జాణలమని యంద్రు చపలాత్ములగువారు

పధ్యం:: 

జాణలమని యంద్రు చపలాత్ములగువారు 
తెలివిలేక తమ్ముతెలియలేరు 
కష్టమైన యడవి గాసీలుచున్నారు 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: 
ప్రజలు తమను తాము తెలివిగలవారమనుకుంటారు. తమలోని అజ్ఞానాన్ని గ్రహించరు. తమను తాము తెలుసుకోలేని వారు తపస్సు చేసినా సరైన ప్రయోజనాన్ని పొందక, సారాన్ని గ్రహించలేక అడవుల్లో నివసిస్తూ పలు కష్టాలపాలవుతుంటారు.