నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ

పధ్యం:: 

నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ 
లింగ జీవావేశులను గాంచి భంగపడక 
పూజ మదియందు జేరుట పూర్ణపదవి 
పరము గోరిన నిదిచేయ బాగువేమా

తాత్పర్యము: 
ఎన్ని పనులున్నా కూడా క్షణకాలమైనా తీరిక చేసుకుని నిర్మలమైన మనస్సుతో లింగజీవాత్మ పరమాత్మను నిశ్చలబుద్ధితో చూచి పూజిస్తే పూర్ణపదవి సిద్ధిస్తుంది. మోక్షం కోరుకునే మానవులకు ఇది అవసరం.