గీ తాలూకా సింద్గీ గ్రామంలో ఆయన జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1920 జూలై 31 వ తేదీ రాత్రి లోకమాన్య బాలగంగాధర తిలక్ కాలధర్మం చెందారన్న వార్త విని బ్రహ్మచారిగా తన జీవితాన్నంతా మాతృభూమి సేవకే అంకితం చేయగలను అని ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రకారమే ఉండిపోయిన ధీరోధాత్తుడు ఆయన. కళాశాల చదువుకు స్వస్తి చెప్పి, పూనాలోని తిలక్ విద్యాపీఠ్లో మూడేళ్ళు అధ్యయనం చేసి, ప్రజాస్వామ్యం, దాని క్రమాభివృద్ధి అనే అంశంపై సిద్ధాంత వ్యాసం రాసి పూనా విశ్వవిద్యాలయానికి సమర్పించి ఎం.ఏ పట్టాని పొందారు. తొలుత కార్మిక రంగంలో పనిచేసి, కారాగార శిక్ష అనుభవించి ఆరోగ్యం అనుకూలించక, మరాఠ్వాడాలో ఉస్మానాబాదు జిల్లాలోని హిప్పర్గిలో నెలకొల్పబడిన జాతీయ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులై, ఆరు సంవత్సరాలపాటు ఆ విద్యా సంస్థను గురుకుల పద్ధతిపై చక్కగా ఆయన నిర్వహించారు. 1932లో స్వామి నారాయణ అనే గురువు వీరికి ’విద్వత్ సన్యాసం ’ అనే పద్ధతి ప్రకారం సన్యాస దీక్ష ఇచ్చి, ఈయనకు ‘స్వామీ రామానంద తీర్థ’ అని నామకరణం చేశారు. 1938లో రాజకీయరంగంలోకి ప్రవేశించి ఆయన మహారా్రష్ట పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేసి, ఆ సంవత్సరమే తన నివాసాన్ని మోమినాబాదు నుంచి హైదరాబాదుకు ఆయన మార్చారు. స్టేట్ కాంగ్రెస్ అనే సంస్థను నెలకొల్పడానికి స్వామీజీ ప్రయత్నం చేస్తుండగా, స్టేట్ కాంగ్రెస్ సంస్థను నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్లో నిషేధించింది. ఆ నిషేధాజ్ఞలకు నిరశనగా స్వామి రామానంద తీర్థ హైదరాబాదులో 1938 అక్టోబరు 27వ తేదీన సత్యాగ్రహం చేయగా ప్రభుత్వం ఆయన్ను బంధించి, 18 నెలలు కఠిన శిక్షనమలుచేశారు. స్టేట్ కాంగ్రెస్ సంస్థపై నిషేధం తొలగించని కారణంగా, తాను వ్యక్తిగత సత్యాగ్రహం చేస్తానని స్వామీజీ అప్పటి హైదరాబాద్ నిజాం ప్రభుత్వానికి తెలియచేయగా, 1940 సెప్టెంబర్ 11 వ తేదీన ఆయనను బంధించి, ప్రజారక్షణ నిబంధనల క్రింద నిజామాబాద్ కారాగారంలో నిర్బంధంలో ఉంచారు.1942-1950 సంవత్సరాల మధ్య హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు.దేశీయ సంస్థానాల మహాసభ కార్యనిర్వాహక వర్గ సభ్యులుగా ఉన్నారు. 1942 ఆగస్ట్లో క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానం ఆమోదింపబడ్డ బొంబాయి కాంగ్రెస్ సభలో పాల్గొని షోలాపూర్ నుంచి వీరు తిరిగిరాగానే ఆయనను నిజాం ప్రభుత్వం బంధించి1943 డిసెంబరులో విడుదల చేసింది. హైదరాబాదు సంస్థానం భారత యూనియన్లో విలీనం కావాలని ఉద్యమాన్ని ప్రారంభించినందుకు ఆయనను 1948 జనవరిలో బంధించి, అనేక జైళ్ళల్లో ఉంచారు. నిజాం సైన్యం భారత ప్రభుత్వ సైన్యానికి లొంగిపోయిన 1948 సెప్టెంబర్ 17వ తేదీన రామానంద తీర్థ స్వామి నిర్బంధం నుండి విడుదల పొందారు. 1952 నుండి 1962 వరకు లోకసభ సభ్యులుగా ఉన్నారు.1953లో హైదరాబాదు నగరంలో ప్రప్రథమంగా జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభకు స్వామీజీ ఆహ్వానసంఘాధ్యక్షులుగా వ్యవహరించారు. హైదరాబాదు సంస్థానాన్ని భాషా ప్రాతిపదికపై విభజించాలని 1953లోనే గట్టిగా కోరిన స్వామీజీ ఎనిమిది తెలంగాణా జిల్లాలను మద్రాసు రాష్ట్రం నుండి విడిపడ్డ ఆంధ్ర ప్రాంతంలో కలిపేసి తెలుగు ప్రజల చిరకాల వాంఛయైన విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని ఒక ప్రకటన చేశారు. అంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆయన అంధ్రప్రదేశ్ పౌరుడుగానే హైదరాబాదులో నివాసమేర్పరు చుకొన్నారు.1957 నుండి ఆయన ఉస్మానియా సెనేట్లో శాశ్వత సభ్యులుగా కొంతకాలం ఉన్నారు. వినోభాజీ ప్రారంభించిన భూదాన్ ఉద్యమాలకు ఆయన చేయూత నిచ్చారు. స్వామీజి 1972 జనవరి 22 వ తేదీన హైదరా బాదులో నిర్యాణం చెందారు.
ఈయన అసలు పేరు వెంకటరావు ఖేడ్గీకర్. తండ్రి భాపూరావు, తల్లి యసుబాయి.1903 అక్టోబరు 3వ తేదీన అప్పటి హైదరాబాదు సంస్థానంలోని గుల్బర్గా జిల్లా, ఝవర్గీ తాలూకా సింద్గీ గ్రామంలో ఆయన జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1920 జూలై 31 వ తేదీ రాత్రి లోకమాన్య బాలగంగాధర తిలక్ కాలధర్మం చెందారన్న వార్త విని బ్రహ్మచారిగా తన జీవితాన్నంతా మాతృభూమి సేవకే అంకితం చేయగలను అని ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రకారమే ఉండిపోయిన ధీరోధాత్తుడు ఆయన. కళాశాల చదువుకు స్వస్తి చెప్పి, పూనాలోని తిలక్ విద్యాపీఠ్లో మూడేళ్ళు అధ్యయనం చేసి, ప్రజాస్వామ్యం, దాని క్రమాభివృద్ధి అనే అంశంపై సిద్ధాంత వ్యాసం రాసి పూనా విశ్వవిద్యాలయానికి సమర్పించి ఎం.ఏ పట్టాని పొందారు. Body:
Post date: Mon, 01/21/2013 - 23:59
Path: /content/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5 |
విభాగము:
వివరణ:
రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి?’ రచించిన మాడపాటి హనుమంతరావు జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవనాన్ని ఆయన తన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. మాడపాటి హనుమంతరావు 1885 జనవరి 22వ తేదీన నేటి వరంగల్ జిల్లా మధిర తాలూకా ఎర్రుపాలెం గ్రామంలో తమ మాతామహ స్థానంలో జన్మించారు. తల్లి జమలాపురం వారి ఆడబడుచు వేంకట సుబ్బమ్మ. తండ్రి వేంకటప్పయ్య. తండ్రి మరణంతో నల్లగొండలో పని చేస్తున్న చిన్న మేనమామ రామచంద్రరావు వద్ద వీరు చదువుకున్నారు. హనుమంతరావు వరంగల్లో మద్రాసు మెట్రిక్ పాసయ్యారు. ఎనిమిది సంవత్సరాలు వరంగల్లో విద్యాశాఖలో పనిచేశారు. ఆయన ఉద్యోగానికి సెలవుపెట్టి హైదరాబాద్లో ప్రైవేటుగా ‘లా’ పరీక్ష పాసైన హనుమంతరావు 1917లో ప్రాక్టీసు పెట్టారు. నాటి నైజాం కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పటేల్, పట్వారీ, పోలీసుల జులం ఎక్కువగా ఉండేది. అన్నదాతల్ని అన్యాయమైన వసూళ్ళతో యమయాతనలు పెట్టేవారు. వెట్టిచాకిరీ చేయించుకునేవారు. వర్తకుల దగ్గర నిజాం ఎస్టేట్కు చెందిన ఉద్యోగులు సరకులు తీసుకుని డబ్బు యిచ్చేవారు కాదు. భూస్వాముల దౌర్జన్యాలకు హద్దు లేదు. ఈ నేపథ్యంలో దొరల దోపిడీతో పాటు ఇతర భూస్వామ్య, పెత్తందార్ల ఆగడాలను అరికట్టడానికి అనేక ప్రజా సంఘాలు వెలిసినాయి. ప్రజలు కళ్ళు తెరవడానికి గ్రంథాలయాలు, రైతుల ఇక్కట్లు పోగొట్టడానికి రైతు సంఘాలు, వ్యాపార పరిస్థితులు బాగు చెయ్యడానికి వర్తక సంఘాలు వెలిశాయి. ఈ సంఘాలు గ్రామ ప్రాంతాల చైతన్యానికి సంకేతాలుగా నిలిచాయి. తెలంగాణా వెనుకబాటుతనానికి కారకులైన నిజాం పాలక విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటుతోపాటు తెలుగుజాతిని జాగృతి చేయడానికి గ్రంథాలయోద్యమం, సంఘసంస్కరణ, స్త్రీ విద్యావ్యాప్తి, సాంఘికోద్యమం, ప్రజాసేవారంగంలో, స్త్రీల ప్రవేశం, విద్యాప్రచారం, సాహిత్య వికాసం వంటి అనేక ఉద్యమాలను ఏకకాలంలో నడిపించడంలో మాడపాటి హనుమంతరావు చేసిన కృషి మరువలేనిది. నిజాం రాష్ట్ర తెలుగు జాతిని మొదట మేల్కొలిపిన మాడపాటి 1921లో నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం కార్యదర్శిగా సారథ్యం వహించారు. నిజాం రాష్ట్ర పాలనలో తెలుగు భాష లేకుండా కొనసాగిస్తున్న రోజుల్లో తెలుగు భాషను కాపాడడమే కాక తెలుగుజాతిని ఐక్యం చేయడానికి గ్రంథాలయాలే పునాదిగా తలచి హనుమకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం, హైదరాబాద్లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం అభివృద్ధికై మాడపాటి విశేష కృషి చేశారు. ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో రాజభాష ఉర్దూ -విద్యాబోధన ఉర్దూలోనే జరిగేది. బాలికలకు తెలుగు భాషలో విద్యాబోధన (ఉన్నత పాఠశాల స్థాయిలో) జరిపించడానికి మాడపాటి ఆంధ్ర బాలికల ఉన్నత పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాలకు పుణలోని థాకర్స్ భారత మహిళా విశ్వవిద్యాలయం వారి గుర్తింపు లభించింది. నాయకులను తయారు చేయడమే కాని, నాయకత్వానికి ఇష్టపడని మాడపాటి 1935 లో కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. 1946 ఫిబ్రవరి 6,7 తేదీలలో మాడపాటి హనుమంతరావు షష్టిపూర్తి ఉత్సవాలు తెలంగాణా అంతటా జరిగాయి. ఆ సందర్భంగా సన్మాన రూపంలో వసూలైన డబ్బుతో ఆంధ్ర చంద్రికా గ్రంథమాలను స్థాపించి కొన్ని గ్రంథాలను ప్రచురించారు. అంతేకాక బంకించంద్ర ఛటర్జీ వ్రాసిన ఆనందమఠ్ ప్రసిద్ధ నవలను తెలుగులో ఆయన అనువదించారు. మాడపాటి తెలుగు, ఉర్దూ, పారశీక, ఇంగ్లీషు భాషలలో పండితులేకాక, మంచివక్త, రచయితగా గుర్తింపు పొందారు. మాడపాటి మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు , ఎవరికి, విధిప్రేరణం అనే కధలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తక రూపం దాల్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంధం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'. ఇటలీ దేశభక్తుడు ‘గారీబాల్డీ’ జీవిత చరిత్ర రాశారు. రోమన్ సామ్రాజ్య చరిత్ర, క్షేత్రకాలపు హింద్వార్యులు, మహాభారత సమీక్ష, 1940లో మాలతీ గుచ్ఛము, నిజా రాష్ట్రంలో రాజ్యాంగ సంస్కరణలు రాశారు. రాష్ట్రానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత 1951లో హైదరాబాద్ నగర పురపాలక సంఘానికి మొదట మేయర్గా మాడపాటి ఎన్నికై నగరాభివృద్ధి కెంతో కృషి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్కు శాశ్వత సభ్యులుగా కొనసాగారు. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం హనుమంతరావుకు డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ మొదటి అధ్యక్షులుగా ఆరేళ్లు మాడపాటి కొనసాగారు. ఆంధ్రాభ్యుదయమే తమ జీవితంగా భావించిన మాడపాటికి భారత ప్రభుత్వం 1955 జనవరి 26న పద్మభూషణ్ బిరుదునిచ్చి సత్కరించింది. తెలంగాణాలో ఆంధ్రోద్యమంతోపాటు అనేక సాంఘిక, సామాజిక ఉద్యమాలకు సారథ్యం వహించి, ఆంధ్ర పితామహుడనే పేరు గాంచిన మాడపాటి హనుమంతరావు 1970 నవంబర్ 11వ తేదీన 86వ ఏట తనువు చాలించారు.
Body:
Post date: Mon, 01/21/2013 - 23:39
Path: /content/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A1%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B9%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81 |
విభాగము:
వివరణ:
ఈయన జనవరి 17,1908 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగాడు. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్ ను ఆకర్షించేవి. పాత అరిగిపోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవాడు. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది. ఇక 1908 జనవరి 17న జన్మించిన ఎల్.వి.ప్రసాద్ వివాహం సౌందర్య మనోహరమ్మతో జరిగింది. ఒకరోజు ఆయన సినిమాల్లో నటించాలనే కోరికతో జేబులో 100రూ.లతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయల్దేరాడు. ముంబయికి వెళ్లిన ఆయనకు ఎంతో కష్టపడగా చివరికి ఆలం అరా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దేశంలోనే తొలి టాకీ సినిమా అయిన ఈ చిత్రంలో ఎల్.వి.ప్రసాద్ ఓ పాత్ర చేశారు. ఈ చిత్రంలో నటించినందుకుగాను ఎల్.వి.ప్రసాద్కు నెలకు 30 రూపాయలను అందజేశారు. ఆ తర్వాత హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తమిళ చిత్రం కాళిదాస, తెలుగు చిత్రం భక్త ప్రహ్లాదలో ఆయన నటించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఎల్.వి.ప్రసాద్ 1950లో విడుదలైన విజయ పిక్చర్స్ వారి షావుకారు సినిమాకు దర్శకత్వం వహించి ఎంతో పేరుతెచ్చుకున్నారు. ఎన్టీరామారావు, జానకి నటిచిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రసాద్ ప్రొడక్షన్ను నెలకొల్పిన ఎల్.వి.ప్రసాద్ హిందీలో మిలన్, ఖిలోనా, ససురాల్, ఏక్ దూజే కె లియే వంటి సూపర్హిట్ చిత్రాలను నిర్మించి ఎంతో పాపులారిటీ సంపాదించారు. సినిమాలు నటునిగా
దర్శకునిగా
పురస్కారాలు
Body:
Post date: Thu, 01/17/2013 - 14:21
Path: /content/%E0%B0%8E%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D |
విభాగము:
వివరణ:
త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. 'ఎందరో మహానుభావులు'' అనే పదం తెలుగునాటనే కాక, దక్షిణ ప్రాంతంలో వాడుకలో వినిపించే నానుడియైన చరణం. అలానే 'చక్కని రాజమార్గం ఉండగా, సందుల దూరనేల ఓ మనసా!' 'దొరకునా ఇటువంటి సేవ', 'ఏమని పొగడదురా?' వంటి చరణాలు తెలుగు ప్రజల మదిలో నిలిచిపోయాయి. దాదాపు రెండు వందల ఏళ్లకు పూర్వం త్యాగబ్రహ్మం రచించిన కృతులలోని చరణాలు స్థిరంగా నిలిచిపోవటానికి కారణం.. ఆయన సాహిత్యంలోని నిర్ధిష్టత, సంగీతంలో సారస్వత. భారతీయ సంగీతాల్లో ఉత్తరదేశానికి చెందిన హిందుస్థానీ, దక్షిణానికి కర్నాటక సంగీతం ప్రాచుర్యం పొందాయి. త్యాగబ్రహ్మకు పూర్వం కర్నాటక శాస్త్రీయ సంగీతానికి చెందిన సాహిత్యం సంగీత ప్రాచుర్యం గురించి వినికిడిలో లేదు. అప్పటి మద్రాసు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా తిరువమారులో 1767 మే 4వ తేదీన కాకర్ల రామబ్రహ్మం, సీతమ్మ దంపతులకు త్యాగబ్రహ్మ జన్మించారు. చిన్ననాటి నుంచే సంగీతంపై మక్కువ కలిగి, రాగాలాపనలో కాలం గడిపారు. శొంఠి వెంకట రమణయ్య శిష్యరీకంలో సంగీత స్వరరాజుగా ఎదిగారు. కృతులకు స్వయంగా గురువు తంజావూరులో కచేరీని ఏర్పాటు చేయగా అప్పుడు ఆవిర్భవించిన కృతే' ఎందరో మహానుభావులు' . స్వయంగా కృతిని రచించి, స్వరపరిచి, సంగీత బద్ధంగా గానంచేసే వారినే వాగ్గేయకారులంటారు. త్యాగబ్రహ్మ వాగ్గేయకారునిగా స్వర రారాజుయై త్యాగరాజుగా నాటినుంచే పిలువబడ్డారు. ఆ సందర్భంలోనే తంజావూరు మహారాజు త్యాగరాజును రాజాస్థానంలో సంగీత కళాకారునిగా నియమించటం కోసం ధన, మణిహారములతో భటులను పంపించాడు. ఆ ఆహ్వానాన్ని త్యాగరాజు తిరస్కరించి 'నిధి చాలా సుఖమా? నా రాముని సన్నిధి చాలా సుఖమా?' అనే కృతిని పాడి స్వేచ్ఛా గానాన్ని కోరుకున్నారు. త్యాగరాజు దాదాపు 24 వేల కీర్తనలు రచించి, స్వర కల్పన చేశారు. అవి అన్నీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అధికభాగం 'రాముని' భక్తితో స్తుతించినవే, కాగా కొన్ని ప్రాపంచిక, సామాజిక చింతనలో కూర్చినవీ ఉన్నాయి. 'త్యాగరాజు' కర్నాటక శాస్త్రీయ సంగీతంలో పలు రాగాలు, స్వరాల సృష్టికర్త కావటంతో పాటు స్వయంగా కృతికర్త కూడా. అందువల్ల ఆయన కృతులు పాడేందుకు ఒక నిర్దిష్టత, స్పష్టత ఏర్పడింది. అనుశ్రుతంగా, అదే బాణీలో అదే శైలిలో ఏ సంగీత విధ్వాంసుడైనా పాడవలసిందే. కాగా సంపాదన లేక సంగీతమే పరమావధిగా ఉన్న త్యాగరాజుతో సోదరుడు విసిగి ఆయన ఆరాధించే రాముని విగ్రహాన్ని యమునా నదిలో పడవేశాడు. త్యాగరాజు తీర్ధయాత్రలు చేస్తూ దక్షణభారతం పర్యటించారు. భార్య కమలాంబ, కుమార్తె సీతాలక్ష్మిలను కూడా వదలి రామభక్తి సామ్రాజ్యమే ఆనందంగా భవించారు. త్యాగరాజు తెలుగువాడైనా, తెలుగులోనే కీర్తనలు రచించినా, పుట్టినది తమిళనాడులో అయినందున తమిళులు తమ ఆరాధ్య సంగీత దైవంగా భావించేవారు. ఆయన చేసిన సంగీత మార్గాన్ని తమిళులు అనుసరిస్తూ కీర్తనల పదవ్యాప్తికి దోహదపడుతున్నారు. త్యాగరాజ కీర్తనలతో పంచరత్న కీర్తనలుగా పేర్కొనబడేవి. 'దుడుకుగల నన్నేదొర - కొటకు బ్రోచురా?' సాధించెనే మనసా', కనకన రుచిరా' ఎందరో మహానుభావులు' జగదానందకారక' త్యాగరాజు కీర్తనల్లో సాహిత్యం పాలు తక్కువ కాగా, సంగీతం పాలు ఎక్కువ. అందువల్లనే తమిళనాట సంగీతాభిమానులు ఆయన కీర్తనలను ఆదరించిన కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఎనభై ఏళ్లు నాదమే యోగంగా, సంగీతమే శ్వాసగా జీవించిన నారబ్రహ్మ త్యాగరాజు 1847 జనవరిలో మృతి చెందారు. ఆయన స్మృత్యర్థం నివాళ్లర్పిస్తూ ప్రతిఏటా ఆయన జన్మించిన తిరువాయురులో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో త్యాగరాజు ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత సంగీత విధ్వాంసులు అందరూ పాల్గొని కచేరీ చేస్తారు. అదే విధంగా దేశంలోనే కాక విదేశాల్లోనూ పలుచోట్ల ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నారు. మన హైదరాబాద్లో సైతం శ్రీత్యాగరాయ గానసభ, నల్లకుంటలోని రామాలయంలో శ్రీరామగానసభ, మారేడ్పల్లి, రాంకోఠిలో ఉన్న ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల్లోనూ త్యాగరాజు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. Body:
Post date: Sun, 01/06/2013 - 09:36
Path: /content/%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B1%80%E0%B0%A4-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81-%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81 |
విభాగము:
వివరణ:
'తెలుగు సాహిత్యం'పై శ్రీశ్రీదే అసలైన 'ముద్ర'. తెలుగు కలాల్లో జడపదార్థాలూ, చైతన్య పదార్థాలూ సమంగానే ఉన్నాయి. శ్రీశ్రీ ఒక్కముక్కలో చోదకశక్తి. మరో ప్రపంచం కోసం పలవరించి తానే మరో ప్రపంచమై వెలుగు రేకలు విప్పారిన ఏకైక కవి. అక్షరంలోని అనంతశక్తిని లోకానికి చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. ప్రాచీన కవులూ, ప్రబంధ కవులూ శబ్ద వైచిత్రికీ, కల్పనా చాతుర్యానికీ పెట్టింది పేరు. మళ్లీ ఆ రెంటినీ ఆధునిక కవుల్లో ఒక్క శ్రీశ్రీలోనే చూస్తాం. ప్రబంధ కవుల తరవాత అంతటి శబ్ద మహేంద్రజాలం శ్రీశ్రీలోనే వెల్లువెత్తుతుంది. పద్యాన్ని తప్పిస్తే తెలుగు కవిత్వం లేనేలేదనిపించేంతలో- నేటికాలంలో 'మహాప్రస్థానం' మేరువై, జనాభ్యుదయానికి చేరువై ఆధునిక సాహిత్యాన్ని బతికిస్తూంటుంది. 1933-'47 నాటి నలభై ఒక్క కవితల స్తంభాలతో కట్టిన మేడ, అగ్నిమంటపం 'మహా ప్రస్థానం'. అది ఓ రకంగా శ్రీశ్రీ చేసిన అగ్నిసంతకం. ప్రజల చేతిలో కాగడా 'మహాప్రస్థానం'. ప్రాచీనమైనదంతా విశిష్టమనీ, ఆధునికమైందంతా అరిష్టమనీ అపోహలు రాజ్యం చేస్తూన్న కాలంలో ఆధునికతలోని ప్రామాణికతకు కొలబద్దగా శ్రీశ్రీ సాహిత్యం నిలుస్తుంది. కార్మిక, కర్షక అభ్యుదయమే శ్రీశ్రీ కవితామార్గం. సామాన్యుడే మహాకవి పాలిటి స్వర్గం. మానవుడే సందేశం... మనుష్యుడే సంగీతం. 'పురోగామి భావాలకు' పునరుత్తేజం కలిగించినదోపిడీకి తావులేనిది సామ్యవాద రాజ్యమేనని ఎలుగెత్తి చాటిన ఎర్రజెండా శ్రీశ్రీ అక్షరాక్షరం. కర్షక వీరుల కాయం నిండా కాలువకట్టే ఘర్మజలానికి ఖరీదు లేదన్న శ్రీశ్రీకి స్వేదమే వేదం... శ్రామికుడే దేవుడు!! శ్రీశ్రీ చారిత్రక జ్ఞానం రాబోయేకాలంలో కాబోయే కవులకు పాఠమై ప్రవహిస్తుంది. నిజానికి కవిత్వం అన్నది వ్యక్తీకరణ కళ. ఎవరు ఏ మేరకు కవో శిల్పమే పట్టిస్తుంది. శ్రీశ్రీది ప్రత్యేక శైలి. శబ్ద విన్యాసంలో శక్తిమంతుడిగా పేరొందిన శ్రీశ్రీ ఆధునిక కవుల్ని అధిగమించాడు. ఇవాళ్టి వచన కవితతో శ్రీశ్రీ కవితను పోల్చలేం. నిరంతర పరిణామానికి అలవాటుపడ్డ వచన కవిత్వంలో శ్రీశ్రీది ఓ ప్రస్థానం... ఓ శుభారంభం... తొలకరివాన. తనలో తాను వర్షమై కురిసి కురిసి మహా ప్రస్థానమై వెలిసిన కవి శ్రీశ్రీ. తన అంతరాత్మను మండించి లావాగా పెల్లుబికిన కలం శ్రీశ్రీ. సాహిత్య స్పృహకు ఆలవాలం... సామాజిక స్పృహకు బలం శ్రీశ్రీ. ఆయనో సాహిత్య సంస్కర్త. 'ఇంటెలిజెంటిల్మన్' లాటి ప్రయోగాలకు శ్మశానాల నిఘంటులు దాటిన అక్షర బాటసారి శ్రీశ్రీ. వ్యధాసర్పదష్టులారా అనాల్సింది 'బాధాసర్పదష్టులార' అంటూ వ్యాకరణాల సంకెళ్లు విదిలించుకున్న కలం శ్రీశ్రీ. పారశీక గజల్ నడకను మాత్రాగణాల్లో పరకాయ ప్రవేశం చేయించి ఛందస్సుల సర్పపరిష్వంగం వదిలించుకున్న అక్షర పారిజాతం శ్రీశ్రీ. ఆకలి, ఆవేదనలు తొడుక్కున్న బట్టలు శ్రీశ్రీ అక్షరాలు. ఆవేశపు ఇస్త్రీ మడత నలగని తెలుగుదనం వెల్లివిరిసే పట్టుపంచె శ్రీశ్రీ సృజన. అవ్యక్తానుభూతుల 'రసన' శ్రీశ్రీ సాహితి. అందరిలా శ్రీశ్రీ కావ్యకర్త మాత్రమే కాదు, అంతకు మించి కార్యకర్త కూడా. పౌరహక్కుల ప్రతినిధిగా పనిచేసిన ఉద్యమ కెరటం శ్రీశ్రీ. విప్లవోద్యమాల పురిటిగడ్డ ఆయన మస్తిష్కం. 1930 తరవాత నడిపించిన పెద్దదిక్కుగా, మార్గదర్శిగా విమర్శకుల మన్ననలందుకున్నాడు. ఏ కూలీ నాలీ జఉద్యమంగా ఉరకలెత్తబట్టే కవుల్లో శ్రీశ్రీ మాత్రమే మహాకవిగా నిలిచాడు, యుగకర్తగా జనహృదయం గెలిచాడు. తెలుగు సాహిత్యానం కోసం కలం పట్టానని శ్రీశ్రీ పలికాడో ఆ సామాన్యులకు శ్రీశ్రీ శబ్దభేరీ 'కవిత్వం' ఏమేరకు అర్థమవుతుందన్నది ఓ ప్రశ్న. ఉన్నంతలో తెలుగు సమాజం చుట్టూ పరిభ్రమించకుండా తక్కిన కవులకు భిన్నంగా ప్రపంచ బాధల్ని పల్లవించటం వరకూ మెచ్చుకోలు. వట్టి నినాదాలు కవితలు కావుకానీ, 'మినీ' కవిత్వాన్ని శ్రీశ్రీ ఆహ్వానించాడు. 'నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు...' అంటూ శ్రీశ్రీ అక్షరీకరించిన సామాన్య వాక్యాలు సత్యాన్వేషణలో భాగం కనక గొప్పమాటలే అవుతాయి. కష్టజీవికి ఇరువైపులాఉన్నవాడు శ్రీశ్రీ. అక్షరానికి ఆవేశాన్ని నేర్పినవాడు. శ్రీశ్రీ వచ్చేదాకా తెలుగు అక్షరానికి ప్రణయార్చన తప్ప ప్రళయగర్జన తెలీదు. గుప్పెడు అక్షరాల అణువుల్ని ఎలా పోగేయాలో నేర్చిన శాస్త్రవేత్త శ్రీశ్రీ. కన్నీటికి ఉప్పెన రూపాన్ని ఇవ్వగల ప్రకృతి శ్రీశ్రీ. సామ్యవాదం జాబిలిని చూపి అక్షరాల గోరుముద్దలు తినిపించే అమ్మ శ్రీశ్రీ. ఓ అభ్యుదయ సంతకం... ఓ విప్లవ కెరటం... ఓ పోరాట రూపం. కవిత్వాన్ని ఆరాటంగా కాక పోరాటంగా మలచిన యోధుడు. శ్రీశ్రీ అక్షరాలు ఆశావాదానికి కళ్లు, పురోగామి భావాలకు కాళ్లు!
'తెలుగు సాహిత్యం'పై శ్రీశ్రీదే అసలైన 'ముద్ర'. తెలుగు కలాల్లో జడపదార్థాలూ, చైతన్య పదార్థాలూ సమంగానే ఉన్నాయి. శ్రీశ్రీ ఒక్కముక్కలో చోదకశక్తి. మరో ప్రపంచం కోసం పలవరించి తానే మరో ప్రపంచమై వెలుగు రేకలు విప్పారిన ఏకైక కవి. అక్షరంలోని అనంతశక్తిని లోకానికి చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. ప్రాచీన కవులూ, ప్రబంధ కవులూ శబ్ద వైచిత్రికీ, కల్పనా చాతుర్యానికీ పెట్టింది పేరు. మళ్లీ ఆ రెంటినీ ఆధునిక కవుల్లో ఒక్క శ్రీశ్రీలోనే చూస్తాం. ప్రబంధ కవుల తరవాత అంతటి శబ్ద మహేంద్రజాలం శ్రీశ్రీలోనే వెల్లువెత్తుతుంది. పద్యాన్ని తప్పిస్తే తెలుగు కవిత్వం లేనేలేదనిపించేంతలో- నేటికాలంలో 'మహాప్రస్థానం' మేరువై, జనాభ్యుదయానికి చేరువై ఆధునిక సాహిత్యాన్ని బతికిస్తూంటుంది. Body:
Post date: Tue, 01/01/2013 - 22:22
Path: /content/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80 |