తెలుగు బాష ప్రాముఖ్యత (ధ్వితీయ బహుమతి పొందిన వ్యాసం)

మాతృ బాష యొక్క ప్రాముఖ్యత

ఉపోధ్ఘాతం:

మాతృమూర్తిపై, మాతృభూమిపై, మనసున్న ప్రతి మనిషికీ అవ్యాజమైన ప్రేమ, గౌరవం ఉంటుంది. అందుకే, “మాతృదేవోభవ” అని మనకు జన్మనిచ్చిన తల్లిని మొట్టమొదటగా స్మరించుకుంటున్నాం. ‘తల్లి ఒడి మొదటి బడి’ అన్నారు. వ్యక్తి జీవితంలో మొదట నేర్చుకునే బాష మాతృబాష. “జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాధపి గరీయసి” అనడంలో మాత, మాతృభూమి, స్వర్గం కంటే మిన్న అని తెలుస్తుంది. మాతృబాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వచ్చేదే మాతృబాష.

 మాతృబాష:

Mother Tongue అనే ఆంగ్ల పదానికి సమానార్ధకంగా నేడు మాతృబాష అనే పదం వ్యవహారంలో ఉంది. శిశువు మొట్టమొధటిసారిగా తానొక బాషను నేర్చుకుంటున్నాననే జ్ఞానం లేనప్పుడు, తనలో ఉన్న అనుకరణ అనే సహజ ప్రవృత్తితో తన పరిసరాలలోని వారి బాషణాన్ని అనుకరిస్తూ, జీవితంలో  మొట్టమొదటిసారిగా నేర్చుకునే బాషే “మాతృబాష”. శిశువు సౌంధర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడేది మాతృబాష అని గాంధీజీ భావించారు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయులు ఆముక్తమాల్యధ లో తన ఇష్ట ధైవమైన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు తో చెప్పించారు.

 మాతృబాష విశిష్టత – ప్రాముఖ్యత:

మన మాతృబాష తెలుగు. మాతృబాష సహజంగా అలవడుతుంది. అప్రయత్నంగా, సహజంగా వచ్చేది మాతృబాష. ఏ బాషను శిశువు అసంకల్పితంగా మాట్లాడతాడో, ఏ బాష ఇతర బాషల అభ్యసనం పై ప్రభావం చూపుతుందో ఆ బాషనే మాతృబాష అంటారు.

వ్యక్తిత్వం:

తెలుగు బాష స్వతంత్రమైన బాష. తెలుగు బాష సహజ స్వరూపం ఈ బాషలోని మూల పదాలైన సంఖ్యావాచకాలు, సంబంధ నామ వాచకాలు,  సర్వనామాలలో కనపడుతుంది.

లిపి:

తెలుగువారు మొదటి నుండీ రాత విషయంలో చాలా పట్టింపుతో ఆణిముత్యాల వలే, ముత్యాలకోవ వలే రాసే అలవాటు చేసుకున్నట్లు మన సాహిత్యంలో నిదర్శనాలున్నాయి. దేశంలో లీపులలో లేని అందం తెలుగు లిపిలో ఉన్నట్లు గుర్తించవచ్చు. ప్రస్తుత లిపి సుంధరమై, ఆకర్షణీయంగా ఉంది.

వర్ణమాల:

తెలుగు బాషకు ఏ బాషాకూ లేనంత వర్ణమాల ఉంది. ఈ బాషను నేర్చుకోవటం కష్టంగా తోచినా, ఈ వర్ణమాల వలన కలిగే ప్రయోజనం తెలిస్తే దీనిని శ్రమగా భావించలేరు. ఆంగ్లబాషలో వర్ణక్రమం, ఉచ్చారణాలకు పొందిక  లేకపోవటానికి వర్ణమాల చిన్నది కావడమే కారణమని, అంధువల్ల వర్ణమాలను నేర్చుకోవడం సులభమైన ఆ భాషలో పఠన, లేఖన, సంబాషణాదులను అభ్యసించడం కష్టమని అంగీకరించక తప్పధు.

ఉచ్చారణ:  

వేధపఠనం విన్నవారికి ఉచ్చరణలో ఉన్న ఆకర్షణ, మాధుర్యం తెలుస్తుంది. అంధుకు మూల కారణం మన బాషలోని స్వర విశేషమే.

స్పష్టత:

ఏ బాషకూ లేనంత అచ్చులా సంపద ఉండి, ఆయా బాషలలాగా హలంతంగాక , పద మధ్యంలో అక్షరాలను హల్లులలాగే తేల్చి మింగి పలికే బాష కాకపోవటంతో, ఆ బాషలలో లేని స్పష్టత, అవగాహనా సౌలభ్యం తెలుగు బాషాకు ప్రత్యేక లక్షణాలుగా బాషిస్తున్నాయి.

శ్రావ్యత:

తెలుగు బాష అజంత బాష కావటం వలన ప్రతి పదాన్ని స్పష్టంగా పలికే వీలవుతోంది. అజంతమవడంలో ఈ బాషకు స్పష్టతే కాకుండా శ్రావ్యత కూడా సమకూరింది. స్వాతిశయాభిమానానికి పేరువదిన పలువురు సంగీతంలో పారమ్య సంపాదనకు త్యాగరాజ కృతులను అభ్యసింపక తప్పుట లేదనడమే తెలుగుభాషలోని ప్రత్యేకతకు నిదర్శనం.

మాధుర్యం:

తెలుగు మాధుర్యం మన దేశీయులనే కాకుండా, విదేశీయులను కూడా ఆకర్షించ గలగడం విశేషం. దీనికి శ్రీ సి.పి బ్రౌన్ తెలుగు బాష గురించి చేసిన ప్రశంసమే తార్కాణం.

సంధి:

సంధి ఈ బాషకుగల సహజ లక్షణం.  ఉధా: చింత-ఆకు, ఏమి – అది, ఏమి – అన్నాను, దాని – అంత మొదలగునవి .

సారళ్యం:

సంస్కృత బాషలో అరుధైన సారళ్యం తెలుగు బాషలో కుదురుకొని ఉండటం మరొక విశేషం.

సౌకుమారం:

దీర్ఘాలైన మాతలుగానీ, సమాసాలుగానీ లేకుండా ఆలతి పదాల కూర్పు తెలుగు భాషా సౌకుమార్యతకు, సోయగానికి వృష్టాంతమవుతుందోంది.

గాంభీర్యం:

సంస్కృత భాష నుంచి సంక్రమించిన స్థిరాక్షర మహాప్రాణధుల వల్ల శబ్ధగాంబీర్యం చేకూరి ఎంతటి గంభీర భావాన్నైనా ప్రకటించగల సామర్ధ్యం ఈ బాషకు అలవడింది.

జంట కట్టుట:

ఇది ఈ బాషకు గల వేశేష లక్షణం. ఆటా-పాటా, మాటా-మంతి మొదలగునవి.

యతి ప్రాసలు:

యతిప్రాసలు ఈ బాషకు జీవగఱ్ఱ. వీటివల్ల దీనికి కలుగుతున్న సొగసు, మాధుర్యం ఇంతింత అని చెప్పలేం. తెలుగువారి వ్యవహారంలో ఇవి అప్రయత్నంగా ప్రత్యక్షమవుతాయి. ఇవి అసామాన్య లక్షణాలు కలిగి ఉండటం వల్లనే “దేశబాషలంధు తెలుగు లెస్స” అని కవి సార్వభౌముడు శ్రీనాథుడు కీర్తించాడు.

విదేశీయుల ప్రశంశలు:

ఆనాటి రాయలచేతనేకాక తెలుగుబాష ప్రాచ్య భాషలో మాధురీభరితమై మకుటాయమానము అవుతోందని పాశ్చాత్యులూ ప్రస్తుతించారు. ఆ గౌరవం పొందటానికి తెలుగుబాషకుగల అర్హత మరి ఏ ఇతర బాషలకు లేదని అయితే, విజ్ఞాన సాంకేతిక పదజాలనికది పుట్టినిల్లు కాగలదని వక్కాణించారు.

అధికార బాషగా తెలుగు:

ఒక జాతి సాంస్కృతిక అభివృద్దికి కీలకమైన వాటిలో భాష కూడా ఒకటి. ఒక జాతి నాగరికతను, సంస్కృతిని, ప్రజాజీవనాన్ని బాష ప్రతిభింబిస్తుంది. బాష కేవలం భావవ్యక్తీకరణ, బావ ప్రకటన సాధనంగానేకాక, భావాలను సమైఖ్యపరిచి భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటానికి దోహదం చేస్తుంది. పరిపాలన నిర్వహించడానికి ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాష అధికార భాష అవుతోంది.

బోధన మాధ్యమంగా తెలుగు ప్రయోజనాలు:

బోధన మాధ్యమంగా తెలుగు ఉండటంవల్ల కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి,

  • మాతృబాషలో విషయాన్ని వ్యక్తం చేయడం, బోధించడం, అభాసించడం సులభం.
  • మాతృభాషలో అధ్యయనం వల్ల కంఠస్థం చేయకుండా భావాలను గుర్తుపెట్టుకొని రాయవచ్చు.
  • మాతృభాషలో విధ్యార్థి స్వయంగా చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకొంటాడు.
  • మాతృభాష మాధ్యమం వల్ల దేశీయ భాషలు అభివృద్ది చెందుతాయి.
  • మాతృభాష మాధ్యమంవల్ల అధ్యయనం చురుకుగా సాగుతోంది.
  • సామాజిక స్పృహ పెంపొందుతుంది.
  • మాతృభాష మాధ్యమంలో విధ్యార్ధులకు అభ్యసనం క్రీడలా తోచి మానసిక శ్రమ, అలసట లేకుండా ఉల్లాసంగా వివిధ విషయాలను సులభంగా నేర్చుకొంటాడు.
  • మాతృభాషా మాధ్యమంలో చదవడంవల్ల ఆ భాషకు తగిన గౌరవం కల్పించిన వారమవుతాం.

బోధనా మాధ్యమంగా తెలుగులో సమస్యలు:

బోధనా మాధ్యమంగా తెలుగు అమలులో పలు సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి

  1. అనువాద సమస్యలు
  2. విదేశీ ఉధ్యోగాల సమస్య
  3. పోటీ పరీక్షలలో సమస్యలు

అనువాద  సమస్య:

ఆంగ్ల బాషలో ఉన్న గ్రంథాలను తెలుగులోకి అనువదించటం కష్టమని కొందరంటారు. పారిభాషిక పదాలకు సరైన పదాలను తెలుగులో రాయలేమని కొందరు బావిస్తారు.

నివారణ:

నన్నయ్యకు ముందు తెలుగులో రచనలు లేనప్పుడు, సంస్కృత పదాలకు కొన్ని చేర్పులు చేసి తెలుగు పధాలుగా తెలుగులో భారతానువాదం చేయలేదా??

విదేశీ ఉధ్యోగాల సమస్య:

ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళి ఉధ్యోగాలు చెయ్యాలంటే, తెలుగు మాధ్యమంలో చదివినవారు పనికిరారని, ఆంగ్లమాధ్యమంలో చదివినవారే పనికివస్తారని ఒక అభిప్రాయం.

నివారణ:

గతంలో అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసిన వావిలాల గోపాలకృష్ణయ్య ఏమన్నారో చూడండి. ‘ఇంగ్లీష్ లో చదివిన అందరికీ ఉధ్యోగాలిస్తే, నా ఉధ్యమం మానుకుంటాను’. అమెరికా పోయే నాలుగురికోసం అంతా ఇంగ్లీష్ లోనే చదవాలా?. కానీ మనదేశంలో  తృభాషా సూత్రం ప్రకారం మూడు భాషలు కొన్ని రాష్ట్రాల వారు విధిగా నేర్చుకున్నా, ఆంగ్ల బాషను తప్పకుండా నేర్చుకుంటున్నారు.

పోటీ పరీక్షలలో సమస్యలు:

అఖిలభారత సర్వీసులకు, మెడికల్. ఇంజనీరింగ్ వంటి పోత్ర్ర్ పరీక్షలలో ఆంగ్ల మాధ్యమంలో చదివిన విధ్యార్థులే రాణిస్తారని, మాతృబాషలో చదివిన వారు రాణించలేరని అనుకోవడం పొరపాటు. ఈ మధ్యకాలంలో పలువురు గ్రామీణ విధ్యార్థులు, మాతృభాష మాధ్యమంగా చదివినవారు పోటీ పరీక్షలలో, ఉధ్యోగాల అర్హత పరీక్షలలో అత్యుథ్హమ ప్రతిభను ఛాతీ కేంధ్ర సివిల్ సర్వీసెస్ ఉధ్యోగాలకు ఎంపిక అవుతున్నారు.

ఇతర నైపుణ్యాలు:

ఉపాధ్యాయుడికి అన్యాశాస్త్రాలు, భాషాసాహిత్యాలు పరిచయం ఉండాలి. తెలుగు భాష పై, సాహిత్యం పై ప్రభావం చూపిన ఇతరదేశ భాషలు, వాటి సాహిత్యాలు పరిచయం ఉండాలి

ముగింపు:

ప్రస్తుతం ప్రపంచంలో తెలుగు భాష పలుచోట్ల వాడుకలో ఉంది. ప్రపంచంలో 16వ స్థానంలో ఉంది. దేశంలో రెండవ స్థానంలో ఉంది. ఈ విధంగా తెలుగు ప్రపంచ భాషగా ఒక గొప్ప విశిష్టతను కలిగి ఉంది. అధికార భాషగా తెలుగు అమలుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో వ్యవహరించాలి. సెలవు చీటి ధగ్గర నుండి ఆఫీసు వ్యవహారం వరకు కచ్చితంగా తెలుగునే అమలు చెయ్యాలి

 అల్లు మంగ,
10వ తరగతి. జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల,
పెదనందిపల్లి గ్రామం, దేవరాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా