తిరుపతిలో ఘనంగా నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు

తెలుగుకు వరాభిషేకం జరిగింది. అమ్మ భాషపై కానుకల జల్లు కురిసింది.

తిరుపతిలో గురువారం అట్టహాసంగా ప్రారంభించిన 'నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల' వేదికపై నుంచి భాషాభివృద్ధికి తోడ్పాటును అందించే దిశగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పలు వరాలను గుప్పించారు.

  • తెలుగు భాష, సంస్కృతికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు
  • సంగీత, నాటక, సాహిత్య, లలితకళల అకాడమీలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
  • ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి పదో తరగతి దాకా కచ్చితంగా తెలుగుభాష బోధనను చేపట్టాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. 
  • తెలుగును పాలనా, బోధనా, ప్రసార మాధ్యమ భాషగా సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఉద్ఘాటించారు.
  • ఇప్పటికే తెలుగుభాషకు ప్రాచీన హోదా సాధించామని.. రాష్ట్ర రాజధానిలో తెలుగుపీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని గుర్తుచేశారు.
మూలం / సేకరణ: 
eenadu.net