మన మహనీయులు

తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు పెంచిన ఎందరో మహనీయుల గురించిన వ్యాసములు

విభాగము:
వివరణ:

భోగరాజు పట్టాభి సీతారామయ్యభోగరాజు పట్టాభి సీతారామయ్య  స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు.  డాక్టర్‌గా తెలుగు భాషాభిమానిగా, ఖద్దరు దారిగా, స్వాతంత్య్ర సమరశీలిగా, మహాత్మాగాంధీకి ఆప్తునిగా, రాజకీయ చతురునిగా, నిరంతర ప్రజా సేవకునిగా, ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకొన్నారు సీతారామయ్య. సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేని రోజుల్లో, అప్పులకోసం అన్నదాతలు ఎదురు తెన్నులు చూస్తున్న రోజుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారాయన.

1906లో మచిలీపట్నంలో వైద్యవృత్తిని చేపట్టారు. గాంధీజీ పిలుపు మేరకు 1916 లో ఆ వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారు. అంతే కాకుండా భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఎటువంటి వృత్తిని చేపట్టకూడదనే ధ్యేయంతో ముందుకు నడిచారు.  1948లో జైపూర్‌ కాంగ్రెస్‌ సమావేశం నాటికి కాంగ్రెస్‌ అధ్యక్షుని స్థాయి కి ఎదిగారు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవరించారు. నేడు దేశంలో ప్రముఖ బ్యాంకుగా చలామణి అవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను 1923లో స్థాపిం చాడు. అంతేకాకుండా ఈయన స్థాపించిన ఆంధ్ర ఇన్సూరెన్స్‌ కంపెని (1925), హిందు స్తాన్‌ ఐడియల్‌ ఇన్సూరెన్స్‌ కంపెని (1935) లు తరువాతి కాలంలో ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించారు.

నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన ఆయనకు రాష్ట్ర మంత్రి వర్గంలో అవకాశం తలుపుతట్టినా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి పదవి గుమ్మం వరకు వచ్చినా సున్నితంగా తిరస్కరించి ప్రజాసేవలో, రాజకీయాల్లో మునిగిపోయిన మహనీయుడు డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య.

బాల్యం:

పశ్చిమ గోదావరి జిల్లా గుండుకొలను గ్రామంలో 1880, నవంబర్ 24 న ఆరువేల నియోగి బ్రాహ్మణుల ఇంటిలో పట్టాభి జన్మించాడు. వారి ఇంట్లో ప్రతి సంవత్సరం రామపట్టాభిషేకం జరిపే ఆచారం ఉండేది. అందుకే తల్లిదండ్రులు పట్టాభీ సీతారామయ్య అనే పేరు పెట్టినారు. ప్రాథమిక విద్య స్థానికంగా బందరులోనే చదివి ఉన్నత విద్యకై మద్రాసు (నేటి చెన్నై) వెళ్ళి మద్రాసు క్రైస్తవ కళాశాల నుండి బి.ఏ. డిగ్రీ పొందిన పట్టాభి ఎం.బి.సి.ఎం. డిగ్రీ సాధించి డాక్టరు కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు.

స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడిగా :
చదువు పూర్తైన తర్వాత మచిలీపట్నంలో డాక్టరుగా ప్రాక్టీసు పెట్టాడు కానీ లాభదాయకమైన సంపాదనను వదులుకొని గాంధీజీచే ప్రభావితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమములో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీలో పట్టాభీ గాంధీజీకి అతి సన్నిహితంగా ఉండేవాడు. 1939లో భారత జాతీయ కాంగ్రేసు పార్టీ అధ్యక్ష పదవికి అతివాద అభ్యర్ధి అయిన సుభాష్ చంద్రబోస్ కు వ్యతిరేకముగా, మహాత్మా గాంధీ అభిమతానికి దగ్గరైన వాడిగా పట్టాభిని పోటీలో నిలబెట్టారు. అయితే నేతాజీ పెరుగుతున్న ప్రాబల్యం మరియు పట్టాభి స్వాతంత్ర్యానంతరం, తమిళ ఆధిపత్యమున్న కొన్ని జిల్లాలను భావి తెలుగు రాష్ట్రములో కలపటానికి మద్దతునిస్తున్నాడన్న భావన ఈయన ఓటమికి కారణమయ్యింది. పట్టాభి ఓటమి తన ఓటమిగా గాంధీజీ భావించి బాధపడ్డాడు. ఆ తరువాత మళ్ళీ 1948లో జరిగిన కాంగ్రెస్ అద్యక్ష ఎన్నికలలో పురుషోత్తమ్‌దాస్ టాండన్ పై గెలిచి స్వతంత్ర
భారత తొలి కాంగ్రెస్ అద్యక్షుడిగా అవతరించినాడు.

1942లో క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభములో కాంగ్రేసు పార్టీ కార్యాచరణ వర్గంలో పనిచేస్తూ ఉండగా మొత్తం కార్యాచరణ వర్గ సహితంగా పట్టాభిని అరెస్టు చేసి మూడేళ్లపాటు అహ్మద్ నగర్ కోటలో బయటి వ్యక్తులెవ్వరితో సంబంధాలు లేకుండా బంధించి చిత్రవధ చేశారు. బందీగా ఉన్న ఈ సమయంలో పట్టాభి తన దినచర్యను గూర్చి విస్తారమైన డైరీ నిర్వహించాడు. దీన్నే ఆ తదనంతరం ఫెదర్స్ అండ్ స్టోన్స్ (ఈకలు మరియు రాళ్ళు)గా ప్రచురింన్చాత్థొ.లదుక ఆనీ నీకె తలుస్య్

ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి కృషి :
తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని దాని కొరకు పట్టాభీ ఎంతగానో కృషిచేశాడు. పట్టాభీ చొరవతోనే ఆంద్ర రాష్ట్రోద్యమానికి అంకురార్పణ 1908లో బందరులో జరిగింది. బందరు సమావేశంలో తెలుగు జిల్లాల ప్రముఖులందరూ సమావేశమై ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం గురించి చర్చించినారు. ఆ తరువాతనే 1913లో బాపట్లలో తొలి ఆంద్రమహాసభ జరిగింది. ప్రత్యేక ఆంద్ర రాష్ట్ర ఆవశ్యకత గురించి పట్టాభి ఆంగ్లంలో ఒక గ్రంథమే రచించినాడు. పట్టాభి కృషి వల్లనే 1920లో కాంగ్రెస్ పార్టీ ఆంద్ర రాష్ట్ర ఏర్పాటుకు సూచనప్రాయంగా ఆమోదించింది.

వ్యాపారవేత్తగా :
పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించాడు. ఆంద్రా బ్యాంకు (1923లో స్థాపన), ఆంద్రా ఇన్స్యూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు, కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు మొదలగునవి స్థాపించాడు. ఆంద్రాబ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినాడు. చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించాడు.

తెలుగు అభిమానిగా :
ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసమే కాకుండా తెలుగు జిల్లాలలో తెలుగు వాడకాన్ని పట్టాభి ఎంతగానో ప్రోత్సహించినాడు. తాను స్థాపించిన సంస్థలన్నింటిలోనూ తప్పనిసరిగా ఉత్తర ప్రత్యుత్తరాలు, లావాదేవీలు తెలుగులోనే జరగాలని నియమం పెట్టి ఆచరించాడు. ఆయన వేష, భాషల్లో ఎప్పుడూ తెలుతనం ఉట్టిపడుతూ ఉండేది. అఖిల భారత కాంగ్రెస్ అయిననూ, గవర్నర్‌గా మధ్య ప్రదేశ్ వెళ్ళిననూ వేష, భాషల్లో మార్పు రాలేదు.

గ్రంథకర్తగా :
పట్టాభి రచించిన గ్రంథాలలో కాంగ్రెస్ చరిత్ర (History of Indian National Congress) అన్నింటికంటే ప్రధానమైనది. సుమారు 1600 పుటల కాంగ్రెస్ చరిత్రను కేవలం 2 మాసాలలో పూర్తిచేశాడు. అందులోనూ దానికి ఆధారంగా తీసుకున్న గ్రంథాలు చాలా తక్కువ. కేవలం తన జ్ఞాపక శక్తితో వ్రాసి సంచలనం సృష్టించాడు.

స్వాతంత్ర్యానంతరం
స్వాతంత్ర్యం తరువాత 1948లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీలో నెగ్గి పీఠాన్ని అధిష్టించాడు. ఆ తరువాత 1952లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్లమెంటులో ప్రవేశించినాడు. 1952 నుండి 1957 వరకు మధ్య ప్రదేశ్ గవర్నరుగా పని చేశాడు. తెలుగు ప్రజలకు ఎంతగానో తోడ్పాటు అందించిన పట్టాభీ 1957, డిసెంబర్ 17న స్వర్గస్థులయ్యాడు.

భోగరాజు పట్టాభి సీతారామయ్యభోగరాజు పట్టాభి సీతారామయ్య  స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు.  డాక్టర్‌గా తెలుగు భాషాభిమానిగా, ఖద్దరు దారిగా, స్వాతంత్య్ర సమరశీలిగా, మహాత్మాగాంధీకి ఆప్తునిగా, రాజకీయ చతురునిగా, నిరంతర ప్రజా సేవకునిగా, ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకొన్నారు సీతారామయ్య. సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేని రోజుల్లో, అప్పులకోసం అన్నదాతలు ఎదురు తెన్నులు చూస్తున్న రోజుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారాయన.

1906లో మచిలీపట్నంలో వైద్యవృత్తిని చేపట్టారు. గాంధీజీ పిలుపు మేరకు 1916 లో ఆ వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారు. అంతే కాకుండా భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఎటువంటి వృత్తిని చేపట్టకూడదనే ధ్యేయంతో ముందుకు నడిచారు.  1948లో జైపూర్‌ కాంగ్రెస్‌ సమావేశం నాటికి కాంగ్రెస్‌ అధ్యక్షుని స్థాయి కి ఎదిగారు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవరించారు. నేడు దేశంలో ప్రముఖ బ్యాంకుగా చలామణి అవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను 1923లో స్థాపిం చాడు. అంతేకాకుండా ఈయన స్థాపించిన ఆంధ్ర ఇన్సూరెన్స్‌ కంపెని (1925), హిందు స్తాన్‌ ఐడియల్‌ ఇన్సూరెన్స్‌ కంపెని (1935) లు తరువాతి కాలంలో ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించారు.

నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన ఆయనకు రాష్ట్ర మంత్రి వర్గంలో అవకాశం తలుపుతట్టినా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి పదవి గుమ్మం వరకు వచ్చినా సున్నితంగా తిరస్కరించి ప్రజాసేవలో, రాజకీయాల్లో మునిగిపోయిన మహనీయుడు డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య.

Body:
Post date: Sun, 11/25/2012 - 09:50
Path: /node/1102
విభాగము:
వివరణ:

కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.

కందుకూరి వీరేశలింగం పంతులు

విశిష్టత

ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు:

  • మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
  • మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
  • తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
  • తెలుగులో తొలి నవల రాసింది ఆయనే
  • తెలుగులో తొలి ప్రహసనం రాసింది కందుకూరి
  • తెలుగుకవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తి
  • విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత

ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసాడు.

తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన. యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.

ఆంధ్ర సమాజాన్ని సంస్కరణాల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం. ఆయన చేసిన ఇతర సంస్కరణా కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసాడు.

వీరేశలింగం హేతువాది .ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషిలతో పెనవేసుకు పోయింది; ఒకదానినుండి మరో దానిని విడదీసి చూడలేము. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి అటువంటి దురాచారాలపై ధ్వజమెత్తి తన సంస్కరణాభిలాషను నిరూపించుకున్నాడు.

 

తన దేహము తన గేహము
తన కాలము తన ధనంబు తన విద్య జగ
జ్జనులకే వినియోగించిన
ఘనుడీ వీరేశలింగకవి జనులార! 

చిలకమర్తి లక్ష్మీనరసింహం వీరేశలింగం గురించి ఇలా అన్నాడు: ఇది వీరేశలింగం సమాధిపైఈ నాటికీ కనుపిస్తుంది.

బాల్యం

1848 ఏప్రిల్‌ 16వ తేదీన సుబ్బారాయుడు, పున్నమ్మ దంపతులకు జన్మించారు. నాలుగేళ్ల వయసులో తండ్రి చనిపోయారు. ‘నాలుగైదు సంవత్సరముల ప్రాయము వచ్చు వఱకును నన్నుఁ గూర్చి చెప్పకోవలసిన దేదియు నాకు స్ఫురణకు రాలేదు’ అని స్వయంగా ఆయనే తన ‘స్వీయచరిత్రము’ మొదటి ప్రకరణంలో రాసుకున్నారు.తండ్రి మరణం, తల్లి ప్రేమ … ఇవి రెండే పంతులుగారి తొట్టతొలినాళ్ల జ్ఞాపకాలు! కొడుకుపై తల్లికి ఎంత ప్రేమంటే… ఇలాంటి ప్రేమ ఏ తల్లికీ ఉండకూడదని వీరేశలింగం పంతులు కోరుకున్నంత!!.

అన్నమెంత యెక్కువగాఁ దిన్ననంత బలియుదురన్న నమ్మకము కలదయి యజ్ఞానము చేత నా ప్రియమాత నన్ను శీఘ్రముగా బలిపింపవలెనన్న యుత్కంఠతోను, సచ్చింతతోను నాకన్నమెక్కువగాఁ బెట్టి నోటిలోని ముద్దను మ్రింగకున్నప్పుడు మిరెపుకాయలగుండ నా నాలుకకు రాచుచుండుటయు, నోటిలోని ముద్ద మ్రింగి కారముచే నే నేడ్చినప్పుడు నెత్తి మీఁద మొట్టుచుండుటయు నెందుచేతనో కాని నేడు జరిగినట్టుగా నా మనస్సున దృఢముగా నాటుకొని యిప్పటికిని మఱపునకు రాకున్నవి. బిడ్డలయందలి యతిప్రేమచేతఁ దల్లు లెప్పుడు నిట్టియవివేక కార్యములను జేయకుండుదురు గాక అని పంతులుగారు అదే మొదటి ప్రకరణంలో వాపోయారు!

ఎవరి జీవితపు తొలి జ్ఞాపకమైనా అమ్మ ముద్దుతోనో, అమ్మ పెట్టిన ముద్దతోనో ఆరంభం అవుతుంది. పంతులుగారికీ అంతే. అయితే ఆయనకు అమ్మ ముద్దు కన్నా ముందు తన తండ్రి అకస్మాత్తుగా ఒకానొక రోజు నుండి కనిపించకపోవడం స్ఫురణకొస్తుంది. అలాగే – వేళకింత ముద్ద పెట్టేందుకు లేకుండా ఒకానొక రాత్రి తన అర్ధాంగి తనను విడిచి వెళ్లిపోవడం గుర్తుకొస్తుంది.

జీవితం మొదలయ్యే ప్రత్యేక సందర్భాలు, ప్రత్యక్ష క్షణాలు కొన్ని ఉంటాయి. లంకంత ఇల్లుందని జీవితం మొదలు కాదు. పెద్ద బంధుగణం ఉందని మొదలు కాదు. గొప్ప చదువు, మంచి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఫ్యాన్ కింది టేబుల్… ఇవేవీ జీవితాన్ని మొదలుపెట్టవు. పెట్టినా అది పెట్టుడు ముహుర్తంలా ‘పెట్టుడు జీవితం’ అవుతుంది తప్ప జీవితం అవదు.

కందుకూరి వీరేశలింగం జీవితం అనేక సంఘర్షణలతో, అనేక సందర్భాలతో, అనేక క్షణాలతో మొదలైంది.

పిల్లలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసి పడేస్తారెందుకు?

ఆడపిల్లల్ని చదువుకోనివ్వరెందుకు? అడుగు బయటికి పెట్టనివ్వరెందుకు?

చిన్న వయసులో భర్త చనిపోతే మళ్లీ పెళ్లి చేయరెందుకు?

లంచం ఇవ్వకుండా ఉద్యోగం రాదెందుకు?

కులమతాల అడ్డుగోడలెందుకు? అబద్ధాలెందుకు? అవినీతి ఎందుకు?

కళ్ల ముందే నచ్చని విషయాలు జరుగుతుంటే మనుషుల్లో ఇంత మౌనం ఎందుకు?

అన్నీ ఆలోచనలే వీరేశలింగానికి. వాటిని పట్టుకుని సంఘంతో గొడవకు, ఘర్షణ దిగాడు.

పదేళ్ల వయసు వరకు… అతడి జీవితం బాగుంది. పదేళ్ల తర్వాత – సమాజంలో స్త్రీలు, పిల్లల జీవితం బాగోలేదన్న విషయం కొద్దికొద్దిగా అర్థమౌతున్న కొద్దీ అతడి జీవితమూ బాగోలేకుండా పోయింది!

ఏం చేసి వీళ్లను కాపాడాలి? చిన్న వయసుకు పెద్ద సమస్య! వీరేశలింగం తన ఐదో యేట బడిలో చేరి నేర్చుకున్నవి… బాల రామాయణం, ఆంధ్రనామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కల్యాణం, సుమతీ శతకం, కృష్ట శతకం. పన్నెండో ఏట నుంచీ పూర్తిగా ఇంగ్లీషులోకి వచ్చేశాడు. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ భావాలు, ఇంగ్లిష్‌లో సంభాషణలు. సిలబస్‌తో పాటు అతడు కేశవ్ చంద్రసేన్ పుస్తకాలు చదివాడు. బెంగాల్ రచయిత అతడు. స్త్రీని స్థిమితంగా ఉంచలేని సమాజం అది ఎంత ఆధునికమైనదైనా, నాగరికమైనది కానే కాదని చంద్ర సేన్ రాశాడు. అది పట్టేసింది వీరేశలింగాన్ని. తను అనుకుంటున్నదే ఆయనా రాశాడు!

అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్నాడు వీరేశలింగం. ఘోరంగా ఉంది. చాలా ఘోరంగా! ఎవరి స్వార్థం వారిదే. ఎవరి నమ్మకాలు వారివే. ప్రజలారా మారండి అని వ్యాసాలు రాశాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు.ఎవరూ మారలేదు. వీడెవరో పిచ్చివాడు అనుకున్నారు. కొత్త పిచ్చోడు అనుకున్నారు. రాజారామ్మోహన్ రాయ్‌ననీ, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్‌ననీ అనుకుంటున్నాడేమో అన్నారు. ఇది బెంగాల్ కాదు, ఆంధ్రదేశం బ్రదర్ అని హితవు చెప్పారు.

వీరేశలింగానికీ సమాజానికీ పడడం లేదు. సమాజం అతడికన్నా బలమైనది. అంతకన్నా మొండివాడు వీరేశలింగం. ఉపాధ్యాయుడుగా అతడు శక్తిమంతుడు. ఒక తరాన్ని మలచగలడు. పత్రికా సంపాదకుడిగా అతడు శక్తివంతుడు. భావ విప్లవం తేగలడు. కానీ తరాన్ని మలచడానికి, విప్లవం రావడానికి సమయం పడుతుంది. అప్పటివరకు బాల్యవివాహాల బలిపీఠాల నుంచి చిన్నారులను రక్షించేదెలా? బాల వితంతువుల యవ్వనాన్ని భద్రపరిచేదెలా? సమాజం ఉలిక్కిపడి లేచేలా గట్టి దెబ్బ వేయాలి అనుకున్నాడు వీరేశలింగం.

ఆ దెబ్బ ఎంత గట్టిగా ఉండాలంటే – ఊరూరూ తిరిగి, వీధి వీధి తిరిగి తనకు తగిలిన గాయాన్ని ఈ దురాచార సమాజం ఏడ్చుకుంటూ చూపించుకోవాలి.పంతులుగారికి అప్పటికే రాజమహేంద్రవరం నిండా, ఆంధ్రదేశం నిండా శత్రువులు మొనదేలిన రాళ్లలా తయారై ఉన్నారు. విజయనగరం మహారాజుగారి బాలికల పాఠశాల ప్రాంగణంలో రెండు నెలల వ్యవధిలో ఆయన ఇచ్చిన రెండు స్పీచ్‌లు సంప్రదాయాల తాళాలు బద్దలు కొట్టి, ఇళ్లలో చొరబడి, వితంతు బాలికల కోసం వెదకడం మొదలుపెట్టాయి. ఎక్కడ చూసినా అదే చర్చ. ఆయనదే రచ్చ!

"ఎవరయ్యా ఈ త్రాష్టుడు. విలువల్ని భ్రష్టుపట్టించడానికే పుట్టాడా ఈ రాజమహేంద్రవరంలో?, ఒక పెళ్లి చాల్లేదా సంఘ సంస్కర్త గారికి! వితంతువులను ఉద్ధరించే పేరుతో ఊరిమీద పడ్డాడు!!, వీడిదసలు బ్రాహ్మణ పుట్టకేనా? సభల్లో ఏం కూస్తున్నాడో విన్నారా?" వీరేశలింగం కనిపిస్తే పట్టుకుని కుళ్లబొడిచేయాలన్నంత కోపంతో ఉంది ఊరూవాడ. ‘మనవాళ్లు పూర్వాచార పరాయణులగుట చేత నీతిబాహ్యమైన గూఢ వ్యభిచారమునైన నంగీకరింతురుగాని, యాచార విరుద్ధమైన ధర్మవివాహము నంగీకరింపరు’ అని వీరేశలింగం ఏమాత్రం మొహమాటం లేకుండా, మర్యాద లేకుండా సభల్లో ఉపన్యసించడం పెద్దపెద్దవాళ్లకు ఆగ్రహం తెప్పించింది.

 

1881 డిసెంబర్‌ 11వ తేదీన మొదటి వితంతు వివాహం

భువనగిరి పరదేశీ సోమయాజులు, శ్రౌతము కోటీశ్వరశాస్త్రులుగారు, కొక్కొండ వేంకటరత్నం పంతులు, ఓగిరాల జగన్నాథం, వేంకటరాయ శాస్త్రులు, దంతులూరి నారాయణ గజపతిరావు, దాసు శ్రీరాములు పంతులు వంటి మహామహులు వీరేశలింగంపై విరుచుకుపడ్డారు. ఆయనపై ఖండన గ్రంథాలు రాశారు. ఉత్తరాలు రాశారు. వాటిలో ఏ ఉత్తరానికీ ఆయన విలువ ఇవ్వలేదు. ఒక ఉత్తరానికి తప్ప. అది.. కృష్ణమండలంలోని తిరువూరు డిప్యూటీ తాసిల్దారు బ్రహ్మశ్రీ దర్భా బ్రహ్మానందం గారి నుంచి వచ్చిన ఉత్తరం. ‘తిరువూరు తాలూకా రేపూడి గ్రామంలో గౌరమ్మ అనే పన్నెండేళ్ల బాల వితంతువు ఉన్నదనీ, ఆమెకు మళ్లీ పెళ్లి చేసేందుకు ఆమె తల్లి సీతమ్మ సిద్ధ్దంగా ఉన్నారని’ అందులోని సారాంశం. ‘మీదే ఆలస్యం’ అని పంతులుగారు తక్షణం రిప్లయ్ ఇచ్చారు. అమ్మాయిని భద్రంగా రాజమహేంద్రవరం తెప్పించి తన ఇంట్లో, తన భార్య సంరక్షణలో ఉంచుకున్నారు. ఆ వెంటనే వరుడి వేట మొదలైంది!వీరేశలింగం పంతులుగారి ఇల్లు

విశాఖపట్నం పోలీస్ హెడ్ క్వార్టర్ట్స్‌లో పనిచేస్తున్న గోగులపాటి శ్రీరాములు అనే యువకుడు ఆ క్షణంలో పంతులుగారి మదిలో మెదిలారు. గతంలో అతడు పంతులుగారి ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. అతడికి కబురు పంపారు. శ్రీరాములు గౌరమ్మను చూడకుండానే పెళ్లికి ఒప్పుకున్నాడు. అది అతడికి పంతులుగారిపై ఉన్న గౌరవం. శ్రీరాములుకు అంతకుముందే పెళ్లయింది. భార్య అకస్మాత్తుగా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఆ ఒంటరితనాన్ని పోగొట్టేందుకు పిల్లనిస్తామని ఎంతోమంది వచ్చినా వితంతు వివాహం చేసుకోడానికి అతడు వేచి ఉన్నాడు. చివరికి గౌరమ్మ దొరికింది!

పెళ్లి పనులు రహస్యంగా జరుగుతున్నాయి. వరుడి పేరును కూడా పంతులుగారు రహస్యంగా ఉంచారు. గౌరమ్మ అనే బాల వితంతువుకు పంతులుగారింట్లో పెళ్లి జరగబోతోందని ఊరంతటికీ తెలిసింది కానీ వరుడెవరో బయటికి పొక్కలేదు. పెళ్లికి కావలసిన రక్షణ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కర్నల్ పోర్చిస్ దొరగారి నుంచి లభించింది. పెళ్లికి అవసరమైన డబ్బును పంతులుగారి స్నేహితుడు పైడా రామకృష్ణయ్యగారు సమకూర్చారు. వధూవరులకు కావలసిన నైతిక స్థయిర్యాన్ని పంతులుగారు ఇచ్చారు. అలా రాజమహేంద్రవరంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిగింది.

చివరి నిమిషంలో వరుడి తల్లిదండ్రులకు విషయం తెలిసి గగ్గోలు పెడుతూ కల్యాణ మంటపానికి చేరుకున్నారు. వేయడానికి అక్షింతలు, ఇవ్వడానికి అశీర్వచనాలు తప్ప వాళ్లకేం మిగల్లేదు. ఆ వివాహానికి వెళ్లిన వాళ్లందరినీ సమాజం గుర్తుపెట్టుకుని మరీ వెలి వేసింది. వేడుకలకు, వివాహాలకు పిలవడం మానేసింది. పంతులుగారిని చీడపురుగుగా చూసింది. పనిగట్టుకుని వేధించింది. వీరేశలింగం భయపడలేదు. వెనకడుకు వెయ్యలేదు. నేనింతే అన్నాడు. ఇదొక్కటే కాదు ఇంకా చాలా పెళ్లిళ్లు చేస్తానని సవాల్ విసిరాడు. ‘‘ఈ బక్క పీనుగకు చావైనా రాదే! వీడి మీది గౌరవంతో వీడి పెళ్లానికి ఇంకో పెళ్లి చేద్దుము’’ అని శుద్ధ సంప్రదాయవాదులు పంతులుగారిని రహస్యంగా తిట్టుకున్నారు. ఆ రహస్యం ఆయన చెవిన పడి నవ్వుకున్నారే గానీ, నమ్మిన తోవను వదిలి వెళ్లలేదు.

వీరేశలింగం పంతులుగారు శారీరకంగా బలహీనులైతే కావచ్చు. మానసికంగా బలవంతులు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, విద్యార్థుల బలం ఆయనకు తోడయ్యింది. అన్నిటికన్నా పెద్ద బలం ఆయన అర్ధాంగి రాజ్యలక్ష్మిగారు. వీళ్లందరి సహకారంతో పంతులుగారు తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు. తను బతికుండగా నలభై వరకూ వితంతు వివాహాలు జరిపించారు. ఈ దుస్సాహసమే ఆయన్ని నేడు సంఘసంస్కర్తగా నిల బెట్టింది.

వివేక వర్థిని

ఉన్నత విద్యానంతరం వీరేశలింగం అధ్యాపక వృత్తిని చేపట్టారు. రాజమండ్రి, కోరంగి, ధవళేశ్వరం, మద్రాసులలోని పాఠశాలల్లో పని చేశారు. అధ్యాపకుడిగా పనిచేస్తుండడంతో ‘పంతులు’గారని, వీరేశలింగం పంతులుగారని ప్రాచుర్యం వివేకవర్దిని ప్రింటింగ్ ప్రెస్పొందారు. సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి 1876లో ఉపాధ్యావృత్తి నుండి జర్నలిస్టుగా మారి ‘వివేకవర్థిని’ అనే మాసపత్రికను ప్రారంభించారు. మొదట ఈ పత్రిక మద్రాసు నుండి వచ్చేది. తర్వాత కొంతమంది స్నేహితులతో కలిసి – రాజమండ్రిలోనే సొంత ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి పత్రికను నిర్వహించారు.ఆ రోజుల్లోనే లంచగొండితనం, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు… ఇలా ఎన్నో అన్యాయాలు సమాజంలో జరుగుతుండేవి. వాటిపైకి తన పత్రిక ‘వివేకవర్థిని’ని ఆయన ఎక్కుపెట్టారు.

బాల్య వివాహాల వ్యతిరేకంగా, కుల నిర్మూలన కు ఆయన అకుంఠిత దీక్షతో పనిచేసాడు. వేశ్యా వ్యవస్థ పాతుకుపోయిన ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా వివేకవర్ధని లో వ్యాసాలు రాసాడు.

 

ఖండించారు, కళ్లు తెరిపించారు

19వ శతాబ్దంలో దేశమంతటా సంస్కరణ ఉద్యమం మొదలైంది. బ్రిటిష్ భాషాసంస్కృతుల సహచర్యం, వారి విజ్ఞానశాస్త్రం అన్ని రంగాలలో కొత్త ఆలోచనలు కలిగించాయి. ఆ ఆలోచనలకు తెలుగునాట కందుకూరి వీరేశలింగం ప్రధాన చోదకశక్తి అయ్యారు. సాహిత్యంతో ఉద్యమాన్ని ముందుకు నడిపారు.కేవలం రచనలకు, ఉపన్యాసాలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా, ఆచరణాత్మకంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.తొలి వితంతు పునర్వివాహాన్ని 11 డిసెంబర్ 1881న తన ఇంట్లోనే జరిపించారు!

ఈ క్రమంలో అనేక విమర్శలకు, అవమానాలకు, సంఘ బహిష్కరణలకు గురయ్యారు.పంతులుగారి కంటే ముందు బెంగాల్‌లో రాజా రామ్మోహన్‌రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ స్త్రీ అభ్యుదయం కోసం కృషి ప్రారంభించారు. వారి నుంచి పంతులుగారు ప్రేరణ పొందారు. స్వయంగా పత్రికలు నడిపారు.

నవల, వ్యాసం, ఉపన్యాసం, విమర్శ వంటి ప్రక్రియలకు ఆద్యులు.తెలుగులో వచ్చిన తొలి సాంఘిక నవల ‘రాజశేఖర చరిత్ర’ (1878) పంతులు గారు రాసిందే. సమకాలీన సమాజంలోని కుళ్లును, అజ్ఞానాన్ని ఎత్తి చూపుతూ, రకరకాల గుడ్డి నమ్మకాలను సహేతుకంగా ఖండించి, కళ్లు తెరిపించే ప్రయత్నం ఈ నవల్లో జరిగింది. పంతులుగారి ప్రతి రచనలోనూ సంఘ సంస్కరణే అంతర్లయ.

 

స్త్రీ విద్యా వ్యాప్తి

1907 ఫిబ్రవరిలో హిందూ సమాజాన్ని స్థాపించిదాని ఆధ్వర్యంలో ఎన్నో సంస్థలను, ఆస్తులను కూడబెట్టారు. వీరేశలింగంగారు సతీమణి శ్రీమతి రాజ్యలక్ష్మమ్మ కూడా సంఘ సేవాభిలాషి కావడం వల్ల భర్త ప్రారంభించిన సంఘ సంస్కరణోద్యమానికి ఆమె పూర్తి సహాయ సహకారాలను అందించారు. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న నానుడి వీరేశలింగం వంటి ప్రముఖుల విషయంలో అక్షరాలా రుజువైంది. రాజ్యలక్ష్మమ్మగారు కూడా స్త్రీ విద్యా వ్యాప్తి కోసం కృషి చేశారు. రాజమహేంద్రవరం వంకాయలవారి వీధిలో ఇప్పటికీ పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో మ్యూజియంగా నిర్వహించబడుతున్న వీరేశలింగంగారి ఇంటి నుంచి ఎన్నో సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. వీరేశలింగం,రాజలక్ష్మమ్మ దంపతులు నివాసం ఉండిన ఇంట్లోనే ముద్రణాలయం, పరిశోధనా కేంద్రం ఇప్పటికీ నెలకొన్నాయి.

వీరేశలింగంగారు సంస్కరణ ఉద్యమానికి చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు ఎంతో చేయూతనిచ్చారు. వీరేశలింగ ఆస్తికోన్నత పాఠశాలను స్థాపించడంలో, స్త్రీ విద్యా వ్యాప్తిలో వీరేశలింగంగారికి చిలకమర్తి వారు ఎంతో సాయం అందించారు.  వీరేశలింగ ఆస్తికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసించే వారికి మామూలు చదువుతోపాటు దైవ ప్రార్థన అలవాటు చేసేవారు. వీరేశలింగంగారు రూపొందించిన ప్రార్థన ఒక మతానికీ, ఒక కులానికీ సంబంధించినది కాక, నామరూప రహితుడైన పరమాత్మ గురించి పంతులుగారు రచించిన ఆ ప్రార్థన అన్ని మతాల వారికీ వర్తించే విధంగా ఉంటుంది. అంతేకాక, ఆ పాఠశాలలో సంఘ సేవాభిలాషను పిల్లలకు బాల్యం నుంచి అలవర్చుకునేందుకు తగిన వాతావరణం నెలకొల్పుతారు. వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాల జూనియర్‌, డిగ్రి కళాశాలలతో అలరారుతో ఏటా వేలాది విద్యార్ధులకు విద్యా దానం చేస్తున్నాయి. రాజ్యలక్ష్మమ్మగారి పేరిట మహిళా కళాశాలను నెలకొల్పి ఆ సంస్థ ద్వారా మహిళా విద్యా వ్యాప్తి చేస్తున్నారు.
 

1880 నవంబరులో స్త్రీ విద్యపై ఆయన ఇచ్చిన ఉపన్యాసం తెలుగులో పాఠ్యాంశం అయింది.

స్త్రీ విద్యపై పంతులుగారి ఉపన్యాసం (1880)లోని కొన్ని భాగాలు

ఒక్క పురుషులకు మాత్రమే కాక స్త్రీలకు సహితమూ విద్య యావశ్యకమనుట, స్త్రీలకు కూడా వినయ వివేకాది సద్గుణములు కలుగవలయునని కోరు వారికెల్లరకును గరతలామలకమై యుండును. పూర్వకాలమునందు మనదేశంలో స్త్రీ విద్య వ్యాపించి యున్నదనుటకు భోజరాజు ప్రభుత్వ కాలమునందును, కృష్ణదేవరాయల ప్రభుత్వ కాలమునందును స్త్రీలు చెప్పిన శ్లోకములును, పద్యములును చాలినంత నిదర్శనములుగానున్నవి.

మొల్ల యనునామె రామాయణమును సైతము రచించి యున్నది. అంతియకాక పూర్వకాలమందు పురుషుల వలెనే స్త్రీలును ఎల్లర చేతను గౌరవింపబడుచుండిరి. సీత మొదలగు వారు తమ భర్తలతో సభలకు వచ్చి సింహాసనము మీద కూర్చుండుట మొదలగు సంగతుల పెక్కింటి నిందుకు దృష్టాంతముగా జెప్పవచ్చును.

స్త్రీలు స్వతంత్రురాండ్రుకారన్న మాత్రమున వారు గౌరవింపనర్హురాండ్రు కారని యెంచుట కేవలము పొరపాటు. స్త్రీలను పురుషులతో సమానంగా గౌరవించుచున్నంతకాలమును మనదేశము యున్నతస్థితి యందే ఉండినది. అట్లు గౌరవించుటమాని, విద్య చెప్పించుట వదిలివేసి, వారిని దాసీజనులవలె చూడ మొదలుపెట్టిన తరువాతనే మన దేశమునకిట్టి దౌర్భాగ్యదశ యారంభమయినది.

స్త్రీలు తమ పురుషులకాలోచన చెప్పుటయందు మంత్రుల వంటివారయి యుండవలయునని స్మృతులు ఘోషించుచుండుట చేత వారియెడ గౌరవముంచి వారి యాలోచనలను గణ్యతలోనికిదెచ్చుట పురుషుల విధియని వేరు చెప్పనక్కర యుండదు. మన వారు స్త్రీలకు మంచి విద్యను జెప్పించి వివేక మహితురాండ్రనుగాజేసి, పిమ్మల వారి యాలోచనను సహితము తగిన విషయములందంగీకరించి  వారిని గౌరవించుచు మన పూర్వులు పొందియుండిన మహోన్నతదశను మరల పొందుటకయి ప్రయత్నింతురని మరి మరి కోరుచున్నాము.

 

వీరేశలింగంగారు గొప్ప సంస్కర్తే కాదు,గొప్ప కవి,రచయిత.తెలుగు సాహిత్యంలో ఆయన స్పృశించని సాహితీ ప్రక్రియ లేదు. ఆయన రచనలు, కవిత్వాల్లో కూడా అభ్యుదయ భావాలు నిండి ఉండేవి. తెలుగుసాహిత్యంలో వీరేశలింగం గారికి సమున్నతమైన స్థానం ఉంది.నవలలు,కథలు,వ్యాసాలు అన్ని రకాల సాహితీ ప్రక్రియల్లో వీరేశలింగం గారు తన దైన ముద్ర వేశారు. తెలుగుసాహిత్యం ఉన్నంత వరకూ వీరేశలింగంగారు ఉంటారు.అలాగే,సంస్కరణోద్యమం ఉన్నంత వరకూ ఆయన పేరు చిరస్థాయిలో నిలుస్తుంది. ఆయన వ్యక్తి కాదు,గొప్ప వ్యవస్థ.

సాహితీ వ్యాసంగం

సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు కందుకూరి.

ఆయన 130కి పైగా గ్రంధాలు రాసాడు. ఆన్ని గ్రంధాలు రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు రాసాడు. స్వీయ చరిత్ర రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు.

సంగ్రహ వ్యాకరణం రాసాడు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు.
 

కందుకూరి రచనల జాబితా

పద్య కావ్యాలు
 

  •     "మార్కండేయా" మకుటంతో శతకం (తొలినాళ్ళ రచన)
  •     "శ్రీరాజమహేంద్ర పురవర గోపాలా" మకుటంతో శతకం (తొలినాళ్ళ రచన)
  •     శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధం (నల చరిత్ర) - మూడు ఆశ్వాసాల కావ్యం
  •     రసికజన రంజనం (ప్రబంధం) - 1870 - చిత్ర కవిత్వం, శృంగారం ప్రధానంగా ఉన్నాయి. ఇటువంటివి రచించడం సరి కాదని కాలక్రమాన మానివేశానని స్వీయరచనలో పేర్కొన్నాడు
  •     అభాగ్యోపాఖ్యానము - హేళనా పూర్వకమైన సంఘ సంస్కార దృష్టితో కూడిన వ్యంగ్య కావ్యం
  •     శుద్ధాంధ్ర భారత సంగ్రహము - అచ్చతెలుగులో మూడు ఆశ్వాసాల కావ్యం
  •     సరస్వతీ నారద విలాపము (1895) - పద్యాత్మకమైన వ్యంగ్య ప్రహసనం - భాషా ప్రయోగం పట్ల కందుకూరి దృక్పథంలో వచ్చిన మార్పును ఈ కావ్యంలో చూడవచ్చును. అర్ధ సారస్యం లేని ఊహలతో, పాండిత్య ప్రకర్షతో ఇటు సరస్వతిని, అటు నారదుని అవమానిస్తున్నారని ఇందులో చూపారు.
  •    నీతి పద్యాలు
  •    స్త్రీ నీతి దీపిక
  •    జాన్ గిల్పిన్ - ఆంగ్లంలో "విలియమ్ కౌపర్" వ్రాసిన కావ్యానికి తెలుగు సేత
  •   పథిక విలాసము - ఆంగ్లంలో "ఆలివర్ గోల్డ్‌స్మిత్" వ్రాసిన "ది ట్రావెలర్" కావ్యానికి తెలుగు సేత

నాటకాలు

  •     చమత్కార రత్నావళి - "కామెడీ ఆఫ్ ఎర్రర్స్" అనే షేక్సుపియర్ నాటకాన్ని తెలుగులో వ్రాసి విద్యార్ధులచే ప్రదర్శింపజేశారు.
  •     కాళిదాసు శాకుంతలం - తెలుగులో
  •     రత్నావళి - సంస్కృత రూపకానువాదం
  •     దక్షిణ గోగ్రహణం
  •     సత్య హరిశ్చంద్ర
  •     మాళవికాగ్ని మిత్రం వంటి 12 నాటకాలు

నవలలు

  •      రాజశేఖర చరిత్రము - తొలి తెలుగు సాంఘిక నవల. ఆంగ్లంలో ఆలివర్ గోల్డ్‌స్మిత్ వ్రాసిన "వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డ్" అనే నవలకూ దీనికీ కొన్ని పోలికలున్నాయి. అయితే ఆ నవల కొంత ఉపకరించిందనీ, కాని ఇది అనువాదం కాని అనుకరణ కాని కాదని వీరేశలింగం చెప్పాడు. "పంతులుగారి మహాయశస్సుకునకు శరత్కౌముది వంటిది" అని అక్కిరాజు రమాపతిరావు అన్నాడు. ఇందులో రచయిత సాంఘిక దురాచారాలను, మూఢ నమ్మకాలను విమర్శించాడు. చక్కని తెలుగు సామెతలను, లోకోక్తులను ప్రయోగించి ముందుతరం నవలలకు మార్గదర్శకంగా నిలచాడు.
  •     ప్రధాన వ్యాసం: రాజశేఖర చరిత్రము
  •     సత్యరాజా పూర్వదేశ యాత్రలు - ఆంగ్లంలో "జోనాథన్ స్విఫ్ట్" వ్రాసిన "గల్లివర్స్ ట్రావెల్స్" ఆధారంగా వ్రాశాడు. ఇందు సమాజపు వికృత సంఘటనలను అవహేళన చేశాడు. "ఆడ మళయాళం" అనే పదం ఇందులోంచే ప్రసిద్ధమయ్యింది.
  •     సత్యవతీ చరిత్రము (1883) - స్త్రీ విద్యాభివృద్ధిని, ప్రాముఖ్యతను బోధించే నవల - ఆ రోజులలో ఇది మంచి ప్రాచుర్యాన్ని పొందిందట.
  •     చంద్రమతీ చరిత్రము (1884) - మత విషయాలను, ధర్మాలను, స్త్రీ అభ్యుదయాన్ని ప్రోత్సహించే నవల.

ప్రహసనాలు

సాంఘిక దురాచారాలను సంభాషణాత్మకంగా, వినోదాత్మకంగా విమర్శించే ఇటువంటి ప్రయోగానికి వీరేశలింగమే ఆద్యుడు. చాలా ప్రహసనాలను "వివేక వర్ధిని" పత్రికలో ప్రచురించాడు. "ప్రహసనము ఆయన కరములకు చితపరికరమయ్యెను. శైలి సొంపులతోను, హాస్యంపుదళులతోను శోభిల్లెడి ఈ ప్రహసనావళియందు దుష్టాంగమును ఖండించి శేషాంగ స్ఫూర్తికి రక్షణ చేయు శస్త్ర చికిత్సకునివలె ఈ రచయిత సాంఘిక అనర్ధములను దునుమాడెను" అని "రాయసం వెంకట శివుడు" ప్రశంసించాడు. షుమారు 50పైగా వ్రాసిన ప్రహసనాలలో 10 వరకు ఆంగ్లమూలాలపై ఆధారపడినాయి. తక్కినవి స్వతంత్ర రచనలు. ప్రహసనాలు "హాస్య సంజీవని" పేరుతో మూడు భాగాలుగా ప్రచురితమయ్యాయి. కొన్ని ప్రసిద్ధ ప్రహసనాలు
 

  •     పెళ్లి వెళ్ళిన తరువాత పెద్ద పెళ్ళి, లోకోత్తర వివాహము - వేశ్యాభిమానం, చాదస్తపుటాచారాలు, శాఖా భేదాలు, అజ్ఞానం, అమాయకత్వం, స్వార్ధం వంటి అంశాలు కలగలిపినవి.
  •     జమా బందీ, యోగాభ్యాసము - కులాచారాన్ని నిరసిస్తూ
  •     వేశ్యా విషయ సంవాదము
  •     చంద్ర గ్రహణం
  •     తేలు మందు
  •     హిందూ మతసభ
  •     బహుభార్యాత్వం
  •     బాల భార్యా వృద్ధభర్తృ సంవాదం
  •     మ్యునిసిపల్ నాటకము
  •     కామరూప ప్రహసనము
  •     కలిపురుష శనైశ్చర విలాసము - కలి, శని కలిసి దేశంలో ప్రజలను అజ్ఞానులుగా, మూఢులుగా, మద్యపాన ప్రియులుగా చేస్తున్నారని
  •     వేశ్యాప్రియ ప్రహసనం - 5 అంకాల ప్రహసనం, ఎంతో హాస్యం మిళితమైనది. ఆనాటి భోగం ఆచారాలను గురించి
  •     అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనం
  •     విచిత్ర వివాహ ప్రహసనం

కధలు

అధికంగా కందుకూరి కధలు స్త్రీల అభ్యుదయాన్ని ప్రోత్సహించేవిగా ఉన్నాయి. కొన్ని ఆంగ్ల మూలాలనుండి అనుసరించినవి కాని అధికంగా స్వతంత్ర రచనలే. "సతీ హిత బోధిని" అనే పత్రికలో ఎక్కువగా ప్రచురించాడు. "నీతి కధా మంజరి" అనే 158 చిన్న కధల సంకలనాన్ని కూడా వెలువరించాడు.

వ్యాసాలు

వివిధ అంశాలపై వీరేశలింగం 190 దాకా వ్యాసాలు / ఉపన్యాసాలు వ్రాశాడు. సత్య వాదిని, వివేక వర్ధిని, సతీహితబోధిని, చింతామణి, సత్య సంవర్ధిని, తెలుగు జనానా నంటి పత్రికలలో ఇవి ప్రచురితమైనాయి. ఉదాహరణకు కొన్ని వ్యాసాల శీర్షికలు
 

  •     దేశీయ మహాసభ - దాని యుద్దేశ్యములు
  •     రాజ్యాంగ సంస్కరణము - కులాచార సంస్కరణము
  •     ఇంగ్లీషు ప్రభుత్వము వలన లాభములు
  •     నీతి, విద్య కంటె నీతి ముఖ్యము, మానుష ధర్మము, ఈశ్వరోపాసనము
  •     చదువెఱుగని స్త్రీలు తమ బిడ్డలకు శత్రువులు
  •     అత్తగారి కోడంటికము, భార్యా భర్తల ఐకమత్యము, స్త్రీపునర్వివాహ శాస్త్ర సంగ్రహము, స్త్రీ పునర్వివాహ విషయకోపన్యాసము

చరిత్రలు
 

  •    ఆంధ్ర కవుల చరిత్ర - ఈ గ్రంధ రచన ఆంధ్ర వాఙ్మయ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము. సమగ్రమైన, పరిశోధనాత్మకమైన, ప్రణాళికా బద్ధమైన కవుల చరిత్ర రచనకు ఆది యత్నము. అనేక తాళపత్రాలను, శాసనాలను, ముద్రిత అముద్రిత గ్రంధాలను పరిశీలించి వెలువరించిన గ్రంధము. 1886 నుండి 1917 వరకు ఇది విస్తరింపబడింది.
  •     స్వీయ చరిత్ర - 1903- 1915 మధ్య సాగిన రచన. నిష్పక్షపాతంగా, వచన శైలిలో సాగిన రచన. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు నడిపే విజ్ఞాన చంద్రికా గ్రంధమాల వారు దీనిని ప్రచురించారు. ఇది ఆనాటి సామాజిక స్థితికి అద్దం పట్టే రచన. తెలుగులో వచన స్వీయ చరిత్రకు ఇది ఆద్యం.
  •     దేశ చరిత్ర
  •     నాయకుల చరిత్ర
  •     ఉత్తమ స్త్రీల జీవిత చరిత్రలు

 

ఇతర రచనలు
 

  •     సంగ్రహ వ్యాకరణం - లక్షణ గ్రంధం
  •     కావ్య సంగ్రహం - లక్షణ గ్రంధం
  •     తర్క సంగ్రహానికి ఆంధ్రీకరణం
  •     ఋగ్వేదానికి తాత్పర్యం
  •     శారీర శాస్త్ర సంగ్రహము
  •     జ్యోతిశ్శాస్త్ర సంగ్రహము
  •     జంతు స్వభావ చరితము

వీరేశలింగం నడిపిన పత్రికలు
 

  •     వివేక వర్ధిని
  •     సతీహిత బోధిని
  •     సత్య సంవర్ధిని
  •     సత్యదూత
  •     చింతామణి
  •     తెలుగు జనానా
     

కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.

కందుకూరి వీరేశలింగం పంతులు

విశిష్టత

ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు:

  • మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
  • మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
  • తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
  • తెలుగులో తొలి నవల రాసింది ఆయనే
  • తెలుగులో తొలి ప్రహసనం రాసింది కందుకూరి
  • తెలుగుకవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తి
  • విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత

ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసాడు.

తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన. యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.

Body:
Post date: Mon, 10/29/2012 - 23:12
Path: /node/1033
విభాగము:
వివరణ:

Gurajada apparao‘కన్యాశుల్కం’ నాటకం ఇవాల్టికీ గురజాడ కళా సృష్టికి దర్పణంగా నిలుస్తోంది. ‘ముత్యాల సరాలు’ ఛందస్సులో ఆయన తెచ్చిన గొప్ప మార్పుకి ప్రతీకగా నిలుస్తోంది. ‘తెలుగు కవిత్వంలో నేను కొత్త, ఎక్స్పెరిమెంట్‌ ఆరంభించాను. నా ముత్యాల సరాల రీతిని మీరు గమనించినట్లయితే మీకే ఈ విషయం ధృవపడుతుంది... నా మొదటి గేయంలో సాధ్యమైనన్ని వాడుక మాటలను, గ్రాంధిక వ్యాకరణ సూత్రాలకు, లేదా ప్రాచీన కవుల పద్ధతులకు ఒదగని శబ్దాలను ప్రయోగించాను’ అని ఆయన ఒక లేఖలో రాశారు. నాటక ప్రక్రియలో, కవితా వ్యాసంగంలో, వ్యవహారిక భాషకు పునాది వేసిన గురజాడ విమర్శన మార్గాన్ని కూడా అనుసరించాడు. ప్రత్యేకించి విమర్శనాత్మక రచనలు చేయలేదు. కాని లేఖల్లో, ‘అసమ్మతి పత్రం’లో ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన హేతువాద విమర్శనా దృష్టికి ఉదాహరణగా నిలుస్తాయి. నాటకంలో, కవిత్వంలో ఆయన కళాత్మక నైపుణ్యం కనిపించినట్టే, విమర్శకి సంబంధించిన ఆయన శాస్ర్తీయ ఆధునిక దృష్టిని ఆ అభిప్రాయాలు తెలియచేస్తాయి.

ఆయన సమర్పించిన ‘అసమ్మతిపత్రం’లో, లేఖల్లో కనిపించే ఆయన దృక్పథాన్ని బట్టి చూస్తే ఆయన విమర్శ రంగంలో కూడా ఎంత విశిష్టత సంపాదించగలరో అర్ధమవుతుంది. అయితే ఆయన తలపెట్టి, నిర్వహించలేకపోయిన పనుల్లో ఇదొకటి. దాని వల్ల తెలుగు సాహిత్యం ఆ మేరకు నష్టపోయింది. తాను సంకల్పించి చేయలేని పను గురించి ఆయన ఉత్తరాల్లో తెలుస్తూ ఉంటాయి. ‘తెలుగు వ్యాకరణం’ వ్రాతామనుకున్నానా ఆరంభించిన పని అలాగునే నిద్ర పోతూ ఉంది (ఒంగోలు ముని సుబ్రహ్మణ్యానికి, 1909 మే 17). మరొక నాటకం వ్రాతామని కథా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను (ఆయనకే 1909 మే 24).

ఆంధ్రకవుల, వారి పోషకుల కాల నిర్ణయం కోసం కావ్యాల ప్రథమాశ్వాసాలని పరిశీలించే పనీ ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం మీద పడింది. అప్పారావుగారికి ‘ఆంధ్ర కవుల చరిత్రను వ్రాసి ప్రచురించవలెనని ఆశయమై ఉండె’నని ఆయన రాశారు. అయితే ఆ పనులు సాగలేదు.‘ఒక కావ్యాన్ని చదివి దాన్ని సునిశితంగా పరిశీలించి తూచినట్టు విలువ కట్టే విమర్శకులు మనలో బహు అరుదు’ (లేఖలు) అని ఆయన అభిప్రాయపడ్డారు. కావ్యాల విషయంలోనే కాదు, భాషాపరంగా కూడా సరైన విమర్శ లేదని ఆయన అభిప్రాయం. ఇవాళ తెలుగు కవితా పద ప్రయోగాల వ్యాకరణం పదకొండవ శతాబ్దినాటి ఆది కావ్యం నాటి వ్యాకరణం గానే ఉంది.

ఇవాళ ఆ పాతగిల్లిన పదజాలాన్నే వాడుతూ ఉన్నారు. ఆ వ్యాకరణం పడికట్టునే పట్టుకు వేళాడుతున్నారు. భాషకు సంబంధించిన శాస్త్రీయ అధ్యయనమే జరగడం లేదు. ఒక్క గిడుగు రామమూర్తి పంతులు తప్ప యెవళ్ళూ ఈ కృషి చెయ్యడం లేదు’ అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు. ఆయన అభిప్రాయంలో సాంఘిక, రాజకీయ, సాహిత్య లక్ష్యాలు మారేయి. సాహిత్యం ఏ కొద్దిమందికో మాత్రమే గిరి గీసుకు పోయి కూర్చోలేదు. బ్రిటిష్‌ విద్యావిధానం వల్ల జీవితం పట్ల, భాష పట్లా, సాహిత్యం పట్లా ప్రజల దృక్పథం మారింది. ఒప్పుడు విద్యా, సాహిత్యాలు సమాజంలో ఒక శ్రేణికి మాత్రమే గుత్త హక్కుగా ఉండేవి. వారికి సంస్కృత మర్యాదలే అనుల్లంఘనీయంగా కనిపించేవి. పరిస్థితి మారింది.

ప్రజాస్వామిక విధానం వల్ల జన సామాన్యానికి విద్య అందుబాటులోకి వచ్చింది. ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన భాషా సాహిత్యాలు జనసామాన్యానికీ అందుబాటులోకి రావాలి. అంచేత పాతపడిన పదసంచయం, కాలం చెల్లిన కావ్యమర్యాదలూ పోవాలి. పాత పద్ధతిలో ఎంత పాండిత్య ప్రకర్షతో, పద గుంభనతో ఓ కావ్యం ఉంటే అంత గొప్ప. అందుకు గాను కావ్య భాషలో ఒక పదానికి అనేక పర్యాయ పదాలు ఉండేవి. దాంతో భాష గుది బండలా తయారైంది. అలాంటి ఇబ్బందులకు సెలవు చెప్పి ఆధునిక వ్యవహారిక తెలుగు వాడుకలోకి వస్తే తెలుగు గ్రంథాల రాశి, వాసి కూడా పెరుగుతాయి. కావ్యభాషలోనే రాయాలన్న నిబంధన వల్ల చదువుకున్నవాళ్ళు కూడా యెక్కడ వ్యాకరణ నియమాలకి భంగం కలుగుతుందో, ఎక్కడ శబ్దాలని అపసవ్యంగా ప్రయోగించడం జరుగుతుందో నని బెదిరిపోతున్నారు.

మామూలుగా అయితే వాళ్ళు హాయిగా తమ భావాల్ని వెల్లడించగలరు. కాని రాతలో భాష ఆ పాత నియమాలకు కట్టుబడి ఉండాలన్న నియమం వల్ల జంకుతున్నారు. వాడుక భాష వస్తే ప్రజలకి స్వేచ్ఛ వస్తుంది. వికాసం వస్తుంది. భావవిప్లవం వస్తుంది. ఇలాంటి అభిప్రాయాలకి భిన్నంగా వ్యవహారిక భాషను వ్యతిరేకిస్తూ గ్రాంథిక భాషా వాదులు అనేక వాదనలు లేవదీశారు. వాటన్నిటికీ అప్పారావు సమాధానం చెప్పేరు. ఒక ప్రామాణిక భాష అన్ని మాండలికాల్నీ ఇముడ్చుకుంటూ పరిపుష్టం చేసుకుంటూ వెల్లివిరుస్తుందని చెప్పేరు.

ఇంగ్లీషు, ఫ్రెంచి సాహిత్య భాషలు లండన్‌, పారిస్‌ పలుకుబళ్ళనుంచి రూపు తీసుకున్నాయని చెప్పేరు. అలాగే ఇటాలియన్‌ డక్కనీ నుడికారం నుంచి ప్రామాణికత సంపాదించుకుందని చూపించేరు (ఇవాళ ప్రాంతీయ నుడికారాల గురించి చర్చ జరుగు తూఉంది. కారణాలు ఏమిటైందీ వివరించడం అనవసరం. కాని అన్ని ప్రాంతాల వాళ్ళూ కొన్ని మినహాయింపులున్నా, అందరికీ బోధపడే భాషనే రాస్తున్నారు, మాట్లాడుతున్నారు).

భాషా పరంగా ఇంత విమర్శనాత్మకంగా శాస్ర్తీయ దృక్పథాన్ని వివరించి గురజాడ సాహిత్యం గురించీ తన విమర్శను అసమ్మతి పత్రంలో ప్రకటించేరు. ఉత్తరాలలో వెల్లడించిన అభిప్రాయాలకి, అసమస్మతి పత్రంలో వెల్లడించిన అభిప్రాయాలకీ పునాది ఒక్కటే. శాస్త్రీయ పద్ధతిలో గ్రంథాల్ని విమర్శించడం. విజ్ఞాన చంద్రికా గ్రంథమాల ప్రచురించిన నవల ‘విజయనగర సామ్రాజ్యం’ గురించి సుదీర్ఘ విమర్శ చేశారు. దానికి బహుమతి కూడా వచ్చింది. ఆ నవలని ప్రధాన సంపాదకుడు, మేనేజర్‌ ఆమోదించి ప్రచురించినట్టు రచయిత ముందు మాటలో చెప్పుకున్నారు. సంపాదకులు ‘విజయ నగర సామ్రాజ్యం’ యెంత గొప్ప నవలో ప్రశంసించినట్టూ రచయిత చెప్పుకున్నారు. అంచేత సంపాదకులతో సహా అందరూ దాని బాగోగులకి బాధ్యత వహించాలని గురజాడ ముందే ప్రస్తావించేరు.

రచయితకి చరిత్ర గురించిన పరిజ్ఞానమూ లేదు. విషయానికి సంబంధించి వాస్తవాలు ఏమిటైందీ జాగ్రత్తగా చూసుకునే మెలుకువా లేదు. రెండ్రోజులు మాత్రమే చరిత్ర చదివి, రచనకి శ్రీకారం చుట్టి, నెల లోపు పూర్తి చేసినట్టు జంకూ గొంకూ లేకుండా చెప్పుకోవడం యెంత ఆక్షేపణీయమో గురజాడ విశదీకరించేరు. అసలు చారిత్రక నవలల ఇతి వృత్తం విషయంలో ప్రామాణిక రచనలు చదవలేదు. సీవెల్‌ రాసిన ‘విస్మృత సామ్రాజ్యం’ గురించి తెలియదు. దాంతో చరిత్రలో యథార్థంగా జరిగిన విషయాన్నీ వక్రీకరించేడని గురజాడ తప్పు పట్టేరు.

ఆయన ఉత్తమ సాహిత్య లక్షణాల గురించి మెరుపు మెరిసినట్టు సూచనలు చేశారు. తనే శాస్ర్తీయ పద్ధతిలో ఆంధ్ర కవుల చరిత్ర రాద్దామని సంకల్పించారు.కందుకూరి వీరేశలింగం రాసిన ‘కవుల చరిత్ర’ వచ్చింది. దాన్ని ఆయన పరిశీలించిన తీరు ఆయన దృక్పథానికి అద్దం పడుతుంది. ఈ పుస్తకం అటు పక్షుల్లోకీ రాదు, ఇటు జంతువల కిందకీ చేరదు. ఎలా వర్గీకరించాలి? అసలిది కవుల జీవితమే కాదు చెప్పాలంటే. కవుల జీవిత చిత్రణకి ప్రయత్నమే లేదు. ఇక కవుల క్రమం సంగతి సరే సరి అని చెబుతూ జాన్సన్‌ కృతిని యెత్తి చూపిస్తారు. గురజాడ లేఖల్లో, రచనల్లో వెల్లడించిన అభిప్రాయాల బట్టి ఆయన ఎంతటి విమర్శకుడు అయి ఉండేవాడో తెలుస్తుంది.

Gurajada apparao‘కన్యాశుల్కం’ నాటకం ఇవాల్టికీ గురజాడ కళా సృష్టికి దర్పణంగా నిలుస్తోంది. ‘ముత్యాల సరాలు’ ఛందస్సులో ఆయన తెచ్చిన గొప్ప మార్పుకి ప్రతీకగా నిలుస్తోంది. ‘తెలుగు కవిత్వంలో నేను కొత్త, ఎక్స్పెరిమెంట్‌ ఆరంభించాను. నా ముత్యాల సరాల రీతిని మీరు గమనించినట్లయితే మీకే ఈ విషయం ధృవపడుతుంది... నా మొదటి గేయంలో సాధ్యమైనన్ని వాడుక మాటలను, గ్రాంధిక వ్యాకరణ సూత్రాలకు, లేదా ప్రాచీన కవుల పద్ధతులకు ఒదగని శబ్దాలను ప్రయోగించాను’ అని ఆయన ఒక లేఖలో రాశారు. నాటక ప్రక్రియలో, కవితా వ్యాసంగంలో, వ్యవహారిక భాషకు పునాది వేసిన గురజాడ విమర్శన మార్గాన్ని కూడా అనుసరించాడు. ప్రత్యేకించి విమర్శనాత్మక రచనలు చేయలేదు. కాని లేఖల్లో, ‘అసమ్మతి పత్రం’లో ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన హేతువాద విమర్శనా దృష్టికి ఉదాహరణగా నిలుస్తాయి. నాటకంలో, కవిత్వంలో ఆయన కళాత్మక నైపుణ్యం కనిపించినట్టే, విమర్శకి సంబంధించిన ఆయన శాస్ర్తీయ ఆధునిక దృష్టిని ఆ అభిప్రాయాలు తెలియచేస్తాయి.

Body:
Post date: Tue, 09/25/2012 - 14:20
Path: /node/891
విభాగము:
వివరణ:

రావి నారాయణరెడ్డిరావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. 1908 జూన్ 4న జన్మించాడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పని చేశారు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐలో చాలాకాలం పని చేశారు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించారు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకానికి, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసినారు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది.

1941, 1943 సంవత్సరాల్లో భువనగిరిలో జరిగిన పదకొండవ, పన్నెండవ ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించి, విజయవంతం చేశారు. 1922-38 వరకు హైదరాబాద్ స్టేట్ హరిజన సేవక సంఘం కార్యదర్శిగా పనిచేశారు. గాంధీ, మావో, హోచిమిన్, కృశ్చేవ్‌లను స్వయంగా కలిసిన సమరశీలి. ఒకసారి మహాత్మాగాంధీ హైదరా బాద్‌కు వచ్చినప్పుడు తన భార్య సీతాదేవితో వెళ్ళి కలిశారు. భార్య ఒంటిపై ఉన్న నగల న్నింటినీ గాంధీ చేతిలో పెట్టి, హరిజన సేవక సంఘానికి ఇవ్వమని చెప్పిన నిరాడం బరుడాయన. సాయుధ పోరాట సమయంలో తన వందల ఎకరాల సొంత భూమిని రైతులకు పంచిన ఉదారవాది.

రావి నారాయణరెడ్డి అందరికీ తెలిసిన కమ్యూ నిస్టు మాత్రమే కాదు. కొందరికే తెలిసిన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామికవాది కూడా. 1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరకముందు సుమారు 11 ఏళ్లపాటు ఆయన ‘సామాజిక న్యాయం’ సాధించడానికి శ్రమించారు. 23 ఏళ్ల వయసులో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్య దర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించారు. రెండు వసతి గృహాలను నిర్వహించారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణ సమీపంలోని బొల్లేపల్లి గ్రామంలో 1908 జూన్ 5న భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రావి నారాయణరెడ్డి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ప్రజాపోరాటానికి చూపునిచ్చిన జననేతగా ప్రసిద్ధుడు. భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటు ఉద్యమంలో నిజామాంధ్ర మహాసభలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ అతి విశిష్టమైనది. ప్రజాజీవితంలో ఉన్న నాయకులు ఒక కీలకమైన చారిత్రక సన్నివేశంలో సిద్ధాంతపరంగా విభేదించే శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరచి ఏకతాటిపై ఉద్యమాన్ని ఎలా నిర్మించవచ్చో తన ఆచరణ ద్వారా నిరూపించిన ప్రజాస్వామికవాది ‘రావి’. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది.

1975లో- సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్‌దూమ్ భవన్ శంకుస్థాపనకు -ఆనాటి సీపీఐ చైర్మన్- ఎస్‌ఏ డాంగే వచ్చారు. ఆయన్ను కలిసేందుకు కమ్యూనిస్టు నేతలు కొందరు ఒకచోట సమావేశమయ్యారు. అంతలో, ఆ గదిలోకి డాంగే ప్రవేశించారు. అందరూ లేచినిలబడి ఆయన పట్ల గౌరవం ప్రకటించారు. వారిలో రావి నారాయణరెడ్డి (ఆర్ ఎన్) కూడా ఉన్నారు. మిగతా అందరినీ వదిలి తిన్నగా రావి నారాయణ రెడ్డి దగ్గిరకు నడిచారు డాంగే. ‘కామ్రేడ్ ఆరెన్! మీరు నా గౌరవార్థం లేచి నిలబడడం తగదు! లక్షలాది మంది జనాన్ని ఒక్కమాటతో నియంత్రించిన సేనాని మీరు- మీ ముందు మేమెంతవాళ్లం?’ అంటూ వినయపూర్వకంగా అన్నారు. డాంగే ‘మాటతీరు’ తెలిసినవారికి, ఆయన వినయం చూసి మతిపోయింది.

తెలంగాణ రైతాంగ సాయుధపోరాట సారథిగా చరిత్ర సృష్టించారు ఆర్ ఎన్. రజాకార్ రాక్షస రాజ్యాన్ని మట్టికరిపించిన చరితార్థుడు ఆయన. దాదాపు నాలుగేళ్లు సాగిన సాయుధ పోరాటం నిజామ్ పాలనలోని వేలాది గ్రామాలను ఫ్యూడల్ బంధనాలనుంచి విముక్తి చేసింది.

జాతీయోద్యమం బలంగా వేళ్లూను కున్న ప్రాంతాల్లో మాత్రమే కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంటుందని, అందుకు కారణం ఉద్యమంలో పాల్గొన్న అనుభవం వలన వాళ్లు కేవలం విడివిడి వృక్షాలను కాక, మొత్తం అరణ్యాన్ని చూడగలరన్నది ఆయన విశ్వాసం. ఆంధ్రమహాసభ కార్యకలాపాల్లో క్రియా శీలంగా పాలుపంచుకొన్న అనుభవంతో రాటుదేలడం వల్లే తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు గణనీయమైన విజయాలను కైవసం చేసుకోవడం సాధ్యమైందని ఆయన తరచు అంటుండేవారు. 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరులో జరిగిన ఎనిమిదవ నిజామాంధ్ర మహాసభకు, 1944లో భువనగిరిలో జరిగిన మహాసభకు ఆయనే అధ్యక్షత వహించారు. భువనగిరి సమావేశాల్లోనే ఆంధ్రమహాసభ అతివాద, మితవాద శిబిరాలుగా చీలిపోయింది.

దేశ స్వాతంత్య్రానికి ముందు సాగిన సాయుధ పోరాటాన్ని వ్యూహాత్మకంగా సమర్థించిన రావి నారాయణరెడ్డి 1947 తరువాతి కాలంలో పోరాటాన్ని కొనసాగించాలనే ‘మెజారిటీ’ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను, సమ సమాజ ఆకాంక్షలతో కలగాపులగం చేయడం వల్లే 1948 ఫిబ్రవరిలో పార్టీ పోరాటం కొనసాగించాలనే తప్పుడు నిర్ణయం తీసుకుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. చరిత్ర ఆయన మార్గమే సరైనదని తీర్పు చెప్పడం విశేషం. కాళోజీ నారాయణరావు ప్రవచించిన ‘వేరు తెలంగాణ’ను తాత్వికంగా వ్యతిరేకించడంతో ఆగక తాను ఎన్నటికీ ‘వీరతెలంగాణ’ వాదిగానే ఉంటానని చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ రావి నారాయణరెడ్డి.

రావి నారాయణరెడ్డిరావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. 1908 జూన్ 4న జన్మించాడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పని చేశారు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐలో చాలాకాలం పని చేశారు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించారు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకానికి, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసినారు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది.

Body:
Post date: Thu, 09/13/2012 - 22:42
Path: /node/886
విభాగము:
వివరణ:

Damodaram Sanjivayyaదామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. పారిశ్రామికాభివృద్దికి ప్రభుత్వంలో తెలుగు భాష వాడుక అధికం చేయడం, భూసంస్కరణల అమలు ఇలా ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు ఆయన హయాంలో చేపట్టారు.

బాల్యము మరియు విద్యాభ్యాసము :

సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా, కల్లూరు మండలములో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబములో చివరివాడు సంజీవయ్య. ఆయన కుటుంబానికి సొంత భూమి లేకపోవడము వలన నేత పనిచేసి, కూలి చేసి జీవనము సాగించేవారు. సంజీవయ్య పుట్టిన మూడు రోజులకు తండ్రి మునెయ్య చనిపోగా కుటుంబము మేనమామతో పాలకుర్తికి తరలివెళ్లినది. అక్కడ సంజీవయ్య పశువులను కాసేవాడు. మూడు సంవత్సరాల తరువాత తిరిగి పెద్దపాడు చేరుకున్నారు. సంజీవయ్య అన్న చిన్నయ్య కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించి సంజీవయ్యను బడికి పంపించాడు. పెద్దపాడులో 4వ తరగతి వరకు చదివి ఆ తరువాత కర్నూలులోని అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ పాఠశాలలో చేరాడు. 1935 లో కర్నూలు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చేరి 1938 లో SSLC (ఎస్.ఎస్.ఎల్.సీ) జిల్లాలోనే ప్రధమునిగా ఉత్తీర్ణుడయ్యాడు.

ఉద్యోగాలు :

ఆ తరువాత చిన్నయ్య ఆర్ధిక సహాయముతో అనంతపురం ప్రభుత్వ సీడెడ్ జిల్లాల కళాశాల లో గణితము మరియు ఖగోళ శాస్త్రములు అధ్యయనము చేశాడు. 1942లో బీ.ఏ పూర్తి చేసిన తర్వాత జీవనోపాధి కొరకు అనేక చిన్నా చితక ఉద్యోగాలు చేశాడు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధము వలన ఉద్యోగాలు దొరకడము చాలా కష్టముగా ఉన్నది. సంజీవయ్య కర్నూలు పట్టణ రేషనింగ్ ఆఫీసులో గుమస్తాగా 48.80 రూపాయల జీతముతో ఉద్యోగములో చేరాడు. 1944 లో కొంతకాలము మద్రాసు కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) కార్యాలయములో సహాయకునిగా పనిచేశాడు. 1945 జనవరిలో కేంద్ర ప్రజాపనుల శాఖా తనిఖీ అధికారిగా బళ్లారిలో పనిచేశాడు. ఈ గజెటెడ్ హోదా కల ఉద్యోగము డిసెంబర్ 1945 లో రద్దయ్యేదాకా 11 నెలల పాటూ పనిచేశాడు. ఆ తరువాత కొంత సమయము మద్రాసులోని పచ్చయప్ప పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేసాడు.

సంజీవయ్య 1946 లో అప్పటి బళ్లారి జిల్లా జడ్జి కే.ఆర్.కృష్ణయ్య చెట్టి ప్రోత్సాహముతో మద్రాసు లా కాలేజీలో 'ఎఫ్.ఎల్' (F.L) లో చేరాడు. అప్పట్లో కాలేజిలో స్కాలర్‌షిప్ప్లు ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. అందువలన సంజీవయ్య మద్రాసు జార్జ్‌టౌన్ లోని ప్రోగ్రెస్సివ్ యూనియన్ హైస్కూల్ లో పార్ట్ టైం గణిత అధ్యాపకునిగా పనిచేశాడు. అక్కడ ఇచ్చే 90 రూపాయల జీతముతో హాస్టలు ఖర్చులు భరించేవాడు.

లా చదువుతున్నపుడు సంజీవయ్యకు రోమన్ న్యాయానికి సంభందించిన లాటిన్ పదాలు గుర్తుపెట్టుకోవడము కష్టమయ్యేది. లాలో ఆయనకు సహాధ్యాయి అయిన ప్రముఖ రచయిత రావిశాస్త్రి వాటిని తెలుగు పాటగా మలిచి పాడుకుంటే బాగా గుర్తుంటాయని సలహా ఇచ్చాడు. లా చదివే రోజుల్లో సంజీవయ్య చంద్రగుప్త అనే నాటకములో పాత్ర ధరించాడు. శివాజీ అనే ఇంకొక నాటకాన్ని తనే రచించి రంగస్థలము మీద ప్రదర్శించాడు. ఈయన గయోపాఖ్యానము గద్యముగా రచించాడు అయితే ఇందులో ఏ ఒక్కటి ప్రస్తుతము లభ్యము అవుటలేదు. లా పట్ట చేతపుచ్చుకొని సంజీవయ్య 1950 అక్టోబర్ లో మద్రాసు బార్ లో న్యాయవాదిగా నమోదు చేసుకొన్నాడు. ఈయన గణపతి వద్ద ఆ తరువాత జాస్తి సీతామహాలక్ష్మమ్మ వద్ద సహాయకునిగా పనిచేశాడు

రాజకీయ రంగప్రవేశము :

సంజీవయ్యకు విద్యార్ధిగా ఉన్న రోజుల్లో రాజకీయాలపై, స్వాతంత్ర్యోద్యమముపై ఏమాత్రము ఆసక్తి చూపలేదు. కానీ లా అప్రెంటిసు చేస్తున్న సమయములో వివిధ రాజకీయనాయకుల పరిచయము మరియు సాంగత్యము వలన రాజకీయాలలో ప్రవేశించాలనే ఆసక్తి కలిగినది.

1950 జనవరి 26న రాజ్యాంగము అమలులోకి రావడముతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్ పార్లమెంట్ గా అవతరించినది. అయితే ప్రొవిజనల్ పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభలలో రెండిట్లో సభ్యత్వము ఉన్న సభ్యులు ఏదొ ఒకే సభ్యత్వముని ఎన్నుకోవలసి వచ్చినది. షెడ్యూల్డ్ కులమునకు చెందిన ఎస్.నాగప్ప అలా తన శాసనసభ సభ్యత్వము అట్టిపెట్టుకొని ప్రొవిజనల్ పార్లమెంటుకు రాజీనామా చేయడముతో ఆ స్థానమును పూరించడానికి బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రేసు కమిటీ తరఫున సంజీవయ్యను ఎంపిక చేశాడు. ఎన్నికలు జరిగి తొలి విధానసభ ప్రమాణస్వీకారము చేయడముతో 1952 మే 13 న ప్రొవిజనల్ పార్లమెంటు రద్దయినది.

టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గములో ఆరోగ్యశాఖా మంత్రిగా ఉండగానే సికింద్రాబాదులో పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కృష్ణవేణి ని సంజీవయ్య 1954, మే 7 న పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానము లేదు. సుజాత అను ఒక బాలికను దత్తత తీసుకున్నారు.

1967లో ఎన్నికల ప్రచార సమయములో విజయవాడ నుండి హైదరాబాదుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా ఎన్నటికి కోలుకోలేకపోయాడు. 1972 మే 7 వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతములో ఢిల్లీలో గుండెపోటుతో మరణించాడు. ఆయన అంత్యక్రియలు మే 9వ తేదీన సికింద్రాబాదులోని పాటిగడ్డలో అధికార లాంఛనాలతో జరిగినవి. ఆయన స్మారకార్ధం పాటిగడ్డ సమీపమున ఒక ఉద్యానవనమును పెంచి ఆయన పేరుమీదుగా సంజీవయ్య పార్కు అని పేరు పెట్టారు.

నిర్వహించిన పదవులు :

  • 1950 - 1952 ప్రొవిజనల్ పార్లమెంటు సభ్యుడు
  • 1952 ఏప్రిల్ 20 - 1953 అక్టోబర్ 1 రాజాజీ మంత్రివర్గములో మద్రాసు రాష్ట్ర మున్సిపల్ మరియు సహకార శాఖా మంత్రి
  • 1953 అక్టోబర్ 1 - 1954 నవంబర్ 15 ప్రకాశం మంత్రివర్గములో ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య, హరిజనోద్ధరణ మరియు పునరావాస శాఖా మంత్రి
  • 1955 మార్చి 28 - 1956 నవంబర్ 1 బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గములో ఆంధ్ర రాష్ట్ర రవాణా మరియు వాణిజ్య పన్నుల శాఖా మంత్రి
  • 1956 నవంబర్ 1 - 1960 జనవరి 10 నీలం సంజీవరెడ్డి మంత్రివర్గములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రమ మరియు స్థానిక స్వయంపరిపాలనా శాఖా మంత్రి
  • 1960 జనవరి 11 - 1962 మార్చి 29 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
  • 1962 జూన్ - 1964 జనవరి 6 అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు.
  • 1964 జనవరి 24 - 1964 జూన్ 9 నెహ్రూ ప్రభుత్వములో కేంద్ర శ్రమ మరియు ఉద్యోగ శాఖామంత్రి
  • 1964 జూన్ 9 - 1966 జనవరి 23 లాల్ బహుదూర్ శాస్త్రి ప్రభుత్వములో కేంద్ర శ్రమ మరియు ఉద్యోగ శాఖామంత్రి
  • 1966 జనవరి 24 - 1967 మార్చి 12 ఇందిరా గాంధీ ప్రభుత్వములో కేంద్ర పరిశ్రమల శాఖామంత్రి
  • 1970 ఫిబ్రవరి 18 - 1971 మార్చి 18 ఇందిరా గాంధీ ప్రభుత్వములో కేంద్ర శ్రమ మరియు పునరావాస శాఖామంత్రి
  • 1971 మార్చి 18 - 1972 మే 7 అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు.

Damodaram Sanjivayyaదామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. పారిశ్రామికాభివృద్దికి ప్రభుత్వంలో తెలుగు భాష వాడుక అధికం చేయడం, భూసంస్కరణల అమలు ఇలా ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు ఆయన హయాంలో చేపట్టారు.

బాల్యము మరియు విద్యాభ్యాసము :

Body:
Post date: Thu, 09/13/2012 - 22:29
Path: /node/885
విభాగము:
వివరణ:

కొండా వెంకటప్పయ్యకొండా వెంకటప్పయ్య ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. ఆయన గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందినవాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్ కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు.  కృష్ణా పత్రికను స్టాపించి అక్షర శస్త్రాన్ని ఆంగ్లేయులపై సందించిన అక్షర సేనాని.

తొలి జీవితం :

1866 సంవత్సరంలో ఫిబ్రవరి 22వ తేదీన పాత గుంటూరు లో కొండా వెంకటప్పయ్య జన్మించాడు. ప్రాధమిక విద్య గుంటూరు మిషన్ స్కూలులో, ఉన్నత విద్య మద్రాసు క్రైస్తవ కళాశాలలో పూర్తిచేసి తరువాత బి.ఎల్. పట్టాపొంది బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. వెంకటప్పయ్యకు మొదటి నుండి పౌరవ్యవహారలలో ఎక్కువ ఆసక్తి వుండటం వలన, అదే పనులు చేయడానికి ఎక్కువ ఉత్సాహపడేవాడు. దేశభక్తి, ప్రజాసేవాతత్పరత కలిగిన వెంకటప్పయ్య చదువుకునే రోజుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పగా వచ్చే ఏడురూపాయిలు తన తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవాడు.

కృష్ణా పత్రిక :

ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో, జాతిని చైతన్యవంతం చేయడానికి అనేక రంగాలలో కృషి జరుగుతున్న రోజులలో వెంకటప్పయ్య 1902లో వాసు నారాయణరావుతో కలసి కృష్ణా పత్రిక ప్రచురణను ప్రారంభించాడు. 1905 వరకు ఆయనే ఆ పత్రికను నడిపి, గుంటూరులో స్థిరపడగానే దాని సంపాదకత్వ బాధ్యతలను ముట్నూరు కృష్ణారావు కు అప్పగించాడు. న్యాయవాద వృత్తిలో వెంకటప్పయ్య కేవలం ధనార్జనే ప్రధాన వృత్తిగా పెట్టుకోలేదు. దాన, ధర్మాల కోసం సొంత ఆస్తినే అమ్ముకొనవలసి వచ్చింది. ఉన్నవ దంపతులు స్థాపించిన శారదా నికేతన్కిస వెంకటప్పయ్య తన ఆస్తి నుంచి కొంత భాగం అమ్మివేసి పది వేల రూపాయల విరాళం ప్రకటించాడు. 1910లో బందరులో జాతీయ కళాశాలకు ఆయన ప్రారంభోత్సవం జరిపాడు.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదన :

1912 మే నెలలో కృష్ణా గుంటూరు జిల్లాల రాజకీయ మహాసభ నిడదవోలులో జరిగింది. అప్పటికి పశ్చిమ గోదావరి జిల్లాలేదు. కొవ్వూరు నుంచి బెజవాడ వరకు కృష్ణా జిల్లాయే. ఆ సభలోనే కొండా వెంకటప్పయ్య సలహాపై ఉన్నవ లక్ష్మీనారాయణ మొదలగు గుంటూరు యువకులు పదకొండు తెలుగు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే విషయంలో మంతనాలు జరిపారు. 1913లో గుంటూరు జిల్లా రాజకీయ మహాసభ బాపట్లలో జరిగింది. అదే ప్రదేశంలో కొండా వెంకటప్పయ్య సలహా మేరకు ప్రధమాంధ్ర మహాసభ బి.ఎస్.శర్మ అధ్యక్షతన జరిగింది. దేశవ్యాప్త ప్రచారం కోసం ఏర్పడిన రాయబార వర్గంలో కొండా వెంకటప్పయ్యదే ప్రధాన పాత్ర. నెల్లూరు లో జరిగిన ఆంధ్ర మహాసభకు అతనే అధ్యక్షుడిగా ఎన్నికై ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఒక నిర్దిష్ట కార్యక్రం రూపొందించాడు. 1917లో రాజ్యాంగ సంస్కరణల విషయమై పరిశీలనలు జరపడానికి మాంటేగ్ - చమ్స్ఫపర్డ్ ప్రతినిధి వర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ ప్రతినిధివర్గం మద్రాసు కు వచ్చినప్పుడు భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాల విభజన అవసరాన్ని ఉగ్గడించిన ఆంధ్ర ప్రతినిధులలో కొండా వెంకటప్పయ్య ముఖ్యుడు.

1918లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఏర్పడింది. రాష్ట్ర సాధనలో ఇది తొలివిజయం. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీకి తొలి కార్యదర్శి వెంకటప్పయ్యే. ఆ రోజుల్లో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు కలసి ఒకే నియోజక వర్గంగా ఉండేది. ఓటర్లు అంతా కలిపితే 500 మంది మాత్రమే. ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసి కొండా వెంకటప్పయ్య మద్రాసు కౌన్సిలుకు ఎన్నికయ్యాడు. సహాయక నిరాకరణోద్యమం కొనసాగించడానికి వీలుగా కాంగ్రెసు పార్టీ తన సభ్యుల రాజీనామా కోరగానే కొండా వెంకటప్పయ్య అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆ తరువాత ఆయన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడై అభిలభారత కాంగ్రెస్ సభ్యుడయ్యాడు.

1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు బెజవాడలో జరిగాయి. మహాత్ముని ఆంధ్ర పర్యటన వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. వేలాది రూపాయల విరాళాలుగా స్వీకరించి స్వరాజ్యనిధికి సమర్పించాడు. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యంలో పాల్గొన్నందుకు ఆయన మొదటిసారి శిక్ష అనుభవించాడు.

అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా :

1923 లో కాకినాడ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు చారిత్రాత్మకమైనవి. సహాయనిరాకరణ శాసనోల్లంఘనల అనంతరం శాసన సభా ప్రవేశ వాదులకు, బహిష్కరణ వాదుల మధ్య తీవ్ర చర్చలు జురుగుతున్న రోజులవి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన దేశబంధు చిత్తరంజన్ దాస్ ఈ విభేదాల మధ్య తన పదవికి రాజీనామా చేశాడు. మధ్యే మార్గంగా వెంకటప్పయ్యని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి అయ్యాడు. స్వల్పకాలమే అయినా అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయాన్ని బెజవాడకు తరలించారు. ఇది ఆంధ్ర రాజకీయ చరిత్రలో స్వర్ణ ఘట్టం. గాంధీజీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికి ఆంధ్రలో కొండా వెంకటప్పయ్యే ఆ రోజుల్లో నాయకత్వం వహించేవాడు. ఆంధ్ర ఖద్దరుకి యావద్దేశ ప్రచారం లభించడానికి కొండా వెంకటప్పయ్య కృషి ప్రాధనమైనది.

1933లో మహాత్ముడు ఆంధ్రలో హరిజన యాత్ర సాగించాడు. అనేక గ్రామాలలో హరిజనులచేత దేవాలయ ప్రవేశం చేయించాడు. ఆంధ్రదేశంలో ౬౫వేల రూపాయలు హరిజన నిధి వసూలైంది. ఒక వంక భార్య మృత్యుశయ్యపై ఉన్నప్పటికీ కొండా వెంకటప్పయ్య హరిజన సేవలో ఉన్నతులై తిరుగుతున్నాడని మహాత్మాగాంధీ అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడుగా :

1929లో సైమన్ కమీషన్ రాక సందర్భంలోనూ, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నందుకు కొండా వెంకటప్పయ్యకు జైలు శిక్షలు విధించారు. 1937లో జరిగిన ఎన్నికల్లో ఆయన మద్రాసు శాసన సభకు ఎన్నికయ్యాడు. భాషా ప్రాతిపదిక మీద మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుగా విభిజించాలని కొండా వెంకటప్పయ్య శాసన సభలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. 1920 నుంచి 1949లో కీర్తి శేషులయ్యే వరకు ఆంధ్రదేశమే తానుగా వ్యవహరించి ఆంధ్రల అభిమానానికి పాత్రుడైన మహానాయకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర రాజకీయాలలో ఆయన స్థానం దేశ రాజకీయలలో మదనమోహన మాలవ్యా స్థానం లాంటిది. కాంగ్రెస్ అగ్రనాయకులందరు దేశ భక్తను గౌరవించేవారు.

ఏమైనా యావద్భారత రాజకీయరంగంలో ఆంధ్రజాతి తన ప్రతిభకు, త్యాగాలకు సముచిత స్థానం పొందలేకపోయినట్లే, "దేశభక్త " కొండా వెంకటప్పయ్య అఖిల భారత రాజకీయలలో తన ప్రతిభకు, త్యాగానికి సముచిత స్థానం పొందలేకపోయాడు. 1938లో మద్రాసు రాష్ట్రంలో రాజాజీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర శాసన సభా కాంగ్రెస్ పక్షంలో ముగ్గురు కార్యదర్శులలో ఒకడిగా ఆయన్ను నియమించి ఆయన త్యాగలకు ఆ విధంగా విలువకట్టారు. ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు కూడా అధ్యక్షడిగా పని చేశాడు.

అఖిల భారత చరఖా సంఘానికి జీవిత కాలం సభ్యుడిగా వున్నాడు. గ్రంథాలయోద్యమానికి కూడా తోడ్పడ్డాడు.

రచనలు :

కొండ కడలూరు జైలులో వున్నప్పుడు "డచ్ రిపబ్లిక్" అనే గ్రంథాన్ని రచించాడు. తన స్వీయ చరిత్రను రెండు భాగాలుగా రాశాడు. "శ్రీ వేంకటేశ్వర సేవానంద లహరి" అన్న భక్తి రసభరితమైన శతకాన్ని రచించాడు. ఆయన ఇంగ్లీషులోనూ తెలుగులోనూ మంచి వక్త, కవి. మొదటి నుంచి నాటకాలంటే కొండా వెంకటప్పయ్యకు చాలా మక్కువ, స్త్రీ పాత్రను పోషించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు.

కళాదృష్టితో, కళాతృష్ణతో, మానవతవాదిగా, దేశభక్తుడుగా జీవితాంతం కృషి చేసిన నిరాడంబరమూర్తి కొండా వెంకటప్పయ్య 1949 ఆగష్టు 15 వ తేదీన దేశ స్వాతంత్ర్య పుణ్యదినాన దేశభక్తులైన వారందరినీ సంతాప సాగరంలో ముంచుతూ స్వర్గస్థులయ్యాడు.

స్వాతంత్రం తరువాత కాంగ్రెస్ గురించి :

కొండా వెంకటప్పయ్య ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. స్వాతంత్ర్యం తరువాత పెచ్చుపెరిగిన అవినీతి గురించి ఆయన మహాత్మా గాంధీకి ఇలా రాసాడు.

మనం మనస్ఫూర్తిగా కోరుకొన్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్ర్య యోధులలో నీతి నియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారి పోతున్నది. ప్రజలు కాంగ్రెస్‌ను దూషిస్తున్నారు. బ్రిటిష్ రాజ్యమే మేలంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో కాంగ్రెసు అవినీతికి ఆలవాలమైపోతున్నది. వారిని అదుపు చేయాల్సిన పోలీసు వ్యవస్థ కాంగ్రెసువారి కట్టడిలో ఉండిపోయింది. పైసా ఆదాయంలేనివారు ఇప్పుడు మహారాజులలాగా పెద్దపెద్ద కార్లలో తిరుగుతున్నారు. కాంగ్రెసు ఎమ్.ఎల్.ఏలూ, ఏమ్.ఎల్.సి లు తరచు జోక్యం చేసుకోవడం వలన జిల్లా కలెక్టరులూ, రెవిన్యూ అధికారులూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. ఈ పైరవీకారుల ప్రభావం దుష్ప్రచారం భయంతో నిజాయితీగల వారు తమ పదవులలో ఉండే పరిస్థితి లేదు.

ఇది స్వాతంత్రం వచ్చిన నాలుగు నెలలలో, 1947 డిసెంబరులో కొండా వెంకటప్పయ్య మహాత్మా గాంధీకి వ్రాసిన లేఖ

కొండా వెంకటప్పయ్యకొండా వెంకటప్పయ్య ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. ఆయన గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందినవాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్ కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు.  కృష్ణా పత్రికను స్టాపించి అక్షర శస్త్రాన్ని ఆంగ్లేయులపై సందించిన అక్షర సేనాని.

Body:
Post date: Sun, 09/09/2012 - 20:00
Path: /node/835
విభాగము:
వివరణ:

పనప్పాకం ఆనందాచార్యులుతొలితరం జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒకరు పనప్పాకం ఆనందాచార్యులు. అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు. బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సభకు హాజరైన 72 మంది ప్రతినిధుల్లో ఆనందాచార్యులు ఒకరు.  

పనప్పాకం ఆనందాచార్యులు, చిత్తూరు జిల్లాకు చెందిన కడమంచి గ్రామంలో 1843 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసాచార్యులు. వీరు చిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1865లో ఎఫ్.ఎ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1969 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు. 1870లో వకీలుగా అనుమతిని పొంది హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు. మద్రాసులో న్యాయవాదుల కోసం ఒక అసోసియేషన్ స్థాపన చేయడంతో పాటు , న్యాయ విచారణ పద్దతులు, న్యాయవాదుల స్థితిగతుల మెరుగుదల కోసం  చక్కని గ్రంధాలు శ్రీ అనంతాచార్యులు రచించారు. వీరు 1889లో మమద్రాస్ అడ్వకేట్స్ అసోసియేషన్ స్థాపించారు.
 

మొదట్లో ఆనందాచార్యులు జర్నలిజం, రాజకీయాల పట్ల ఆసక్తి చూపారు. ఆయన ‘నేటివ్ పబ్లిక్ ఒపీనియన్, మద్రాసి’ అనే మ్యాగజైన్లకు వ్యాసాలు రాసేవారు. ఆ తర్వాత హిందూ పత్రిక స్థాపనకు సహాయం చేసి, వ్యాసాలు రాశారు.  రాజకీయాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి అనేక రకాలుగా సేవలందించారు. 1884లో మద్రాసు మహాజన సభను స్థాపించారు. 1885లో అఖిలా భాత జాతీయ కాంగ్రెస్ మహాసభ బొంబైలో ఏర్పాటు చేసిన నాటి నుండే, దేశ స్వాతంత్ర్య సమర సంగ్రామంలో పాల్గొని గణనీయమైన సేవచేశారు. 1891 నాగపూర్ లో జరిగిన 7వ జాతీయ సభకు వీరు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి దక్షిణ భారతీయులు వీరు. వీరు కాంగ్రెసు కార్యనిర్వహక సంఘంలో సభ్యులుగాను, అలహాబాదు కాంగ్రెసు కార్యదర్శులలో ఒకరుగా ఎన్నికయ్యారు.

1896లో భారతీయ సామ్రాజ్య శాసనసభకు చెన్నై నుండి ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. ఆ సభలో నిర్భయంగా ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసి 1903లో రాజీనామా చేశారు. ఈయన ప్రతిభకు మెచ్చి 1887లో ఆనాటి ప్రభుత్వం రాజబహుదూర్ బిరుదు ప్రదనంతో సత్కరించారు. ఆంధ్ర భాషా సారస్వత పోషకుడిగా కీర్తి గడించడమే కాకుండా ‘పద్యావినోద’అనే బిరుదుతో ఆనాటి సాంస్కృతిక సమాజాలు సత్కరించి గౌరవించాయి. కడుపేదరికం నుండి తన మేధాసంపత్తితో కృషి, పట్టుదలతో అత్యంత ఉన్నత పదవులు అలంకరించిన ఆనందాచార్యులు 1907లో కీర్తిశేషులైనారు.

పనప్పాకం ఆనందాచార్యులుతొలితరం జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒకరు పనప్పాకం ఆనందాచార్యులు. అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు. బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సభకు హాజరైన 72 మంది ప్రతినిధుల్లో ఆనందాచార్యులు ఒకరు.  

పనప్పాకం ఆనందాచార్యులు, చిత్తూరు జిల్లాకు చెందిన కడమంచి గ్రామంలో 1843 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసాచార్యులు. వీరు చిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయంలో 1863లో మెట్రిక్యులేషన్, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1865లో ఎఫ్.ఎ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1969 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులై మద్రాసు హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు. 1870లో వకీలుగా అనుమతిని పొంది హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు. మద్రాసులో న్యాయవాదుల కోసం ఒక అసోసియేషన్ స్థాపన చేయడంతో పాటు , న్యాయ విచారణ పద్దతులు, న్యాయవాదుల స్థితిగతుల మెరుగుదల కోసం  చక్కని గ్రంధాలు శ్రీ అనంతాచార్యులు రచించారు. వీరు 1889లో మమద్రాస్ అడ్వకేట్స్ అసోసియేషన్ స్థాపించారు.
 

Body:
Post date: Sun, 09/09/2012 - 19:00
Path: /node/834
విభాగము:
వివరణ:

శ్యామశాస్త్రిశ్యామశాస్త్రి, కర్నాటక సంగీతంలో ప్రముఖ వాగ్గేయకార త్రయంలో త్యాగరాజు , ముత్తుస్వామి దీక్షితుల సరసన నిలిచే తెలుగు పెద్దలలో శ్యామశాస్త్రి ప్రముఖులు. శ్యామశాస్త్రి వయస్సులో వారిద్దరికన్నా పెద్దవాడు. శ్యామశాస్త్రి తండ్రి విశ్వనాథ శాస్త్రి. ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు సమీపంలోగల కంభం ప్రాంతీయులు. అయితే, 17వ శతాబ్దంలో తమిళనాడుకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. శ్యామశాస్త్రి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము. అయితే, చిన్నతనంలో ముద్దుపేరుగా శ్యామకృష్ణ గా పిలుస్తూ, ఆ పేరే చివరకు వ్యవహరికంలో సార్ధకమైందని ఆయన శిష్యులు పేర్కొంటారు.

 తండ్రి విశ్వనాధ శాస్త్రి సంస్కృత, తెలుగు భాషలలొ పండితుడు కావడంతో- శ్యామశాస్త్రి చిన్నతనంలో తండ్రి దగ్గరే సంస్కృతాంధ్రభాషలు అభ్యసించాడు. సంగీతంలో తన మేనమామ దగ్గర స్వరపరిచయం కల్గినా, ఆ పిదప తంజావూరులో ‘సంగీత స్వామి’ అనబడే ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసుని దగ్గర, తంజావూరులోని రాజాస్థానంలో సంగీత విద్వాంసుడైన శ్రీ పచ్చిమిరియము ఆది అప్పయ్య సహకారంతో సంగీత శాస్త్రాలలో మర్మములు ఎన్నో అధ్యయనం చేశాడు.

శ్యామశాస్త్రి రచించిన అనేక కీర్తనలు ఉల్లాసం కలిగించేవి, చక్కని లయ, తాళ ప్రదర్శనలకు అనుగుణంగా ఉండేవి. నాడోపాసన ద్వారా ఆత్మానందం సాధించవచ్చని ఆయన అభిప్రాయ పడేవారు. శ్యామశాస్త్రి తెలుగు, తమిళ, సంస్కృత భాషలలొ అనేక కృతులు, కీర్తనలు రచించినా అధికభాగం తెలుగులోనే వ్రాశారు. అయితే, త్యాగరాజు తన కీర్తననలో భావ రాగలకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా, శ్యామశాస్త్రి కీర్తనలలో క్లిష్టమైన ‘తాళ’ రచన చేసినట్లు సంగీతాభిమానులు అంటారు. శ్యామశాస్త్రి కీర్తనలలో క్లిష్టమైన రచనతోపాటు, ఆయనకు శిష్యులు అధిక సంఖ్యలో లేకపోవడం వల్ల కూడా, ఈయన కీర్తనలు అధిక ప్రాచుర్యం పొందలేదని వారు భావిస్తారు. శ్యామశాస్త్రి రచించిన “ప్రోవవమ్మ” , “మాంజిరాగం” అలాగే ‘కల్లడ ’(కలగడ ), ‘చింతామణి ’ రాగాలు, “హిమాద్రిసుతీ ” అనే కీర్తన, ఒకే స్వరంతో సంస్కృతం,తెలుగు భాషలలొ వేరు వేరుగా రాసిన ఆయన కీర్తనలు సంగీత కళాకారులందరికి సుపరిచతమే.

శ్యామశాస్త్రి ప్రసిద్ధి చెందిన ఆనంద భైరవీ, ధన్యాసి, కల్గడ, కళ్యాణి, కాంభోజి, కాపి, చింతామణి వంటి రాగాల్లో కృతులు స్వర పరిచాడు. సంగీత  పాఠాల్లో సరళీ స్వరాలు, జంట స్వరాలు, గీతాలు, స్వరజతులు, వర్ణాలు, కృతులు అనేవి ఒక పద్ధతిలో నేర్పుతారు. వీటిలో స్వరజతి రూపకర్త శ్యామశాస్త్రి. తోడి రాగంలో “రావే హిమగిరి కుమారి”, భైరవి రాగంలో ‘కామాక్షీ అనుదినము’వంటివి కొన్ని ప్రసిద్ధి జెందిన స్వరజతులు.

ఈ స్వరజతులే కాకుండా విలోమ చాపు తాళాన్ని కూడా శ్యామశాస్త్రి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు.  సాధారణంగా చాపు తాళం గతి 3 + 4 పద్ధతిలో ఉంటుంది. ఇలా కాకుండా 4 + 3 రీతిలో తాళ గతిని మార్చి కొన్ని  కీర్తనలు స్వరపరిచాడు. పూర్వి కళ్యాణి రాగంలో ‘నిన్ను వినగ మరి’, ఫరజ్ రాగంలో ‘త్రిలోకమాత నన్ను’  అనేవి ఈ విలోమ చాపు తాళంలో ప్రసిద్ది చెందిన కీర్తనలు.

శ్యామశాస్త్రి తపాలా బిల్లతంజావూరు జిల్లాలో తిరువాయూరులో ఉన్న కామాక్షి  దేవాలయ అర్చకత్వం చేసుకుంటూ, తన గాన కళా పాండిత్యంలో కామాక్షి అమ్మవారి సేవలో, ఆమె సన్నిధానంలోనే ‘ శ్యామకృష్ణ’ అనే ముద్రతో అనేక కీర్తనలు, కృతులు రచించాడయన.

శ్యామశాస్త్రి ఇంటి ఇలవేల్పుగా కామాక్షిదేవిని కీర్తిస్తూ, తమ ఇంటి ‘ఆడపడుచుగా’ అమ్మవారిని భావిస్తూ – అపూర్వం, అనన్య సామాన్య కృతులెన్నింటినో శ్యామశాస్త్రి రచించాడని ఆయన శిష్యులు – ప్రముఖ సంగీత కళారాధకులు పేర్కొంటారు. అందువల్లనే, శ్యామశాస్త్రి తన కీర్తనలలో కొన్నింటిని “శ్యామకృష్ణ  - సహోదరి”  అని పేర్కొన్నట్లు వారు అంటారు.

శ్యామశాస్త్రి కుమారుడు శ్రీ సుబ్బరాయశాస్త్రి కూడా ప్రముఖ వాగ్గేయకారిడిగా ప్రసిద్ది చెందాడు. శ్రీ అలసూరు కృష్ణయ్య , శ్రీ తలగంబాడి పంచనాదయ్య తదితరులు శ్యామశాస్త్రి శిష్యులలో ప్రముఖులు.

కొన్నిశ్యామశాస్త్రి కృతులు

నవరాత్రి దేవి కృతులు : కామాక్షీ నాతో వాదా దయ లేదా , శ్యామశాస్త్రి కృతి, బేగడ రాగం

పల్లవి
కామాక్షీ నాతో వాదా దయ లేదా
కమలాక్షీ నన్నొకని బ్రోచుట భారమా బంగారు (కామాక్షీ)

అనుపల్లవి
తామసము జేసితే నే తాళనమ్మా నీ
నామ పారాయణము విన వేడితినమ్మా మాయమ్మా (కామాక్షీ)

చరణం
శ్యామ కృష్ణ సోదరీ తల్లీ (అంబా) శుక
శ్యామళే నిన్నే కోరియున్నానమ్మా
మాయమ్మయని నే దలచి దలచి
మాటి మాటికి కన్నీరు విడువ లేదా అంబా
నీవు మాటాడకుండిన నే తాళ లేనమ్మా
నీ బిడ్డను లాలించవే దొడ్డ తల్లివే
కామాదుల చపల చిత్త పామరుడై
తిరిగి తిరిగి ఇలలో
కామిత కథలు విని విని
వేసారి నేను ఏమారి పోతునా (కామాక్షీ)

నవరాత్రి దేవి కృతులు : సరోజ దళ నేత్రి హిమ గిరి పుత్రీ , శ్యామశాస్త్రి కృతి, శంకరాభరణం రాగం

పల్లవి
సరోజ దళ నేత్రి హిమ గిరి పుత్రీ
నీ పదాంబుజములే
సదా నమ్మినానమ్మా శుభమిమ్మా
శ్రీ మీనాక్షమ్మా

అనుపల్లవి
పారాకు సేయక వర దాయకీ నీ
వలే దైవము లోకములో గలదా
పురాణీ శుక పాణీ మధుకర వేణీ
సదా-శివునికి రాణీ (సరోజ)

చరణం 1
కోరి వచ్చిన వారికెల్లను
కోర్కెలొసగే బిరుదు గదా అతి
భారమా నన్ను బ్రోవ తల్లి
కృపాలవాల తాళ జాలనే (సరోజ)

చరణం 2
ఇందు ముఖీ కరుణించుమని నిను
ఎంతో వేడుకొంటిని
నాయందు జాగేలనమ్మా మరియాద
గాదు దయావతి నీవు (సరోజ)

చరణం 3
సామ గాన వినోదినీ గుణ
ధామ శ్యామ కృష్ణ నుతా శుక
శ్యామళా దేవీ నీవే గతి రతి
కామ కామ్యద కావవే నన్ను (సరోజ)

హిమాచల తనయ బ్రోచుటకి - శ్యామశాస్త్రి , ఆనందభైరవి రాగం
 

హిమాచల తనయ బ్రోచుటకి
ది మంచి సమయము రావే అంబా ||

కుమార జనని సమానమెవరిల
ను మానవతి శ్రీ బ్రుహన్నాయకి ||

సరోజముఖి బిరాన నీవు
వరాలొసగుమని నేను వేడితి
పురారి హరి సురేంద్రనుత
పురాణి పరా ముఖ మేలనే తల్లి ||

ఉమా హంస గమా తామ
సమా బ్రోవ దిక్కెవరు నిక్కముగ
ను మాకిపుడభిమానము చూపు
భారమా వినుమా దయ తోను ||

సదా నత వర దాయకి ని
జ దాసుడను శ్యామక్రిష్ణ సోదరి
గదా మొర వినవా దురిత
విదారిణి శ్రీ బ్రుహన్నాయకి ||

కనకశైల విహారిణీ అంబ - శ్యామశాస్త్రి , పున్నాగవరాళి రాగం
 

పల్లవి:
కనకశైల విహారిణీ అంబ - కామకోటీ బాలే, సుశీలే
అనుపల్లవి:
వనజభవహరి నుతే దేవి - హిమగిరిజే లలితే సతతం
వినతం మాం పరిపాలయ శంకర - వనితే సతి మహాత్రిపుర సుందరి

చరణం:
1. చండ భండన ఖండన పండితేక్షు
ఖండ కోదండమండితపాణే
పుండరీక నయనార్చిత పద
పురవాసిని శివే హరవిలాసిని

2. కంబుకంఠి కంజసదృశ వదనే
కరిరాజ గమనే మణిసదనే
శంబరవిదారి తోషిణీ
శివ శంకరి సదా మధురభాషిణి

3. శ్యామలాంబికే భవాబ్ధితరణే
శ్యామకృష్ణ పరిపాలిని జననీ
కామితార్ధ ఫలదాయకి
కామాక్షి సకలలోక సాక్షి

నిన్నువినా మరిగలదా గతి లోకములో - శ్యామశాస్త్రి కృతి

రాగం : రీతిగౌళతాళం : త్రిపుట
పల్లవి :నిన్నువినా మరిగలదా గతి లోకములో నిరంజని
నిఖిలజనని మృదాని భవాని అంబ

అనుపల్లవి :
పన్నగభూషణుని రాణి పార్వతి జనని అంబపరాకు
సేయక రాదు విను శ్రీ బృహదంబ వినుము
చ1: పామరునమ్మా దయచేసి వరమీయమ్మా మాయమ్మా
పాపమెల్ల పరిహరిహంచి బిరాన బ్రోచుటకు
చ2: సారములేని భవ జలధి తగులు కోని చాల వేసారితిని నా విచారము దీర్చుటకు

చ3: నా మదిలో అంబ నీవే గతియని నమ్మితి శ్యామకృశ్ణనుతా భక్తపరిపాలనము సేయుటకు

శ్యామశాస్త్రిశ్యామశాస్త్రి, కర్నాటక సంగీతంలో ప్రముఖ వాగ్గేయకార త్రయంలో త్యాగరాజు , ముత్తుస్వామి దీక్షితుల సరసన నిలిచే తెలుగు పెద్దలలో శ్యామశాస్త్రి ప్రముఖులు. శ్యామశాస్త్రి వయస్సులో వారిద్దరికన్నా పెద్దవాడు. శ్యామశాస్త్రి తండ్రి విశ్వనాథ శాస్త్రి. ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు సమీపంలోగల కంభం ప్రాంతీయులు. అయితే, 17వ శతాబ్దంలో తమిళనాడుకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. శ్యామశాస్త్రి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము. అయితే, చిన్నతనంలో ముద్దుపేరుగా శ్యామకృష్ణ గా పిలుస్తూ, ఆ పేరే చివరకు వ్యవహరికంలో సార్ధకమైందని ఆయన శిష్యులు పేర్కొంటారు.

 తండ్రి విశ్వనాధ శాస్త్రి సంస్కృత, తెలుగు భాషలలొ పండితుడు కావడంతో- శ్యామశాస్త్రి చిన్నతనంలో తండ్రి దగ్గరే సంస్కృతాంధ్రభాషలు అభ్యసించాడు. సంగీతంలో తన మేనమామ దగ్గర స్వరపరిచయం కల్గినా, ఆ పిదప తంజావూరులో ‘సంగీత స్వామి’ అనబడే ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసుని దగ్గర, తంజావూరులోని రాజాస్థానంలో సంగీత విద్వాంసుడైన శ్రీ పచ్చిమిరియము ఆది అప్పయ్య సహకారంతో సంగీత శాస్త్రాలలో మర్మములు ఎన్నో అధ్యయనం చేశాడు.

Body:
Post date: Sun, 09/09/2012 - 17:17
Path: /node/833
విభాగము:
వివరణ:

అన్నమాచార్యశ్రీ తాళ్ళపాక అన్నమాచార్య, కడప జిల్లాలోని  తాళ్ల్లఫాక గ్రామంలో మే 9, 1408 లో జన్మించాడు. పుట్టినప్పటినుండి, "తిరుమలప్పప్రసాదం" అని చెప్పందే ఉగ్గుకూడా త్రాగేవాడు కాదని ప్రతీతి. జోలపాటలలో వెంకటేశ్వరస్వామిపై పాడుతుంతేనే నిదురించెవాడట. చిన్ననాటినుండి ఆడిన మాటలెల్ల అమృత కావ్యంగా , పాడినపాటలెల్ల పరమగానాం "అన్నమయ్య కవితలు అల్లేవాడు. అన్నమయ్యకు 16వ ఏటనే  తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్లు చెప్తారు. స్వామి ఆదేశంతో ఏన్నోకీర్తనలు రచించాడు. అన్నమయ్య సనాతన వేదాలలోని జ్ఞానాన్ని సంకీర్తనల రూపంలో గానం చెసిన పద కవితా పితామహుడు. సుమారు 32 వేలకు పైగా సంకీర్తనలు తెలుగులో స్వయంగా రాసి గానం చెసిన ప్రప్రథమ సంకీర్తనాచార్యుదు అన్నమయ్య.   

సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు.

అన్నమయ్య కీర్తనలు, రచనలు

అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు.

అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు.

సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంధం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంధాలు లభించలేదు.

భగవంతుడ్ని ద్యానించే విషయంలో, మానవాళిని ప్రేమించడం గురించి తెలియజేస్తూ మానవతా విలువలతో జీవితాన్ని ఎలా సంతోషంగా ఉంచుకొవచ్చో అన్నమయ్య తన కీర్తనల ద్వారా తెలియబరిచాడు. పండితుడికి,పామరుడికి సమంగా అర్దమయ్యె రీతిలో సంస్కృతం, తెలుగు, జానపదాలలో ఆద్యాత్మిక, శృంగార  సంకీర్తనలు రాశారు.

మానవులందరూ ఒక్కటే అని చాటి చెప్పుతూ "బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే" అనిగానం చేశాడాయన.

"చక్రవర్తి అయినా - నిరుపేదైనా, నిద్రలో పొందే సుఖం ఒక్కటే అని, బ్రహ్మణుడైనా, దళితుడైనా మట్టిలో కలిసేది ఒక్కచొటేనని - అన్నమయ్య అంటాడు.  అలాంటప్పుడు ఏందుకీ వివక్షత? ఏందుకీ తారతమ్యాలు? అని ఆయన ప్రశ్నిస్తాడు. నైతిక విలువలు పాటిస్తే, ఎటువంటి కష్టాలు రావని అన్నమయ్య సుమారు ఐదు శతబ్దాల క్రితమే తెలియజేసాడు.

 "ఏమికలదిందు ఎంతకాలంబైన" అంటూ,

ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీలేదని, ఈ నిజాన్నీ తెలుసుకుంటే నీకు సంతోషం కల్గిస్తుందన్న ప్రతి విషయం ఎంత భయంకరమైందో గుర్తించగల్గుతారని ఆయన అంటాడు. జీవితం క్షణికమైందని, ఒక ఆకులాగా, పండి రాలిపోతుందని అన్నమయ్య ప్రభోదిస్తాడు. ఇంతటి దానికి ఈ స్వార్దపూరిత చింతన ఎందుకని ప్రశ్నిస్తూ, దైవచింతనలో కాలంగడపమని సందేశమిస్తాడాయన. భగవంతుడు ఒక్కడే శాశ్వత నిజం అని ఆయన అంటాడు. అలాగే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వాలని ఒంటరిగా పనిలేనివాడు సాదించేది ఏమి ఉండదని సంభొదిస్తాడాయన. ప్రస్తుత పరిస్తితిలో అన్నమయ్య పదవికవితలు ఎంతో అవసరం. తన రచనలు, సంకీర్తనలను ఆనాటి రాజుల కోరిక మేరకు, వారిపై సంకీర్తనలు రాయడానికి అంగీకరించలేదు. తన సంకీర్తనలను తిరుమల ఏడుకొండల వెంకటేశ్వరస్వామికే అన్నమయ్య అంకితమిఛ్చాడు. నారసింహుడి మీద,రాముడి మీద కూడా కొన్ని కీర్తనలు రాశాడు.                                                 

అన్నమయ్య కీర్తనలలో తాత్విక సత్యాలు, సాంఘీక విమర్శలు, నీతి నియమాలు, లాలిపాటలు, బలక్రుశ్నలీలలు ఉన్నాయి. ఇలా అనేక గీతాలను ఆయన రచించాడు. ప్రముక కవి పండితులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు "ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే" అన్నారు.

అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.

ఉదాహరణలు

అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము॥

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥

చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మ మయము॥

కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూప మదివో
పావనముల కెల్ల పావన మయము॥
 

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ||

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||

మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ||

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||

కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ||

కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||
 

కులుకక నడవరో కొమ్మలాలా (రాగం - దేసాళం)

కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మీద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు

చల్లెడి గందవొడి మై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు

జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం

చరణ కిసలయములకు సకియ రంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
 

జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద

నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ

పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే

గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీ శాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి

రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను
మాపుగానే వచ్చి మా మానములను
నీపాపడే చెఱిచె నేమందుమమ్మ

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి

అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార

గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి

అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి

హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల
 

చెల్లఁబో తియ్యనినోరఁ జేఁ దేఁటికి యీ-
పల్లదపుఁగోరికలపాలు సేయవలెనా

ఆసలకు నాదేహ మమ్ముకొంటి వింటింట
దాసునిఁగా నపలిదైవమా నీవు
పోసరించి భూమిలోనఁ బుట్టించి రక్షించి
యీసులేక భంగేట్టు టిది గొంత వలెనా

పామరపుటింద్రియాలబారిఁ దోసితివి నన్ను
దామెనకట్టుగాఁ గట్టి తత్వమా నీవు
దోమటి నామతిలోనఁ దోడునీడవై యుండి
పామేటిసుఖములనే భ్రమయించవలెనా

గక్కన నింతట నన్నుఁ గరుణించితివి నేఁడు
మొక్కితి శ్రీవేంకటాద్రిమూలమా నీకు
దిక్కుదెసవై నాకు దేవుండవై యేలికవు
చొక్కి నామన సింత సోదించవలెనా

 కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.

అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం.  అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట. 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి. 15వ శతాబ్ది ప్రజాజీవితం, తెలుగు భాషా విశేషాలకు అన్నమయ్య సాహిత్యం ప్రతిబింభంగా నిలిచింది.                     

అన్నమయ్య సంకీర్తనలు పాడి, ప్రచారం చేయడానికి కర్ణాటక, తమిళ సంగీత విద్వాంసులు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానము  ఆద్వర్యంలో 'అన్నమాచార్య ప్రాజెక్టు' అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి ఎంతో కృషి చెస్తొంది. ప్రత్యేక కార్యక్రమాలు ప్రతీ ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య వర్దంతిని ఘనంగా జరుపుతున్నారు. విశ్వవిద్యాలయ స్థాయిలో ఎం.ఎ విద్యార్థులకు అన్నమయ్య సంకీర్తనలను ప్రత్యేక పాఠ్యాంశాలుగా, అలాగే పరిశోదన (రీసేర్చి) కోసం కూడా అవకాశం కల్పించారు. అన్నమయ్య సంకీర్తనల్లోని మంచి భావాలను - ఆలొచనలను ప్రజలందరికీ పంచిపెట్టాల్సిన భాద్యత పండితుల-గాయకుల భుజస్కందాలపై ఉంది.

అన్నమాచార్యశ్రీ తాళ్ళపాక అన్నమాచార్య, కడప జిల్లాలోని  తాళ్ల్లఫాక గ్రామంలో మే 9, 1408 లో జన్మించాడు. పుట్టినప్పటినుండి, "తిరుమలప్పప్రసాదం" అని చెప్పందే ఉగ్గుకూడా త్రాగేవాడు కాదని ప్రతీతి. జోలపాటలలో వెంకటేశ్వరస్వామిపై పాడుతుంతేనే నిదురించెవాడట. చిన్ననాటినుండి ఆడిన మాటలెల్ల అమృత కావ్యంగా , పాడినపాటలెల్ల పరమగానాం "అన్నమయ్య కవితలు అల్లేవాడు. అన్నమయ్యకు 16వ ఏటనే  తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్లు చెప్తారు. స్వామి ఆదేశంతో ఏన్నోకీర్తనలు రచించాడు. అన్నమయ్య సనాతన వేదాలలోని జ్ఞానాన్ని సంకీర్తనల రూపంలో గానం చెసిన పద కవితా పితామహుడు. సుమారు 32 వేలకు పైగా సంకీర్తనలు తెలుగులో స్వయంగా రాసి గానం చెసిన ప్రప్రథమ సంకీర్తనాచార్యుదు అన్నమయ్య.   

Body:
Post date: Sun, 09/09/2012 - 12:02
Path: /node/832
విభాగము:
వివరణ:

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి, నేటి వైభవానికి కారణబూతమైనవాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.

దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్.

జీవిత విశేషాలు

సి.పి.బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగష్టు 4 న మద్రాసు లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాధమిక జ్ఞానాన్ని సంపాదించాడు.

1820 ఆగష్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826 లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు కడపలోను, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారి సమాదిమచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్ లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ స్మశానంలో సమాధి చేశారు.

తాతాచారి

బ్రౌన్ కొలువులో తొలి తెలుగు కథకుడు నేలటూరు వేంకటాచలం వురఫ్ తాతాచారి .తాతాచారి చెప్పిన కథలను విన్న సి.పి.బ్రౌన్ అందులోంచి 24 కథలను, దానితోపాటు శ్రీకృష్ణమాచారి చెప్పిన రెండు కథలను కలిపి 1855లో పుస్తకంగా ముద్రించారు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదాన్ని 'పాపులర్ తెలుగు టేల్స్' అనే పేరుతో ప్రచురించారు. 1916లో 'తాతాచారి కథలు ' గిడుగు వేంకట అప్పారావు సంపాదకత్వంలో ద్వితీయ ముద్రణ పొందాయి.1951లో వావిళ్ల వారి తృతీయ ముద్రణ, 1974లో బంగోరె సంపాదకుడిగా చతుర్థ ముద్రణ పొందాయి.నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా గునుపాడు గ్రామవాసి.తిరుపతి బాలబాలికలకు వీధి బడుల్లో చదువు చెబుతూ జీవితం సాగించారు.1848లో చెన్నపట్నం వెళ్లి బ్రౌను కొలువులో ఏడేళ్లు తాను బ్రతికి వుండిన పరియంతరమున్నాడు. పల్నాటి వీర చరితం , వసు చరిత్ర మొదలైన గ్రంథా ల పరిష్కార కృషిలో ఆయనకు సాయపడ్డారు.తాతాచార్యులు కావ్య తర్క వ్యాకరణముల యందు ప్రవీణత గలవాడు.తాతాచారి కథలు నీతి బోధకాలే కాక, ఆనాటి సామాజిక స్థితికి దర్పణంగాను ఉన్నవి. అందులోని శైలి శుద్ధ వ్యావహారికమైనందు వల్ల పండిత శైలికి దూరంగా ఉందనే బ్రౌన్ ప్రశంసకు యోగ్యమైంది.తాతాచారి కథల్లో- గ్రామశక్తికి పొంగలి పెట్టిన కథ, దేవరమాకుల కథ, వెట్టి వాండ్ల పట్టీ కథ, వాలాజీపేట రాయాజీ మసీదు కథ, హాలింఖాన్ మోసపోయిన కథ, మనిషి సద్గతి దుర్గతి తెలిపే కథ, పొగచుట్ట కథ- లాంటివి ఉన్నాయి.-- ఈతకోట సుబ్బారావు.

తెలుగు భాషకు చేసిన సేవ

  • వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు.
  • 1841లో "నలచరిత్ర"ను ప్రచురించాడు.
  • "ఆంధ్రమహాభారతము", "శ్రీమద్భాగవతము" లను ప్రచురించాడు.
  • తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు. 1840లో వ్యాకరణాన్ని ప్రచురించాడు.
  • లండన్‌లోని "ఇండియాహౌస్ లైబ్రరీ"లో పడి ఉన్న 2106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు.
  • బ్రౌన్ వ్యాయ ప్రయాసలకోర్చి సేకరించిన తెలుగు, సంస్కృత గ్రంధాలు అసంక్యాఖం. మనుచరిత్ర, రాఘవపాండవీయం, రంగనాధ రామాయణం, పండితారాధ్య చరిత్ర, దశావతార చరిత్ర మొదలైన కావ్యాలు, ప్రబంధాలు బ్రౌన్ కృషి వల్లనే తెలుగు వారికి అందుబాటులోకి వచ్చాయి.
  • "హరిశ్చంద్రుని కష్టాలు" గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు.
  • 1844లో "వసుచరిత్"', 1851లో "మనుచరిత్ర" ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు.
  • 1852లో "పలనాటి వీరచరిత్ర" ప్రచురించాడు.
  • చిత్తు కాగితాలు గా ఉపయోగిస్తున్నవేమన ప్రతులను చూసి బాధపడి,  ఆ గ్రంధాన్ని పునర్ముద్రించాడు.
  • కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు.
  • ఈ నాటికీ ప్రామాణికంగా ఉన్న బ్రౌన్ “ఇంగ్లిష్ – తెలుగు”, “తెలుగు-ఇంగ్లిష్” dictionary ని ఆయన 1852, 1853 లో సమకూర్చాడు.

రచనలు

  • ఆంధ్ర గీర్వాణ చందము కాలేజి ప్రెస్సు, మద్రాసు -1827.
  • లోకం చేత వ్రాయబడిన శుభ వర్తమానము, బైబిల్ కధల తెలుగు అనువాదం
  • రాజుల యుద్దములు, అనంతపురం ప్రాంత చరిత్ర.
  • తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులను రాసి, 1852, 1854లో ప్రచురించాడు.
  • తెలుగు వ్యాకరణము - 1840లో ప్రచురణ
  • వేమన పద్యాలకు ఆంగ్ల అనువాదం

ఇతరుల ప్రశంసలు

  • నాటి పండితుడు, అద్వైతబ్రహ్మ శాస్త్రి: "సరస్వతికి ప్రస్తుతమందు తమరు ఒకరే నివాస స్థానంగా కనపడుతున్నారు. ఎక్కడ ఏ యే విద్యలు దాచబడి ఉన్నవో అవి అన్నీ తమంతట తామే తమ సన్నిధికి వస్తూ ఉన్నవి... తమరు పుచ్చుకున్న ప్రయాసల వల్ల తేలిన పరిష్కార గ్రంథములు ఆకల్పాంతమున్నూ తమయొక్క కీర్తిని విస్తరిస్తూ ఉంటవి"
  • ప్రముఖ పరిశోధకుడు బంగోరె (బండి గోపాల రెడ్డి): "నిలువ నీడ లేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరచి, ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువ లాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్"
  • బంగోరె: "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు"
  • "సి.పి.బ్రౌను అను నాతడు ఆంద్రభాషామతల్లి సేవకే జన్మమెత్తినట్లు కానవచ్చుచున్నది. ఇతడు ఆంద్ర వాజ్మయాభివ్రుద్దికి చేసినంతటి పని ఇటీవలి వారెవ్వరూ చేయలేదని చెప్పిన అతిశయోక్తి కానేరదు" - కొమర్రాజు లక్ష్మణరావు
  • "ఆంద్రభాషోద్దారకులలో కలకాలము స్మరింపదగిన మహనీయుడు, మహావిద్వాంసుడు సి.పి.బ్రౌను" – వేటూరి ప్రభాకరశాస్త్రి

స్మృతి చిహ్నం

    బ్రౌను స్మృతి చిహ్నంగా, కడపలో ఆయన నివసించిన బంగళా స్థలంలో ప్రభుత్వము, ప్రజలు సంయుక్తంగా గ్రంథాలయాన్ని నిర్మించారు. వివిధ సంస్థలు, వ్యక్తులు గ్రంథాలను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఇది భాషా,సాహిత్య పరిశోధనా కేంద్రంగా ద్రవిడ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పని చేస్తోంది.

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి, నేటి వైభవానికి కారణబూతమైనవాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.

దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్.

Body:
Post date: Sun, 09/02/2012 - 22:10
Path: /node/345

Pages

CSV