<p>ఆదిలాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం బాదన్‌కుర్తి వద్ద కరీంనగర్‌ జిల్లాలో ప్రవేశించింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 9 రోజుల పాటు సాగిన పాదయాత్రలో చంద్రబాబు 138 కి.మీ. నడిచారు. బాదన్‌కుర్తి గోదావరి వంతెన వద్ద జిల్లా అధ్యక్షుడు గోడెం, ఎంపీ రాథోడ్‌ చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం చంద్రబాబు ఆదిలాబాద్‌ అభివృద్ధిపై ప్రత్యేక డిక్లరేషన్‌ ప్రకటించారు.</p>